Stock market: రికార్డుల వద్ద ప్రారంభమై.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 62, నిఫ్టీ 15 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Updated : 04 Jul 2024 16:14 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఆరంభంలోనే రికార్డు లాభాలతో ప్రారంభమైన సూచీలు.. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో గురువారం స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. అయినప్పటికీ జీవనకాల గరిష్ఠాల వద్ద వరుసగా నాలుగో రోజూ సూచీలు లాభాల్లో ముగియడం గమనార్హం.

సెన్సెక్స్‌ ఉదయం ఆరంభంలోనే 80,321.79 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80,392.64 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసింది. చివరికి 62.87 పాయింట్ల లాభంతో 80,049.67 వద్ద ముగిసింది. నిఫ్టీ 15.65 పాయింట్లు లాభపడి 24,302.15 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.50గా ఉంది. సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, సన్‌ఫార్మా, టీసీఎస్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ 86.79 డాలర్లు, బంగారం ఔన్సు 2,365 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు