- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rich Dad Poor Dad: రిచ్ డాడ్ పూర్డాడ్ రచయితకు 1.2 బిలియన్ డాలర్ల అప్పు!
Robert Kiyosaki: రిచ్ డాడ్, పూర్డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి ఇన్స్టాగ్రామ్ రీల్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అందులో ఆస్తులు, అప్పుల మధ్య వ్యత్యాసాన్ని తెలిపారు.
Rich Dad Poor Dad author | ఇంటర్నెట్డెస్క్: రాబర్ట్ కియోసాకి రచించిన ‘రిచ్ డాడ్.. పూర్ డాడ్’ పుస్తకం చాలా మందికి సుపరిచితమే. ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక స్వేచ్ఛ, పెట్టుబడి ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి, వ్యాపారం.. ఇలా ఆర్థికాంశాల ప్రాముఖ్యత తెలపడంతో ఈ పుస్తకం అత్యంత ప్రాచుర్యం పొందింది. ఎక్కువగా అమ్ముడైన పుస్తకాల జాబితాలోనూ చోటు దక్కించుకుంది. అయితే ఈ అనుభవజ్ఞుడైన పెట్టుబడిదారుడు ప్రస్తుతం అప్పుల్లో ఉన్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
ఇన్స్ట్రాలో ఇటీవల కియోసాకి ఓ రీల్ పోస్ట్ చేశారు. అందులో రుణాలు, ఆస్తుల మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడారు. ‘చాలా మంది రుణాల్ని తీసుకొని విలాస వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. అది అప్పు. నేను మాత్రం రుణాల్ని తీసుకొని ఆస్తుల్ని కొంటాను. ఫెరారీ, రోల్స్ రాయల్స్ వంటి విలాసవంతమైన వాహనాలు అప్పు మాత్రమే. అవి ఆస్తులు కావు’’ అని కియోసాకి అన్నారు. తన సంపాదనను డబ్బు రూపంలో తానెప్పుడు ఆదా చేయను అని కియోసాకి తెలిపారు. ఆ మొత్తాన్ని వెండి, బంగారం రూపంలో మారుస్తానని చెప్పారు. ఇలా తన పెట్టుబడుల్లో భాగంగా తాను చేసిన అప్పు 1.2 బిలియన్ డాలర్లకు చేరిందని చెప్పారు. తన అప్పే తన ఆస్తి అని చెప్పారు.
విద్యుత్ వాహనాలకు సబ్సిడీ.. మహిళలకు అదనపు రాయితీ!
రుణాలను కూడా.. గుడ్, బ్యాడ్ గా కియోసాకి విభజించారు. మంచి రుణం సంపదను సృష్టిస్తుందన్నారు. రుణాల్ని తీసుకొని రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం, వ్యాపారం చేయటం వంటివన్నీ మంచి రుణాల కిందకు వస్తాయన్నారు. మార్కెట్ ఒడుదొడుకులను ఎదుర్కోవడానికి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని చెప్పారు. డబ్బు రూపంలో పెట్టుబడి పెట్టడం కంటే వెండి, బంగారంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. 1997లో విడుదలైన ‘రిచ్ డాడ్, పూర్ డాడ్’ పుస్తకం 40 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదానీ గ్రూప్పై నివేదిక 2 నెలల ముందే కింగ్డన్ చేతికి
అదానీ గ్రూప్పై అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. అదానీ గ్రూప్నకు వ్యతిరేకంగా రూపొందించిన నివేదికను ప్రచురించడానికి రెండు నెలల ముందే, -
ప్రీమియం ఎకానమీ సీట్లతో ఎయిరిండియా కొత్త విమానం
ప్రీమియం ఎకానమీ సీట్లు అమర్చిన నారోబాడీ విమానమైన ఎ320 నియో, ఎయిరిండియాకు చేరింది. ఈ విమానంలో 8 విలాసవంత బిజినెస్ తరగతి సీట్లు, అదనపు లెగ్రూం ఉండే 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, -
సానుకూలతలకు అవకాశం
రాబోయే బడ్జెట్పై ఆశావహ దృక్పథంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనలు వృద్ధిరేటు పెంచేందుకు దోహదం చేసేలా ఉంటాయనే అంచనాలున్నాయి. -
పసిడి-వెండి రాణింపు
పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలించొచ్చు. అమెరికా ఉద్యోగ గణాంకాలకు తోడు డాలర్ బలహీనపడే వీలుండటం ఇందుకు నేపథ్యం. బంగారం కాంట్రాక్టుకు రూ.73,666 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. -
78500-78900 ఎగువన లాభాలే!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం దేశీయ సూచీలు జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే గణాంకాలకు తోడు బడ్జెట్పై అంచనాలు మెరుగవ్వడం, రుతుపవనాలు పుంజుకోవడం కలిసొచ్చాయి. -
అపోలో హెల్త్లో అపోలో హాస్పిటల్స్కు మరింత వాటా
అనుబంధ సంస్థ అపోలో హెల్త్ అండ్ లైఫ్స్టైల్లో రూ.103.2 కోట్ల విలువైన వాటా కొనుగోలు చేయనున్నట్లు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. రైట్స్ ఇష్యూ ద్వారా ఈ వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. -
పీ అండ్ ఎస్ బ్యాంక్ 100 కొత్త శాఖలు
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో మరో 100 శాఖలను తెరిచే ప్రణాళికలో ఉన్నట్లు ప్రభుత్వ రంగ పంజాబ్ అండ్ సింధ్ (పీ అండ్ ఎస్) బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ స్వరూప్ కుమార్ సాహా వెల్లడించారు. -
ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ కట్టడికి ఏడు ప్రతిపాదనలు!
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్ వల్ల అత్యధికులు నష్టపోతున్న నేపథ్యంలో.. చిన్న మదుపర్లను కాపాడటంతో పాటు, నియంత్రణపరమైన ఇబ్బందులను పరిష్కరించేందుకు వచ్చిన 7 ప్రతిపాదనలపై సెబీ నియమించిన... -
పొదుపు ఖాతాల్లో మరిన్ని సదుపాయాలు: ఐఓబీ
రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), పొదుపు ఖాతాల (ఎస్బీ అకౌంట్)పై మరిన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈఓ అజయ్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/07/24)
-
స్టన్నింగ్ కియారా.. చీరలో పూజ.. స్టైలిష్ శ్రీముఖి
-
‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్పై మండిపడ్డ శిందే!
-
ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష - ఎన్టీఏ
-
పేపర్ లీక్లతో యువత కలల్ని నాశనం చేసినోళ్లను వదిలేది లేదు.. సీఎం భజన్లాల్ శర్మ
-
ఆ ఆపరేషన్ కారణంగానే సినిమాలకు విరామం: నభా నటేశ్