- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Today Stock Market: మూడో రోజూ రికార్డుల ర్యాలీ
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎయిర్టెల్ షేర్లు లాభపడటంతో సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి.
తాజా గరిష్ఠాలకు సెన్సెక్స్, నిఫ్టీ
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎయిర్టెల్ షేర్లు లాభపడటంతో సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 14 పైసలు తగ్గి 83.57 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.80% లాభంతో 85.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
- మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.437.02 లక్షల కోట్లుగా నమోదైంది.
- సెన్సెక్స్ ఉదయం 78,094.02 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. మదుపర్ల కొనుగోళ్లతో పరుగులు తీసిన సూచీ, ఇంట్రాడేలో 78,759.40 వద్ద జీవనకాల తాజా గరిష్ఠాన్ని తాకి చివరకు 620.73 పాయింట్ల లాభంతో 78,674.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 147.50 పాయింట్లు పెరిగి 23,868.80 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో 23,889.90 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది. సూచీల ముగింపు కూడా జీవనకాల గరిష్ఠస్థాయులే.
- కొనుగోళ్ల మద్దతుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 4.09% లాభంతో రూ.3,027.40 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్ విలువ రూ.80,359 కోట్లు పెరిగి రూ.20.48 లక్షల కోట్లకు చేరింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 20 దూసుకెళ్లాయి. ఎయిర్టెల్ 3.07%, అల్ట్రాటెక్ 2.78%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.60%, యాక్సిస్ బ్యాంక్ 1.26%, ఎన్టీపీసీ 1.14%, సన్ఫార్మా 1.11% లాభపడ్డాయి. ఎం అండ్ ఎం 2.02%, టాటా స్టీల్ 1.79%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 1.13%, టెక్ మహీంద్రా1.10%, టైటన్ 0.86% నష్టపోయాయి.
- ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కొత్త ఎండీ, సీఈఓగా నవీన్ చంద్ర ఝా నియమితులయ్యారు.
- విదేశాల్లో బజాజ్ తయారీ ప్లాంటు: బజాజ్ ఆటో తొలిసారిగా విదేశాల్లోనూ తయారీని ప్రారంభించింది. బ్రెజిల్లోని మానౌస్లో ఏడాది వ్యవధిలో నెలకొల్పిన కొత్త ప్లాంటులో తయారీ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లు బజాజ్ ఆటో ప్రకటించింది. ఒక షిఫ్ట్ ద్వారా ఏడాదికి 20,000 వాహనాలను ఇక్కడ తయారు చేయగలమని సంస్థ తెలిపింది. తమ వాహనాలను 100 దేశాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడించింది.
- హ్యుందాయ్ ఐపీఓ కోసం బ్యాంకులకు రూ.330 కోట్ల ఫీజు: తమ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సలహాలు ఇచ్చే బ్యాంకులకు ఫీజుగా హ్యుందాయ్ ఇండియా 40 మిలియన్ డాలర్లు (రూ.330 కోట్లు) చెల్లించనున్నట్లు తెలుస్తోంది. జేపీ మోర్గాన్, సిటీగ్రూప్, హెచ్ఎస్బీసీ వంటివి ఇందులో ఉన్నాయి.
- ఈక్విటీ, కన్వెర్టబుల్ వారెంట్ల జారీ ద్వారా రూ.1,050 కోట్ల వరకు సమీకరించే ప్రతిపాదనకు ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.
- వేదాంతాలో 2.6% వాటాను రూ.4,184 కోట్లకు, అనుబంధ సంస్థ ఫిన్సైడర్ ఇంటర్నేషనల్ కంపెనీ ద్వారా వేదాంతా రిసోర్సెస్ విక్రయించింది. దీంతో వేదాంతాలో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ సంస్థల వాటా 61.95% నుంచి 59.32 శాతానికి పరిమితమైంది.
మార్కెట్లలో ఐపీఓల సందడి
- ఆక్మే ఫిన్ట్రేడ్ షేరు ఇష్యూ ధర రూ.120తో పోలిస్తే బీఎస్ఈలో 4.75% లాభంతో రూ.125.70 వద్ద నమోదైంది. చివరకు 9.95% పెరిగి రూ.131.95 వద్ద ముగిసింది.
- డీ డెవలప్మెంట్ ఇంజినీర్స్ షేరు ఇష్యూ ధర రూ.203తో పోలిస్తే బీఎస్ఈలో 60% లాభంతో రూ.325 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. చివరకు 65% రాణించి రూ.335 దగ్గర రపడింది.
- డర్లాక్స్ టాప్ సర్ఫేస్ షేరు ఇష్యూ ధర రూ.68తో పోలిస్తే, ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్పై 60.29% లాభంతో రూ.109 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. చివరకు రూ.103.55 వద్ద ముగిసింది.
- అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్ ఐపీఓకు రెండో రోజున 1.51 రెట్ల స్పందన లభించింది. వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ ఐపీఓకు మొదటి రోజున 3.46 రెట్ల స్పందన దక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్బీఐ ఛైర్మన్గా తెలుగు వ్యక్తి!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తదుపరి ఛైర్మన్ పదవికి ఇదే బ్యాంక్లో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న చల్లా శ్రీనివాసులు (సీఎస్) శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) సిఫారసు చేసింది. -
నాణ్యత లేదు.. ప్రమాణాలు లేవు
దేశంలోని చిన్న, మధ్య తరహా ఫార్మా యూనిట్లలో నాణ్యతా ప్రమాణాలపై సంబంధిత వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. -
ఆతిథ్య రంగంలో 10 లక్షల ఉద్యోగాలు!
వచ్చే కొన్నేళ్లలో ఆతిథ్య రంగం సుమారు 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
2024-25లో దేశీయ వస్తు, సేవల ఎగుమతులు రూ.66 లక్షల కోట్లు
అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2024-25) దేశీయ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను (సుమారు రూ.66 లక్షల కోట్లు) అధిగమించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
రాణించిన చిన్న షేర్లు
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా (తొలి ఆరు నెలల్లో) చిన్న, మధ్య స్థాయి షేర్లు రాణించాయి. రిటైల్ మదుపర్ల నుంచి వచ్చిన అసాధారణ, బలమైన గిరాకీ ఇందుకు కలిసివచ్చింది. -
సెల్కాన్ గ్రూపు నుంచి వైఫై-6 రౌటర్లు
మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, యాక్సెసరీలు అందిస్తున్న సెల్కాన్ గ్రూపు వైఫై-6 రౌటర్ల విభాగంలోకి అడుగుపెడుతోంది. -
హెచ్సీజీ చేతికి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్?
విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను దేశంలోని అతిపెద్ద క్యాన్సర్ వైద్య సేవల సంస్థ అయిన హెచ్సీజీ సొంతం చేసుకోనుందని తెలుస్తోంది. -
రూ.12,000 కోట్ల సమీకరణలో ఎన్టీపీసీ
ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ.. మార్పిడి రహిత డిబెంచర్ల (ఎన్సీడీ) జారీ ద్వారా రూ.12,000 కోట్లను సమీకరించనుంది. -
సంక్షిప్త వార్తలు
అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణ ప్రణాళికలో భాగంగా టైటన్ కంపెనీ బంగ్లాదేశ్లో తన ఆభరణాల బ్రాండ్ తనిష్క్ను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. -
జియో సేఫ్, జియో ట్రాన్స్లేట్.. ఎలా పనిచేస్తాయ్..?
Jio Safe- Jio Translate: రిలయన్స్ జియో కొత్తగా రెండు కొత్త సర్వీసులను ప్రారంభించింది. ఒకటి జియో సేఫ్, రెండోది జియో ట్రాన్స్లేట్.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇంకా పోని వైకాపా వాసనలు.. కుర్చీ వదలని ఉపకులపతి..!
-
విశ్వవిజేతగా నిలిచిన భారత్కు దక్కిన ప్రైజ్మనీ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం.. సీఎం రేవంత్ చొరవతో అంగీకరించిన కేంద్రం
-
1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు
-
అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?