- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Hindenburg: హిండెన్బర్గ్కు సెబీ షోకాజ్
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విషయంలో ‘సహేతుకం కాని ట్రేడింగ్’ జరిపిందంటూ అమెరికా షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్పై భారత మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఆరోపణలు చేసింది.
అవి అర్థం లేని నోటీసులన్న అమెరికా షార్ట్సెల్లింగ్ సంస్థ
అవినీతిని వెలికితీసేవారి నోరు మూయించేందుకేనని ఆరోపణలు
దిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విషయంలో ‘సహేతుకం కాని ట్రేడింగ్’ జరిపిందంటూ అమెరికా షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్పై భారత మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఆరోపణలు చేసింది. ఆ సంస్థకు షోకాజ్ నోటీసు సైతం జారీ చేసింది. 2023 జనవరిలో విడుదల చేసిన నివేదికలో ‘సంచలనం చేయడం కోసం, కావాలనే కొన్ని నిజాలను హిండెన్బర్గ్ దాచిపెట్టిందని’ తాజా నోటీసుల్లో సెబీ పేర్కొంది. ఈ ఏడాది జూన్ 26న సెబీ జారీ చేసిన నోటీసులపై హిండెన్బర్గ్ మంగళవారం స్పందించింది. అదానీ కంపెనీల షేర్ల ట్రేడింగ్ ద్వారా తాము 4.1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.34 కోట్ల) లాభాలనే పొందినట్లు పేర్కొంది. తమ నివేదికలో అదానీ గ్రూప్పై చేసిన ఆరోపణలపై, నిర్వహించాల్సిన దర్యాప్తుపై దృష్టి సారించకుండా సెబీ తమపై తిరిగి ఆరోపణలు చేస్తోందని హిండెన్బర్గ్ విమర్శించింది.
కోటక్ పేరును కావాలనే మరిచారా?
భారత్కు చెందిన కోటక్ బ్యాంక్ పేరును సెబీ నోటీసుల్లో ప్రస్తావించకుండా, కావాలనే మరిచిపోయిందని హిండెన్బర్గ్ పేర్కొంది. ‘హిండెన్బర్గ్ పెట్టుబడిదారు, భాగస్వామి వినియోగించిన ఆఫ్షోర్ ఫండ్ను సృష్టించింది, నిర్వహించింది కోటక్యేనని.. కావాలని కోటక్ పేరును రాయకుండా.. కేఎమ్ఐఎల్ అంటూ ఒక ‘మాస్క్’ను సెబీ తొడిగిందని’ని ఆరోపించింది. కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్ (కేఎమ్ఐఎల్) అనేది కోటక్ మహీంద్రా బ్యాంక్ చెందిన సంస్థ.
గతేడాది జనవరిలో హిండెన్బర్గ్ విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్నకు చెందిన నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల (ప్రస్తుత డాలర్ విలువ ప్రకారం సుమారు రూ.12.45 లక్షల కోట్ల) మేర తుడిచిపెట్టుకుపోయిన విషయం విదితమే. హిండెన్బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశంతో చేసినవని అదానీ గ్రూప్ పేర్కొంటూ వచ్చింది. సుప్రీం కోర్టు కూడా ఈ ఏడాది జనవరిలో సెబీ దర్యాప్తునకు మించి ఇతర దర్యాప్తులేవీ అవసరం లేదనీ స్పష్టం చేసింది.
కోటక్ ఏమందంటే..
కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్ (కేఎమ్ఐఎల్) ఒక ఆఫ్షోర్ ఫండ్ ఏర్పాటు చేసిందన్న హిండెన్బర్గ్ ఆరోపణలపై కోటక్ స్పందించింది. కేఎమ్ఐఎల్కు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్గా ఉన్న కే-ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ (కేఐఓఎఫ్) సెబీ నమోదిత ఎఫ్పీఐ అని.. అది ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ ఆఫ్ మారిషస్ నియంత్రణలో ఉందని సంస్థ ప్రతినిధి వివరించారు. కేఐఓఎఫ్ క్లాస్ ఎఫ్ షేర్లను కింగ్డ్న్ క్యాపిటల్ సబ్స్రైబ్ చేసిందనీ తెలిపింది. అదానీ ఎంటర్ప్రైజెస్కు చెందిన 8.5 లక్షల ఫ్యూచర్ షేర్లను షార్ట్ పొజిషన్ల రూపంలో కేఐఓఎఫ్ తీసుకుంది. నివేదిక వెలువడిన అనంతరం 22.25 మి. డాలర్ల (దాదాపు రూ.183 కోట్లు) లాభం పొందిందనీ వివరించింది. ఈ ఫండ్ ఏ క్లయింటును తీసుకునే సమయంలోనైనా కేవైసీని పాటిస్తుందని.. కేఎమ్ఐఎల్కు కానీ కేఐఓఎఫ్కు కానీ హిండెన్బర్గ్ క్లయింటుగా లేనట్లు ఆ ప్రతినిధి స్పష్టం చేశారు. తమ ఫండ్కు చెందిన పెట్టుబడిదార్లతో హిండెన్బర్గ్ భాగస్వామిగా ఉందని తమకు తెలియదనీ తెలిపారు. విడుదలకు ముందే నివేదికను కింగ్డన్ క్యాపిటల్ మేనేజ్మెంట్తో హిండెన్బర్గ్ పంచుకుంది.
మమ్మిల్ని బెదిరించడానికే నోటీసులు
కేవలం తమను బెదిరించడానికే సెబీ నోటీసులు జారీ చేసిందని హిండెన్బర్గ్ పేర్కొంది. అవినీతిని, మోసాలను బయటపెట్టిన వారిని బెదిరించడానికి, భారత్లో ఉన్న అత్యంత శక్తిమంత వ్యక్తులను కాపాడడానికే ఈ నోటీసులని ఆరోపించింది. ‘కోటక్ బ్యాంక్ వ్యవస్థాపకుడైన ఉదయ్ కోటక్ వ్యక్తిగతంగా సెబీకి చెందిన 2017 కమిటీ ఆన్ కార్పొరేట్ గవర్నెన్స్కు నేతృత్వం వహించారు. కోటక్ కానీ, ఇతర కోటక్ బోర్డు సభ్యుడి పేరును కానీ సెబీ ఎందుకు పేర్కొనలేదు. మరో శక్తిమంత భారతీయ వ్యాపారవేత్తను కాపాడడానికేనా’ అని హిండెన్బర్గ్ ప్రశ్నించింది.
21 రోజుల సమయం
కింగ్డన్తో హిండెన్బర్గ్ అనుబంధం 2022 చివర్లోనే మొదలైందని.. అంటే నివేదికకు ముందు ఇది జరిగిందని 46 పేజీల నోటీసులో సెబీ ఆరోపించింది. అదానీ కంపెనీల షేర్లలో షార్ట్ పొజిషన్లు తీసుకున్న కింగ్డన్, హిండెన్బర్గ్ నివేదిక విడుదల చేశాక.. షేర్ల విలువలు పతనం కావడంతో, ఆ పొజిషన్లను వదిలించుకోవడం ద్వారా సొమ్ముచేసుకుందని సెబీ ఆరోపించింది. ఈ ఆరోపణలపై స్పందించడానికి హిండెన్బర్గ్కు 21 రోజుల సమయం ఇచ్చింది. తాము అదానీ కంపెనీల షేర్ల షార్ట్ సెల్లింగ్ ద్వారా 4.1 మి. డాలర్లను పొందినట్లు హిండెన్బర్గ్ అంగీకరించింది. అదానీ అమెరికా బాండ్లను ఒక పెట్టుబడిదారు ద్వారా షార్ట్ సెల్ చేయడం ద్వారా 31,000 డాలర్లు పొందినట్లు తెలిపింది. అయితే ఆ పెట్టుబడిదారు ఎవరో చెప్పలేదు.
మాకు ఒక్క భాగస్వామే..
‘అదానీ షేర్లను షార్ట్ చేయడం కోసం డజన్ల కొద్దీ కంపెనీలతో కలిసి హిండెన్బర్గ్ పనిచేసిందా.. వందల మిలియన్ల కొద్దీ డాలర్లను ఆర్జించిందా? అని షోకాజ్ నోటీసులో అడిగారు. మేం అటువంటిదేమీ చేయలేదు. కేవలం ఒకే పెట్టుబడిదారుతో కలిసి పనిచేశాం. మాకు ఖర్చులకు కూడా ఆ లాభాలు సరిపోలేదు. ఇప్పటికీ మా ఆరోపణలకు అదానీ సరైన వివరణ ఇవ్వలేద’ని హిండెన్బర్గ్ పేర్కొంది. ‘ఇదేమీ పెద్ద అంతుబట్టని విషయం కాదు. అదానీ షేర్లను మేం షార్ట్ చేశామని ముందు నుంచీ చెబుతూనే వచ్చామ’ని ఈ సందర్భంగా పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి
హైదరాబాద్లో 2024 జనవరి-జూన్లో 18,573 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయమైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. -
మార్కెట్లు పెరుగుతున్నాయ్.. జాగ్రత్త
ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ సూచించారు. -
ఎల్ఐసీ ‘జీవన్ సమర్థ్’ ప్రాజెక్టు
తమ వ్యవస్థను మరింత మెరుగు పరచుకునే లక్ష్యంతో ‘జీవన్ సమర్థ్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) గురువారం ప్రకటించింది. -
సిమెంట్ రంగంలో 2-3 శాతం వృద్ధి!
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో సిమెంట్ రంగంలో 2-3% వృద్ధి నమోదు కావొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. -
ఆకర్షణీయంగా ఆఫీస్లు
ఉద్యోగుల వలసలను ఆపడంతో పాటు.. కార్యాలయాలకు వచ్చేలా వారిని ఆకర్షించేందుకు ‘ఆఫీస్ పీకాకింగ్’నకు పలు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. -
స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించనున్న రేమండ్
స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించి, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ప్రత్యేక సంస్థగా నమోదు చేయనున్నట్లు రేమండ్ లిమిటెడ్ గురువారం ప్రకటించింది. -
రూ.447.30 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పెద్ద షేర్లు రాణించడంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల ఎగువన ముగిసింది. -
వ్యవసాయ రుణాలకు ప్రత్యేక కేంద్రాలు: ఎస్బీఐ
వ్యవసాయ రుణాల కోసం అగ్రికల్చరల్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్స్ పేరుతో 35 ప్రత్యేక కేంద్రాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రారంభించింది. -
అన్వితా గ్రూప్ రూ.2000 కోట్ల స్థిరాస్తి ప్రాజెక్టు
స్థిరాస్తి సేవల సంస్థ అన్వితా గ్రూప్ హైదరాబాద్ శివార్లలోని కొల్లూరులో రూ.2,000 కోట్ల విలువైన నూతన గృహ సముదాయ ప్రాజెక్టు ఇవానాను చేపట్టింది. -
మహిళా పారిశ్రామికవేత్తతో ఈఈఎస్ఎల్ ఒప్పందం
విద్యుత్తు ఆదా చేసే సాధనాల వినియోగంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త పద్మ వథ్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. -
బ్రోకరేజీల్లో మోసాల అడ్డుకట్టకు ఒక వ్యవస్థ!
స్టాక్ మార్కెట్లో మదుపర్ల ప్రయోజనాలను రక్షించేందుకు.. మోసాలను కనిపెట్టి, వాటిని అరికట్టే ఒక సంస్థాగత వ్యవస్థను బ్రోకింగ్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలని సెబీ గురువారం ఆదేశించింది. -
సిలిండర్లకు క్యూఆర్ కోడ్!
నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పెసో (పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్)ను ఆదేశించారు. -
జీఎస్టీ ఆదాయంలో కేంద్రం భారీ త్యాగం
జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి, రాష్ట్రాలకు పరిహారం చెల్లించడం కోసం జీఎస్టీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కేంద్రప్రభుత్వం త్యాగం చేయాల్సి వచ్చిందని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు. -
పెట్టుబడుల ఉపసంహరణ భారీ స్థాయిలో లేనట్లే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2.1 లక్షల కోట్ల డివిడెండును కేంద్రానికి ఇవ్వడంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో భారీ స్థాయి పెట్టుబడుల ఉపసంహరణలు ఉండకపోవచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ కేర్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లో మోసాలు చేసే వారి గురించి తమకు తెలియజేయాలని మార్కెట్ వర్గాలకు సెబీ ఛైర్మన్ మాధబి పురి బచ్ పిలుపునిచ్చారు. -
యులిప్.. ఎప్పుడు తీసుకోవాలంటే..
బీమా.. పెట్టుబడి కలిసి ఉండే యూనిట్ ఆధారిత బీమా పాలసీ(యులిప్)లు కాస్త భిన్నమైన పథకాలనే చెప్పాలి. ఇప్పటి వరకూ వీటిని బీమా సంస్థలు పెట్టుబడి పథకాలుగానే చెబుతూ పాలసీదారులకు విక్రయించేవి. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
మీ డబ్బు సురక్షితంగా..
ఆర్థిక లావాదేవీలు డిజిటల్లో సులువుగా చేసేస్తున్నాం. అదే సమయంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భద్రత అనేది కీలకంగా మారుతోంది. -
పింఛను పాలసీ తీసుకోవచ్చా?
బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే కార్పొరేట్ బాండ్లు కాస్త అధిక రాబడిని ఇచ్చే మాట వాస్తవమే. కానీ, పెద్ద కంపెనీలు, క్రెడిట్ రేటింగ్ బాగున్న వాటినే ఎంచుకోవాలి. -
క్రెడిట్ స్కోరు ఈ సంగతులు తెలుసుకోండి
ప్రతి చిన్న అవసరానికీ అప్పు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. క్రెడిట్ బ్యూరో ఎక్స్పీరియన్ ఇండియా నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రుణ వితరణలో 19 శాతం వరకూ వృద్ధి నమోదయ్యింది. -
విద్యుత్తు ఉపకరణాల సంస్థల్లో
విద్యుత్తు రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విద్యుత్తు సరఫరా, పంపిణీ విభాగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతోంది.