- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Adani Hindenburg Row: అదానీ హిండెన్బర్గ్ వివాదంలో కొత్త మలుపు.. మధ్యలో కోటక్ బ్యాంకు ప్రస్తావన!
Adani Hindenburg Row: అదానీ హిండెన్బర్గ్ వివాదంలోకి తాజాగా కోటక్ బ్యాంకు కూడా వచ్చి చేరింది. సెబీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు స్పందిస్తూ.. హిండెన్బర్గ్ తాజాగా మరికొన్ని ఆరోపణలు చేసింది.
Adani Hindenburg Row | దిల్లీ: అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్, భారత వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ల మధ్య వివాదం (Adani Hindenburg Row) మంగళవారం మరో కొత్త మలుపు తిరిగింది. భారత క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ (SEBI) నుంచి తమకు షోకాజ్ నోటీసులు అందినట్లు హిండెన్బర్గ్ వెల్లడించింది. అదానీ (Adani Group) స్టాక్స్పై పెట్టుబడుల్లో తాము నిబంధనల్ని ఉల్లంఘించినట్లు అందులో పేర్కొన్నట్లు తెలిపింది. తాజా పరిణామాల్లో భాగంగా కోటక్ బ్యాంకును కూడా ఈ వ్యవహారంలోకి లాగడం గమనార్హం.
అర్థం లేని నోటీసులు..
సెబీ షోకాజ్ నోటీసులను హిండెన్బర్గ్ (Hindenburg) ‘అర్థం లేనివి’గా కొట్టిపారేసింది. ఉద్దేశపూర్వకంగా జారీ చేసిందని ఆరోపించింది. ‘భారత్లోని శక్తిమంతమైన వ్యాపారవేత్తల లోపాలను ఎత్తిచూపే వారిని బెదిరించే చర్య’గా అభివర్ణించింది. అదానీ గ్రూప్ (Adani Group) అవకతవకలను బయటపెట్టిన సమయంలోనే తాము ఆయా కంపెనీల స్టాక్స్పై షార్ట్ చేసినట్లు స్పష్టంగా వెల్లడించామని పేర్కొంది. అంటే అదానీ షేర్ల పతనాన్ని ముందే అంచనా వేసి వాటిపై ట్రేడ్ చేసినట్లు బహిర్గతం చేశామంది.
కోటక్ బ్యాంకు ప్రస్తావన..
కోటక్ బ్యాంకు విదేశీగడ్డపై ఓ ఫండ్ను ఏర్పాటుచేసినట్లు హిండెన్బర్గ్ వెల్లడించింది. దాన్ని ఉపయోగించుకొని ఓ పెట్టుబడి భాగస్వామి ద్వారా అదానీ స్టాక్స్ను షార్ట్ చేసినట్లు ఆరోపించింది. దీనివల్ల కోటక్ బ్యాంకు పెద్దగా లాభాలు మాత్రం ఆర్జించలేకపోయిందని తెలిపింది. ఆ పెట్టుబడి భాగస్వామి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. సెబీ (SEBI) అందించిన షోకాజ్ నోటీసుల్లో ఎక్కడా కోటక్ పేరు గానీ, ఆ సంస్థ బోర్డు సభ్యుల ప్రస్తావన గానీ లేదని హిండెన్బర్గ్ పేర్కొంది. దీన్నిబట్టి సెబీ మరో శక్తిమంతమైన భారత వ్యాపారవేత్తను రక్షించే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆరోపించింది.
ఫార్మా షేర్లు కోలుకుంటున్నాయ్
మేం పొందిందేం లేదు..
మరోవైపు సదరు ఇన్వెస్టర్తో ఉన్న సంబంధాలతోనే తామూ అదానీ షేర్ల షార్టింగ్ చేశామని.. తద్వారా 4.1 మిలియన్ డాలర్ల స్థూల ఆదాయం పొందినట్లు తెలిపింది. అదానీ అమెరికా బాండ్ల షార్ట్ ద్వారా 31 వేల డాలర్లు లభించినట్లు వెల్లడించింది. ఖర్చులు, ఇతర వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే తమకు లభించింది ఏమీ లేదని తెలిపింది. పైగా తాము కేవలం ఒకేఒక్క పెట్టుబడి భాగస్వామితో కలిసి షార్టింగ్ చేశామని తెలిపింది. దీన్నిబట్టి లాభాల కోసం తాము వివిధ సంస్థలతో కలిసి కుమ్మక్కై అదానీ గ్రూప్ను లక్ష్యంగా చేసుకున్నామని వస్తున్న ఆరోపణల్లో పస లేదని పేర్కొంది.
ఇవీ హిండెన్బర్గ్ ఆరోపణలు..
అదానీ గ్రూప్ (Adani Group) తమ నమోదిత కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న వెలువడిన నివేదికలో హిండెన్బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అలా విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలు పొందిందని ఆరోపించింది. అకౌంటింగ్ మోసాలకు సైతం పాల్పడినట్లు పేర్కొంది. పన్నుల విషయంలో స్నేహపూరితంగా ఉండే కరేబియన్, మారిషస్ల నుంచి యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోందని తెలిపింది. వీటిద్వారానే అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ అప్పట్లోనే తీవ్రంగా ఖండించింది. ఇన్వెస్టర్లు, రుణదాతల్లో విశ్వాసం నింపడం కోసం పలు చర్యలు చేపట్టింది. దీంతో భారీగా కుంగిన షేర్లు తిరిగి గాడినపడ్డాయి.
ఆరోపణలు అవాస్తవం: కోటక్
హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై కోటక్ బ్యాంక్ స్పందించింది. కోటక్ మహీంద్రా ఇంటర్నేషనల్ లిమిటెడ్కు గానీ, బ్యాంక్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ కింగ్డన్ క్యాపిటల్ మేనేజ్మెంట్కు హిండన్బర్గ్ అసలే క్లయింటే కాదని పేర్కొంది. తమ ఫండ్లో ఇన్వెస్టర్ కూడా కాదని స్పష్టంచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోనీలో కొత్త బ్రేవియా 7 సిరీస్ టీవీలు.. ధర, ఫీచర్లివే..!
Sony Bravia 7 series : బ్రేవియా 7 సిరీస్లో సోనీ మినీ ఎల్ఈడీ టీవీలను విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో మెరుగైన ఆడియో, వీడియో ఎక్స్పీరియెన్స్ను అందించేలా వీటిని తీర్చిదిద్దింది. -
సరికొత్త గరిష్ఠాలకు సూచీలు.. సెన్సెక్స్ 80 వేలు తాకి వెనక్కి
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 545 పాయింట్లు, నిఫ్టీ 162 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మరోసారి ఉద్యోగులను తొలగించిన అన్అకాడమీ
Unacademy lays off: వ్యయ నియంత్రణలో భాగంగా ఎడ్టెక్ సంస్థ అన్అకాడమీ మరోసారి ఉద్యోగులను తొలగించింది. -
దేశీయ సోషల్ మీడియా ‘కూ’ యాప్ మూత!
Koo app: దేశీయ సోషల్ మీడియా యాప్ ‘కూ’ మూత పడింది. విక్రయ చర్చలు ముగియడంతో వ్యవస్థాపకులు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. -
జియో vs ఎయిర్టెల్ vs వొడాఫోన్ ఐడియా.. పాపులర్ ప్లాన్ల కొత్త ధరలు ఇవే..
Jio vs Airtel vs VI: ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు తమ మొబైల్ ప్లాన్ల ధరలను సవరించాయి. -
ప్రధాన బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే..
Fixed Deposit Rates: ఫిక్స్డ్ డిపాజిట్లో మదుపు చేయాలనుకుంటున్నారా? అయితే వివిధ బ్యాంకులు ఎఫ్డీపై అందిస్తున్న వడ్డీ రేట్లపై ఓ లుక్కేయండి. -
ఎంక్యూర్ ఫార్మా, బన్సల్ వైర్ ఐపీఓలు ప్రారంభం.. ₹2,700 కోట్ల సమీకరణ
IPO: రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఎంక్యూర్ ఫార్మా, బన్సల్ వైర్ ఐపీఓలు ప్రారంభమయ్యాయి. జులై 5 వరకు ఆయా కంపెనీల షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. -
సెన్సెక్స్ @ 80,000.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:54 గంటల సమయంలో సెన్సెక్స్ 592 పాయింట్ల లాభంతో 80,033, నిఫ్టీ 175 పాయింట్లు ఎగబాకి 24,299 దగ్గర కొనసాగుతున్నాయి. -
మదుపర్లకు మెయిల్ ద్వారానే ఖాతా స్టేట్మెంట్లు
మదుపర్లకు ఏకీకృత ఖాతా వివరాలను (కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్- క్యాస్) నమోదిత ఇ-మెయిల్ ద్వారానే డిపాజిటరీస్, మ్యూచువల్ ఫండ్- రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ (ఎంఎఫ్- ఆర్టీఏ) పంపించాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. -
హిండెన్బర్గ్కు సెబీ షోకాజ్
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విషయంలో ‘సహేతుకం కాని ట్రేడింగ్’ జరిపిందంటూ అమెరికా షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్పై భారత మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఆరోపణలు చేసింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
మదుపర్ల లాభాల స్వీకరణతో జీవనకాల గరిష్ఠ స్థాయుల నుంచి వెనక్కి వచ్చిన సెన్సెక్స్, నిఫ్టీ.. అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. -
కాంకర్లో 5-7% వాటా అమ్మకం!
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. -
హిమాచల్లో హోటళ్లపై 20-40% రాయితీలు
వర్షాకాలంలో తమ రాష్ట్రంలో ప్రయాణించే వారికి 41 హోటళ్లలో గది అద్దెలపై 20-40% రాయితీ ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్పీటీడీసీ) ప్రకటించింది. జులై 15 నుంచి సెప్టెంబరు 13 మధ్య ఈ రాయితీలను పొందొచ్చు. -
బీఎండబ్ల్యూ రికార్డు స్థాయి విక్రయాలు
దేశంలో గతంలో ఎన్నడూ నమోదు కాని స్థాయిలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో (జనవరి-జూన్) వాహనాలను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా వెల్లడించింది. -
భారత్లో 4,000 ఉద్యోగాలు: హెగ్జావేర్
ఐటీ సేవల సంస్థ హెగ్జావేర్ టెక్నాలజీస్, అంతర్జాతీయంగా ఈ ఏడాది 6,000-8,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. -
మాస్చిప్, సోషియోనెక్ట్స్తో సీ-డ్యాక్ ఒప్పందం
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మాస్చిప్ టెక్నాలజీస్, జపాన్కు చెందిన సోషియోనెక్ట్స్ ఇంక్.తో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీ-డ్యాక్ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. -
అదనపు బ్యాగేజీ రవాణాకు సహకారం: అవాన్
విమానాల్లో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లాలంటే, అధిక ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇంత భరించలేక కొన్ని వస్తువులను విమానాశ్రయాల్లో ప్రయాణికులు వదిలేస్తుంటారు. -
20-21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే విక్రయాలు
ఈ నెల 20-21 తేదీల్లో 8వ విడత ప్రైమ్ డే విక్రయాలు ఉంటాయని అమెజాన్ ఇండియా మంగళవారం ప్రకటించింది. -
విద్యార్థుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఫారెక్స్ కార్డ్
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఒక ప్రీ పెయిడ్ ‘సఫైరో ఫారెక్స్ కార్డ్’ను ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం ఆవిష్కరించింది. -
సంక్షిప్తవార్తలు(9)
జర్మనీ వాహన దిగ్గజ సంస్థ ఫోక్స్వ్యాగన్, భారత్లోని తన సంస్థలో వాటాను స్థానిక కంపెనీకి విక్రయించాలని భావిస్తోంది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైనల్ను చివరివరకూ చూశా.. భారత్ బ్రాండ్ క్రికెట్ అద్భుతం: పాక్ పేసర్
-
ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలన్నీ తప్పకుండా అమలు చేస్తాం: భట్టి
-
సరికొత్త గరిష్ఠాలకు సూచీలు.. సెన్సెక్స్ 80 వేలు తాకి వెనక్కి
-
రాజ్యసభలో సుధామూర్తి తొలి ప్రసంగం.. కృతజ్ఞతలు చెప్పిన మోదీ
-
132 సీట్ల బస్సు.. విమానం తరహాలో సౌకర్యాలు.. పైలట్ ప్రాజెక్టుపై నితిన్ గడ్కరీ!
-
ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి: చంద్రబాబు