Stock market: నష్టాలతో ప్రారంభమై.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Stock market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 53 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 21 పాయింట్లు లాభపడింది.

Published : 05 Jul 2024 15:52 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో కాస్త గట్టెక్కాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు సూచీలను పడేయగా.. జియో ఐపీఓ వార్తల నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో కొనుగోళ్లు సూచీలను కొంతవరకు నిలబెట్టాయి.

సెన్సెక్స్‌ ఉదయం 79,778.98 వద్ద ఆరంభంలోనే నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 79,478.96 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో కోలుకుని చివరికి 53.07 పాయింట్ల లాభంతో 79,996.60 వద్ద ముగిసింది. నిఫ్టీ 21.70 పాయింట్ల లాభంతో 24,323.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.48గా ఉంది. సెన్సెక్స్‌లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, రిలయన్స్‌, ఎన్టీపీసీ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభపడగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటాన్‌, టాటా స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 87.30 డాలర్లు, బంగారం ఔన్సు 2371 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు