- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Stock market: బ్యాంకింగ్ షేర్లలో ఒత్తిడి.. ఆరంభ లాభాలు ఆవిరి
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 34, నిఫ్టీ 18 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం రికార్డు గరిష్ఠాల వద్ద ప్రారంభమైన సూచీలు.. ఇంట్రాడేలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో ఒత్తిడి కారణంగా సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఎస్బీఐ షేర్లు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
సెన్సెక్స్ ఉదయం 79,840.37 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 79855.87 పాయింట్ల వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసింది. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. చివరికి 34.74 పాయింట్ల నష్టంతో 79,441.45 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 24,236 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేసి చివరికి 18 పాయింట్ల నష్టంతో 24,123.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.50గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఎల్అండ్టీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభపడగా.. భారతీ ఎయిర్టెల్, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టపోయాయి. ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ తయారీ సంస్థ అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్ సంస్థ స్వల్ప లాభాలతో లిస్టయింది. ఇష్యూ ధర రూ.281 కాగా.. 13.87 శాతం ప్రీమియంతో రూ.320 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.324 వరకు వెళ్లిన షేరు ధర చివరికి రూ.317.90 వద్ద ముగిసింది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 87 డాలర్ల వద్ద, ఔన్సు బంగారం ధర 2333 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టీవ్ జాబ్స్తో కలిసి పనిచేసిన ఆ రోజులు మరిచిపోలేను: ఐఫోన్ మాజీ డిజైనర్
Steve Jobs: యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ నాయకత్వంలో పనిచేసిన రోజులు అద్భుతమైనవంటూ ఐఫోన్ మాజీ డిజైనర్ జోనీ ఐవ్ అన్నారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆయన స్టీవ్తో పనిచేసిన క్షణాల్ని గుర్తుకు తెచ్చుకున్నారు. -
జుడియో, మింత్రాకు పోటీగా.. భారత్లోకి షీయెన్ బ్రాండ్ రీఎంట్రీ!
Shein brand: దేశీయ ఫాస్ట్ ఫ్యాషన్ మార్కెట్లోకి చైనాకు చెందిన షీయెన్ బ్రాండ్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఏడాదిక్రితం ఈమేరకు రిలయన్స్తో ఆ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
రికార్డుల వద్ద ప్రారంభమై.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 62, నిఫ్టీ 15 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
8 నెలల గరిష్ఠానికి నిరుద్యోగ రేటు.. వెల్లడించిన సీఎంఐఈ
Unemployment rate: దేశంలో నిరుద్యోగం రేటు 8 నెలల గరిష్ఠానికి చేరింది. ఈ విషయం సీఎంఐఈ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడైంది. -
12GB ర్యామ్తో మోటో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. ధర, ఫీచర్లివే..
Motorola Razr 50 Ultra: మోటోరోలా నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చింది. 12జీబీ ర్యామ్తో వస్తోన్న ఈ ఫోన్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. -
బజాజ్ నుంచి సీఎన్జీ బైక్.. రిలీజ్కు ముందే వివరాలు లీక్!
Bajaj CNG Bike: బజాజ్ సీఎన్జీ బైక్ జులై 5న విడుదల కానుంది. ఈనేపథ్యంలో కొన్ని వివరాలు బయటకొచ్చాయి. -
టీమ్ఇండియా కోసం ఆ విమానం పంపారా?.. ఎయిరిండియాను ఆరాతీసిన డీజీసీఏ
Air India: బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్లో చిక్కుకున్న టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రత్యేక ఎయిరిండియా విమానంలో భారత్కు చేరుకున్నారు. అయితే, వారికి పంపిన విమానం ముందస్తుగా షెడ్యూల్ చేసిందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై డీజీసీఏ వివరణ కోరింది. -
ఎన్నో టాయిలెట్లు కడిగా: దిగ్గజ కంపెనీ సీఈఓ
Nvidia CEO: ప్రపంచంలో ఏ పనీ చిన్నది కాదు అంటున్నారు ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్. తాను ఒకప్పుడు టాయిలెట్లు కూడా కడిగానని చెప్పారు. -
అన్లిమిటెడ్ క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ ఆరోగ్య బీమా పాలసీ!
ICICI Elevate Plan: అపరిమిత క్లెయిం మొత్తంతో ఐసీఐసీఐ కొత్త ఆరోగ్య బీమా పాలసీని తీసుకొచ్చింది. ఎలివేట్ పేరిట తీసుకొచ్చిన ఈ పాలసీలోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. -
రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంతో 80,210 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 71 పాయింట్లు పుంజుకొని 24,357 వద్ద ట్రేడవుతోంది. -
సెన్సెక్స్ రికార్డు పరుగు
బీఎస్ఈ సెన్సెక్స్ చరిత్రలో బుధవారం మరో చిరస్మరణీయ రోజు. సూచీ తొలిసారిగా 80,000 పాయింట్ల శిఖరాన్ని సునాయాసంగా అధిరోహించింది. 70000 పాయింట్ల నుంచి 80,000 పాయింట్లకు 7 నెలల్లోపే (138 ట్రేడింగ్ రోజులు) దూసుకెళ్లడం విశేషం. -
హైదరాబాద్లో 40% పెరిగిన కార్యాలయాల అద్దె లావాదేవీలు
అంతర్జాతీయ సంస్థలతో పాటు, దేశీయ కంపెనీలూ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడంతో, హైదరాబాద్లో కార్యాలయాల స్థలానికి గిరాకీ పెరిగింది. -
అధునాతన సాంకేతికతపై రూ.230 కోట్ల పెట్టుబడులు
అధిక నాణ్యత ఉన్న గాజు ప్యాకేజింగ్ ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని, అందుకు తగ్గట్లుగా సిద్ధం అయ్యేందుకు రూ.230 కోట్ల వ్యూహాత్మక పెట్టుబడులు పెడుతున్నట్లు ఏజీఐ గ్రీన్ప్యాక్ వెల్లడించింది. -
ప్రాయోజిత గ్రూపు సంస్థల షేర్లలో 25% మించి పెట్టుబడులు పెట్టొచ్చు
ప్రాయోజిత సంస్థ (స్పాన్సర్స్)కు చెందిన గ్రూపు కంపెనీల షేర్లలో 25 శాతానికి మించి పెట్టుబడులు పెట్టేందుకు ప్యాసివ్ ఫండ్స్కు సెబీ అనుమతినిచ్చింది. ఈ మేరకు మ్యూచువల్ ఫండ్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. -
‘కూ’త ఆగింది
దేశీయ సామాజిక మాధ్యమం ‘కూ’ మూతపడింది. ట్విటర్ (ప్రస్తుత ఎక్స్)కు పోటీగా, ప్రత్యామ్నాయంగా వచ్చామని తొలినాళ్లలో చెప్పుకున్న కూ ఇక పనిచేయదు. -
పటిష్ఠంగా నష్ట నియంత్రణ వ్యవస్థలు
పాలనా ప్రమాణాలను మెరుగుపర్చుకోవడంతో పాటు నష్ట నియంత్రణ వ్యవస్థలు, విధానాలను పటిష్ఠం చేసుకోవాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నరు శక్తికాంత దాస్ సూచించారు. -
రూ.10 లక్షల కోట్లకు ఆహార సేవల విపణి
దేశీయంగా ఆహార సేవల విపణి 2030 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని బెయిన్ అండ్ కంపెనీ, స్విగ్గీ సంయుక్త నివేదిక వెల్లడించింది. వినియోగదార్ల సంఖ్య అప్పటికి 45 కోట్ల వరకు చేరొచ్చని అంచనా వేసింది. -
గేమ్ డెవలప్మెంట్లో కృత్రిమ మేధ
సొంతంగా మొబైల్, ఆన్లైన్ గేములు ఆవిష్కరించే సంస్థ అయిన 7సీస్ ఎంటర్టైన్మెంట్, ఇకపై గేమ్ డెవలప్మెంట్లో ఏఐ (కృత్రిమ మేధ) ని విస్తృతంగా వినియోగించనుంది. -
ఇంటి వద్దా ఆరోగ్య సేవలు: స్టార్ హెల్త్
ఇంటి వద్దకే ఆరోగ్య సంరక్షణ సేవలను, తమ పాలసీదార్లకు అందించడాన్ని బీమా కంపెనీ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ బుధవారం ప్రారంభించింది. -
దేశంలో పేదరికం తగ్గింది!
దేశంలో పేదరికం తగ్గిందని ఆర్థిక మేధో సంస్థ ఎన్సీఏఈఆర్ విడుదల చేసిన అధ్యయన పత్రంలో వెల్లడించింది. 2011-12లో దేశంలో 21.2% పేదరికం ఉండగా, 2022-24 మధ్య 8.5 శాతానికి పరిమితమైందని పేర్కొంది. -
ద్రవ్యలోటు 4 శాతమైతే రెండేళ్లలో రేటింగ్ పెంపు!
అప్పుల నిర్వహణ సరిగ్గా ఉండి, ద్రవ్యలోటును జీడీపీలో 4 శాతానికి తీసుకొస్తే, వచ్చే 24 నెలల్లో భారత రేటింగ్ పెంపునకు అవకాశాలు ఉంటాయని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టరు ఈఫార్న్ ఫ్యూహా వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఝార్ఖండ్ సీఎంగా.. ప్రమాణస్వీకారం చేసిన హేమంత్ సోరెన్
-
‘అమ్మాయిలను ఆ ఒక్క ప్రశ్న అడగొద్దు’: శ్రుతి హాసన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆచూకీ లేని ‘భోలే బాబా’.. బాధితుల్లో ఆక్రోశం!
-
విడాకుల రూమర్స్ వేళ.. పాండ్యా సతీమణి పోస్టు వైరల్
-
టీడీఆర్ బాండ్లలో అక్రమాలపై విచారణ.. నివేదికలు వచ్చాకే చర్యలు: మంత్రి నారాయణ