- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Sebi: ప్రాయోజిత గ్రూపు సంస్థల షేర్లలో 25% మించి పెట్టుబడులు పెట్టొచ్చు
ప్రాయోజిత సంస్థ (స్పాన్సర్స్)కు చెందిన గ్రూపు కంపెనీల షేర్లలో 25 శాతానికి మించి పెట్టుబడులు పెట్టేందుకు ప్యాసివ్ ఫండ్స్కు సెబీ అనుమతినిచ్చింది. ఈ మేరకు మ్యూచువల్ ఫండ్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్యాసివ్ ఫండ్స్కు సెబీ అనుమతి
దిల్లీ: ప్రాయోజిత సంస్థ (స్పాన్సర్స్)కు చెందిన గ్రూపు కంపెనీల షేర్లలో 25 శాతానికి మించి పెట్టుబడులు పెట్టేందుకు ప్యాసివ్ ఫండ్స్కు సెబీ అనుమతినిచ్చింది. ఈ మేరకు మ్యూచువల్ ఫండ్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్స్ను ప్యాసివ్ ఫండ్స్గా వ్యవహరిస్తారు. ఇవి మార్కెట్ పనితీరుకు ప్రతిబింబంగా పనిచేస్తాయి. ఇంతకుమునుపు మ్యూచువల్ ఫండ్ పథకాలు తమ ఎన్ఏవీ (నికర ఆస్తి విలువ)లో 25 శాతానికి మించి స్పాన్సర్కు చెందిన గ్రూపు కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు వీల్లేదు. దీనివల్ల సూచీలో 25 శాతానికి మించి స్పాన్సర్కు చెందిన గ్రూపు కంపెనీల షేర్లున్న సందర్భంలో, సూచీల పనితీరును ప్యాసివ్ ఫండ్స్ పూర్తి స్థాయిలో ప్రతిబింబించ లేకపోతున్నాయి. ఈ పరిణామం సూచీలో స్పాన్సర్ గ్రూపు కంపెనీల షేర్లు 25 శాతానికి మించి లేని ఫండ్ సంస్థలకు అనుకూలంగా మారగా.. 25 శాతం మించి ఉన్న సంస్థలకు ప్రతికూలంగా మారింది. అందువల్ల అన్ని ఫండ్ సంస్థలకు సమాన వ్యాపార అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో మ్యూచువల్ ఫండ్ నిబంధనలను సవరిస్తూ సెబీపై నిర్ణయాన్ని తీసుకుంది.
బాండ్ల ముఖ విలువ రూ.10000కు తగ్గింపు: డెట్ సెక్యూరిటీల (బాండ్లు) ముఖ విలువను ప్రస్తుత రూ.1 లక్ష నుంచి రూ.10,000కు సెబీ తగ్గించింది. కార్పొరేట్ బాండ్ల విపణిలో రిటైల్ మదుపర్ల ప్రాతినిథ్యం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డెట్ సెక్యూరిటీలకు తక్కువ ముఖ విలువ ఉంటే.. సంస్థాగతేతర మదుపర్లు కూడా కార్పొరేట్ బాండ్ల విపణిలో పాల్గొనేలా ప్రోత్సహించినట్లు అవుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ద్రవ్యలభ్యత పెరిగేందుకు కూడా ఈ పరిణామం దోహదం చేస్తుందని విశ్లేషిస్తున్నాయి.
మార్కెట్లో అవకతవకల నియంత్రణ బాధ్యత బ్రోకర్లకూ: మార్కెట్లో అవకతవకల గుర్తింపు, నియంత్రణ నిమిత్తం స్టాక్ బ్రోకర్లు ఓ సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు బ్రోకర్లపైనా అవకతవకల నియంత్రణ బాధ్యతను ఉంచుతూ సెబీ నిబంధనలను నోటిఫై చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. నిఘా, నియంత్రణ వ్యవస్థల ఏర్పాటు ద్వారా మార్కెట్లో అవకతవకలు, మోసాల గుర్తింపు, నియంత్రణ విషయంలో బ్రోకింగ్ సంస్థలు, వాటి ఉన్నత యాజమాన్యం జవాబుదారీ అవుతారు. ఏదేని అనుమానిత కార్యకలాపాలను గుర్తించినట్లయితే 48 గంటల్లోగా ఆ సమాచారాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు బ్రోకర్లు తెలియజేయాల్సి ఉంటుందని తన నోటిఫికేషన్లో సెబీ తెలిపింది. అనుమానిత కార్యకలాపాలు, మోసాలు చోటుచేసుకున్నట్లయితే ఎలాంటి చర్యలు చేపట్టారో పూర్తి వివరాలతో ఓ నివేదికను ఆరు నెలలకోసారి ఎక్స్ఛేంజీలకు బ్రోకర్లు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ మోసాలేవీ చోటుచేసుకోకుంటే.. ఆ విషయాన్ని కూడా ‘జీరో రిపోర్ట్’ కింద సమర్పించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో.. రూ.55,000 కోట్ల ఐపీఓ?
రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్ జియోను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఉక్కు నిర్మాణాలను ప్రోత్సహించాలి
మౌలిక వసతుల పరంగా తెలుగు రాష్ట్రాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నందున, ఇక్కడ ఉక్కు ఆధారిత నిర్మాణాలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా సూచించారు. -
కార్ల రిటైల్ అమ్మకాలకు వడదెబ్బ
భారత్లో ప్రయాణికుల వాహనాల (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) రిటైల్ విక్రయాలు జూన్లో నెమ్మదించాయి. -
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక వెనక చైనా హస్తం?
అదానీ గ్రూప్ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణలు చేసిన ఉదంతం కొత్త మలుపులు తీసుకుంటోంది. -
సెన్సెక్స్కు స్వల్ప నష్టాలు
గరిష్ఠ స్థాయుల్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్, స్వల్ప నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ మాత్రం తాజా రికార్డు గరిష్ఠానికి చేరింది. -
త్వరలో భారత్లో షియోమీ విద్యుత్ కారు ఎస్యూ7 ప్రదర్శన!
భారత విద్యుత్ వాహన (ఈవీ) విపణిలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై చైనా మొబైల్, విద్యుత్తు వాహన సంస్థ షియోమీ దృష్టి సారిస్తోంది. -
వంట పాత్రలకూ ఐఎస్ఐ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
వంటకు ఉపయోగించే అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకూ ఇక నుంచి ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) ముద్రను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్
సీఎన్జీ ఇంధనంగా వినియోగించే మోటార్సైకిల్ను ప్రపంచంలోనే తొలిసారిగా బజాజ్ ఆటో ఆవిష్కరించింది. -
డీమ్యాట్ ఖాతాలు 16.2 కోట్లు
ఈ ఏడాది జూన్ చివరకు డీమ్యాట్ ఖాతాల సంఖ్య 16.2 కోట్లకు చేరినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ తెలిపాయి. -
శాకాహార భోజన ఖర్చు 10% అధికం
శాకాహార భోజనం (వెజ్ థాలి) సగటు ధర జూన్లో 10% పెరిగిందని క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. -
ఎమ్ఎస్ఎమ్ఈ రుణాల్లో 7 శాతమే మహిళలకు
సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎమ్ఎస్ఎమ్ఈ)లకు ఇచ్చిన మొత్తం రుణాల్లో కేవలం 7 శాతమే మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు వెళ్లాయని రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) నీరజ్ నిగమ్ పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (2)
వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వచ్చిన వార్తలను టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ శుక్రవారం కొట్టిపారేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
Jio OTT plans: జియో సంస్థ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను తగ్గించేసింది. 21 నుంచి ఏడుకు కుదించింది.