- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
scams: ఫేస్బుక్, వాట్సప్ వేదికగా చెలరేగిపోతున్న స్కామర్లు..!
Investment scams: నిత్యం వినియోగిస్తున్న మెసేజింగ్ ప్లాట్ఫామ్ల ద్వారానే కేటుగాళ్లు పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్నారు.
investment scams | ఇంటర్నెట్డెస్క్: స్కామ్.. స్కామ్.. స్కామ్.. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది. నిత్యం ఎవరో ఒకరు ఏదో ఒక చోట స్కామ్ బారిన పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. ఏ మాత్రం అవగాహన లేకున్నా అధిక మొత్తంలో డబ్బులు ఆర్జించవచ్చంటూ కేటుగాళ్లు చెప్పే మాయ మాటలు నమ్మి డబ్బులు కోల్పోతున్న వాళ్ల సంఖ్య జాబితా పెరుగుతోంది. అదేదో గుట్టుచప్పుడు కాకుండా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారనుకుంటే పొరపాటే. ఏకంగా సోషల్మీడియా ప్లాట్ఫామ్ల వేదికగానే ప్రచారాలు చేస్తూ ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం ఓ అధ్యయనంలో తేలింది.
ఫేస్బుక్, వాట్సప్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ ప్లాట్ఫామ్లనే నిత్యం ఎక్కువ మంది వినియోగిస్తుంటారు. ఇలా తరచూ వాడే సోషల్మీడియా వేదికలనే తమ ప్రచార ఆయుధాలుగా మార్చుకుని పెట్టుబడి పెట్టేలా ప్రేరేపిస్తున్నారు మోసగాళ్లు. స్టాక్ మార్కెట్, క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులతో భారీగా సంపాదించవచ్చంటూ మాయ చేస్తారు. ఇలా నెట్టింట ఉండే ఫేక్ కంటెంట్పై CloudSEK అనే సంస్థ పరిశోధన చేసింది. అందులో విస్తుపోయే విషయాలు వెల్లడించింది. 81,000 నకిలీ వాట్సాప్ గ్రూప్లు, ఫేస్బుక్లో 29,000 ఫేక్ ప్రకటనలు గుర్తించినట్లు పేర్కొంది. యూజర్లలో విశ్వాసం కలిగించేందుకు గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల పేరిట ఎక్స్లో ఏకంగా 81 వేల ఖాతాలను క్రియేట్ చేసినట్లు గుర్తించింది.
ఈ నెలలోనే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే!
‘‘ముందుగా వివిధ సోషల్మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా యూజర్లకు చేరువ అవుతారు. తమ వద్ద ఉన్న డేటా సాయంతో సందేశాలు పంపుతారు. చట్టబద్ధమైన పెట్టుబడి సంస్థలతో వ్యవహరిస్తున్నామని నమ్మిస్తారు. తమ వద్ద మదుపు చేస్తే అత్యధికంగా ఆర్జించవచ్చంటూ విశ్వసించేందుకు నకిలీ రుజువులు చూపుతారు. అధిక రాబడికి హామీ ఇస్తూ నకిలీ లాభాలు చూపుతారు. చివరకు ఉన్నదంతా దోచుకొని నెట్టింట ముంచేస్తారు’’ అని పరిశోధన సంస్థ తెలిపింది.
భారత్, మలేషియా, అమెరికా, థాయ్ల్యాండ్, వియత్నాం వంటి దేశాలు ఈ తరహా మోసగించే వారికి ప్రధాన లక్ష్యంగా ఉన్నాయని పేర్కొంది. గతేడాదిలో భారత్లో లక్ష కంటే ఎక్కువ మోసాలు జరిగితే.. 2024లో మొదటి నాలుగు నెలల్లో 4,599 డిజిటల్ మోసాల్లో బాధితులు కోల్పోయిన మొత్తం రూ.100 కోట్ల పైమాటేనని పేర్కొంది. అదే సమయంలో 62,687 ఫిర్యాదులు నమోదయ్యాయని వెల్లడించింది. దీనిబట్టి రూ.200 కోట్లకు పైగానే సైబర్ కేటుగాళ్ల చేతికి చిక్కిందని క్లౌడ్సెక్ అంచనా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంఎఫ్ బ్రాండ్ అంబాసిడర్గా రష్మిక
నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్కు బ్రాండ్ అంబాసిడర్గా సినీనటి రష్మిక వ్యవహరించనున్నారు. -
సోనీలో కొత్త బ్రేవియా 7 సిరీస్ టీవీలు.. ధర, ఫీచర్లివే..!
Sony Bravia 7 series : బ్రేవియా 7 సిరీస్లో సోనీ మినీ ఎల్ఈడీ టీవీలను విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో మెరుగైన ఆడియో, వీడియో ఎక్స్పీరియెన్స్ను అందించేలా వీటిని తీర్చిదిద్దింది. -
సరికొత్త గరిష్ఠాలకు సూచీలు.. సెన్సెక్స్ 80 వేలు తాకి వెనక్కి
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 545 పాయింట్లు, నిఫ్టీ 162 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మరోసారి ఉద్యోగులను తొలగించిన అన్అకాడమీ
Unacademy lays off: వ్యయ నియంత్రణలో భాగంగా ఎడ్టెక్ సంస్థ అన్అకాడమీ మరోసారి ఉద్యోగులను తొలగించింది. -
దేశీయ సోషల్ మీడియా ‘కూ’ యాప్ మూత!
Koo app: దేశీయ సోషల్ మీడియా యాప్ ‘కూ’ మూత పడింది. విక్రయ చర్చలు ముగియడంతో వ్యవస్థాపకులు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. -
జియో vs ఎయిర్టెల్ vs వొడాఫోన్ ఐడియా.. పాపులర్ ప్లాన్ల కొత్త ధరలు ఇవే..
Jio vs Airtel vs VI: ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు తమ మొబైల్ ప్లాన్ల ధరలను సవరించాయి. -
ప్రధాన బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే..
Fixed Deposit Rates: ఫిక్స్డ్ డిపాజిట్లో మదుపు చేయాలనుకుంటున్నారా? అయితే వివిధ బ్యాంకులు ఎఫ్డీపై అందిస్తున్న వడ్డీ రేట్లపై ఓ లుక్కేయండి. -
ఎంక్యూర్ ఫార్మా, బన్సల్ వైర్ ఐపీఓలు ప్రారంభం.. ₹2,700 కోట్ల సమీకరణ
IPO: రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఎంక్యూర్ ఫార్మా, బన్సల్ వైర్ ఐపీఓలు ప్రారంభమయ్యాయి. జులై 5 వరకు ఆయా కంపెనీల షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. -
సెన్సెక్స్ @ 80,000.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:54 గంటల సమయంలో సెన్సెక్స్ 592 పాయింట్ల లాభంతో 80,033, నిఫ్టీ 175 పాయింట్లు ఎగబాకి 24,299 దగ్గర కొనసాగుతున్నాయి. -
మదుపర్లకు మెయిల్ ద్వారానే ఖాతా స్టేట్మెంట్లు
మదుపర్లకు ఏకీకృత ఖాతా వివరాలను (కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్- క్యాస్) నమోదిత ఇ-మెయిల్ ద్వారానే డిపాజిటరీస్, మ్యూచువల్ ఫండ్- రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ (ఎంఎఫ్- ఆర్టీఏ) పంపించాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. -
హిండెన్బర్గ్కు సెబీ షోకాజ్
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విషయంలో ‘సహేతుకం కాని ట్రేడింగ్’ జరిపిందంటూ అమెరికా షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్పై భారత మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఆరోపణలు చేసింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
మదుపర్ల లాభాల స్వీకరణతో జీవనకాల గరిష్ఠ స్థాయుల నుంచి వెనక్కి వచ్చిన సెన్సెక్స్, నిఫ్టీ.. అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. -
కాంకర్లో 5-7% వాటా అమ్మకం!
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. -
హిమాచల్లో హోటళ్లపై 20-40% రాయితీలు
వర్షాకాలంలో తమ రాష్ట్రంలో ప్రయాణించే వారికి 41 హోటళ్లలో గది అద్దెలపై 20-40% రాయితీ ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్పీటీడీసీ) ప్రకటించింది. జులై 15 నుంచి సెప్టెంబరు 13 మధ్య ఈ రాయితీలను పొందొచ్చు. -
బీఎండబ్ల్యూ రికార్డు స్థాయి విక్రయాలు
దేశంలో గతంలో ఎన్నడూ నమోదు కాని స్థాయిలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో (జనవరి-జూన్) వాహనాలను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా వెల్లడించింది. -
భారత్లో 4,000 ఉద్యోగాలు: హెగ్జావేర్
ఐటీ సేవల సంస్థ హెగ్జావేర్ టెక్నాలజీస్, అంతర్జాతీయంగా ఈ ఏడాది 6,000-8,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. -
మాస్చిప్, సోషియోనెక్ట్స్తో సీ-డ్యాక్ ఒప్పందం
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మాస్చిప్ టెక్నాలజీస్, జపాన్కు చెందిన సోషియోనెక్ట్స్ ఇంక్.తో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీ-డ్యాక్ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. -
అదనపు బ్యాగేజీ రవాణాకు సహకారం: అవాన్
విమానాల్లో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లాలంటే, అధిక ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇంత భరించలేక కొన్ని వస్తువులను విమానాశ్రయాల్లో ప్రయాణికులు వదిలేస్తుంటారు. -
20-21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే విక్రయాలు
ఈ నెల 20-21 తేదీల్లో 8వ విడత ప్రైమ్ డే విక్రయాలు ఉంటాయని అమెజాన్ ఇండియా మంగళవారం ప్రకటించింది. -
విద్యార్థుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఫారెక్స్ కార్డ్
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఒక ప్రీ పెయిడ్ ‘సఫైరో ఫారెక్స్ కార్డ్’ను ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం ఆవిష్కరించింది. -
సంక్షిప్తవార్తలు(9)
జర్మనీ వాహన దిగ్గజ సంస్థ ఫోక్స్వ్యాగన్, భారత్లోని తన సంస్థలో వాటాను స్థానిక కంపెనీకి విక్రయించాలని భావిస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కలకలం రేపిన ఏపీఎండీసీ దస్త్రాలు దహనం.. పెద్దిరెడ్డి అనుచరులపై అనుమానం
-
నీట్ పేపర్ లీక్ కేసులో మరో కీలక సూత్రధారి అరెస్టు
-
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా
-
ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవకాశం: సినీనటుడు నరేశ్
-
ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. మార్చి 1న భారత్-పాక్ మ్యాచ్!
-
హాథ్రస్ తొక్కిసలాట.. భోలే బాబా ఏమన్నారంటే!