- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
SBI: ఎస్బీఐ ఛైర్మన్గా తెలుగు వ్యక్తి!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తదుపరి ఛైర్మన్ పదవికి ఇదే బ్యాంక్లో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న చల్లా శ్రీనివాసులు (సీఎస్) శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) సిఫారసు చేసింది.
చల్లా శ్రీనివాసులు శెట్టి పేరు సిఫారసు
కేబినెట్ నియమాకాల కమిటీదే తుది నిర్ణయం
దిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తదుపరి ఛైర్మన్ పదవికి ఇదే బ్యాంక్లో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న చల్లా శ్రీనివాసులు (సీఎస్) శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్, టెక్నాలజీ విభాగాల బాధ్యతలను చూసుకుంటున్నారు. 2020 జనవరిలో ఆయన ఎస్బీఐ ఎండీగా నియమితులయ్యారు. 2024 ఆగస్టు 28న ప్రస్తుత ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖారా(63) పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ స్థానంలోకి సరైన వ్యక్తిని ఎంపిక చేసే బాధ్యతను ఎఫ్ఎస్ఐబీ తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే ఎఫ్ఎస్ఐబీ శనివారం ముగ్గురిని ఇంటర్వ్యూ చేసి సీఎస్ శెట్టి పేరును ఛైర్మన్ పదవికి సిఫారసు చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ)తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఎఫ్ఎస్ఐబీకి అధిపతిగా వ్యక్తిగత, శిక్షణ విభాగం మాజీ కార్యదర్శి భాను ప్రతాప్ శర్మ వ్యవహరిస్తున్నారు. ఈ బ్యూరోలో ఆర్థిక సేవల కార్యదర్శి, ప్రభుత్వ సంస్థల విభాగ కార్యదర్శి, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ సభ్యులుగా ఉన్నారు. ఓరియంట్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మాజీ ఛైర్మన్, ఎండీ అనిమేశ్, ఆర్బీఐ మాజీ ఈడీ దీపక్, ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ మాజీ ఎండీ శైలేంద్ర కూడా సభ్యులుగా ఉన్నారు.
నేనో యాక్సిడెంటల్ బ్యాంకర్ను..
ఈనాడు, హైదరాబాద్: ‘వాస్తవానికి నేను ఒక యాక్సిడెంటల్ బ్యాంకర్ను. అందరూ బ్యాంకు పరీక్షలు రాస్తున్నారు కాబట్టి, నేనూ రాశాను. ఇలా 1988లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్గా నా ప్రస్థానం ప్రారంభమైంది. నాకు చిన్నప్పటి నుంచీ ఐఏఎస్ అధికారి కావాలనే కల ఉండేది. కానీ, బ్యాంకులో చేరిన తర్వాత సమాజానికి సేవ చేసేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలోనూ ఎన్నో అవకాశాలు ఉన్నాయని అర్థమయ్యింది’ అని చల్లా శ్రీనివాసులు శెట్టి ‘ఈటీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
బ్యాంకరే కీలకం..: ‘వృత్తిపరంగా ఎదిగేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. ఖాతాదారులకు సేవ చేస్తూ.. బ్యాంకు విలువలను కాపాడుతూ, వ్యాపారాన్ని పెంచే సామర్థ్యం ఉంటే చాలు.. బ్యాంకులో ఉన్నత స్థానానికి చేరుకోవడం సాధ్యమేన’ని సీఎస్ శెట్టి పేర్కొన్నారు. ‘సమాజానికి మన వంతుగా ఏం చేస్తున్నాం అనే ప్రశ్నతోపాటు మనం చేస్తున్న పని మనకు సంతృప్తి కలిగించాలి. బ్యాంకింగ్ రంగంలోకి రావాలనుకుంటున్న, ఇప్పటికే ఉన్న యువత ఒక విషయాన్ని తెలుసుకోవాలి. బ్యాంకు అంటే ఏదో ఒక శాఖలో పని చేస్తున్నాం, వచ్చిన ఖాతాదారులకు ఏదో ఒక పని చేసి పెడుతున్నాం అని కాదు.. సమాజానికి ఆర్థిక సేవలను పరిచయం చేయడం. ఒక వ్యక్తి వ్యాపారం చేయడానికి సహాయం చేయడం, ఒక బృందానికి నాయకత్వం వహించడం ఎలాగో తెలుసుకోవడం.. ఇలా ఎన్నో ఉంటాయి. సమాజంలో బ్యాంకర్ పాత్ర ఎంతో కీలకం’ అని ఆయన పేర్కొన్నారు.
పాలమూరు నుంచి..: శ్రీనివాసులు శెట్టి జన్మస్థలం జోగులాంబ గద్వాల జిల్లా (ఉమ్మడి మహబూబ్నగర్), మానవపాడు మండలం, పెద్దపోతులపాడు గ్రామం. ఏడో తరగతి వరకూ సొంతూర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకూ గద్వాలలో విద్యాభ్యాసం జరిగింది. హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ చదివారు. ఆ తర్వాత 1988లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్గా చేరారు. గుజరాత్, హైదరాబాద్, ముంబయితో పాటు న్యూయార్క్లోనూ పనిచేశారు. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్గా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 2020 నుంచి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎండీల్లో అందరి కంటే సీనియర్ ఈయనే కావడంతో సంప్రదాయం ప్రకారం ఈయన పేరును ఛైర్మన్ పదవికి సిఫారసు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫార్మా షేర్లు కోలుకుంటున్నాయ్
ఫార్మా కంపెనీలపై స్టాక్మార్కెట్ మదుపరుల్లో మళ్లీ ఆసక్తి కనిపిస్తోంది. కొవిడ్-19 ముంచుకొచ్చినప్పుడు, మందులకు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో ఫార్మా కంపెనీలు అధిక అమ్మకాలు, లాభాలు నమోదు చేశాయి. -
మదుపర్ల సంపద రూ.443 లక్షల కోట్లు
బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీల లాభాల జోరు కొనసాగింది. సెన్సెక్స్ కొత్త గరిష్ఠ స్థాయి వద్ద ముగియగా, నిఫ్టీ 24,100 పాయింట్ల ఎగువకు చేరింది. సానుకూల ఆసియా, ఐరోపా సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. -
పతంజలి ఫుడ్స్ చేతికి మరిన్ని వ్యాపారాలు
పతంజలి ఆయుర్వేద్కు చెందిన గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారాలను రూ.1,100 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు వంటనూనెల దిగ్గజ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. -
జూన్లో కార్ల విక్రయాలు 4% పెరిగాయ్
ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు గత నెలలో 4% పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ అధికంగా ఉండటంతో, విక్రయాలపై ప్రభావం పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. -
రిలయన్స్ మార్కెట్ విలువకు మరో 100 బి. డాలర్లు జత!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ మరో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) మేర పెరగనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది. -
రూ.2,000 నోట్లు 97.87% వెనక్కి వచ్చాయ్: ఆర్బీఐ
రూ.2,000 నోట్లలో 97.87% వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం వెల్లడించింది. రూ.7,581 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. -
ఆర్బీఐకి ఇద్దరు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అర్నబ్ కుమార్ ఛౌధ్రీ, చారులతా ఎస్ కర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు వీరు ఆర్బీఐలో చీఫ్ జనరల్ మేనేజర్లుగా ఉన్నారు. -
ఎయిరిండియా పైలట్ల శిక్షణ సంస్థ
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా, మహారాష్ట్రలోని అమరావతిలో పైలట్ల శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ఏడాదికి 180 మంది వాణిజ్య పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది ప్రతిపాదన. -
సంక్షిప్త వార్తలు(6)
ప్రభుత్వ రంగ సంస్థ పవర్గ్రిడ్ కార్పొరేషన్ దక్షిణ ప్రాంత చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా అఖిలేష్ పాఠక్ బాధ్యతలు చేపట్టారు. పవర్గ్రిడ్ దక్షిణ ప్రాంత ట్రాన్స్మిషన్ సిస్టమ్-1 పరిధిలో తెలంగాణ, -
ఐపీఓలకు కంపెనీలు సై
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ శివాలిక్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
-
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం
-
శాఖల్లో మార్పులు జరిగితే సీతక్కకు హోం!