- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
RBI Monetary Policy: ఏడోసారీ వడ్డీరేట్లు యథాతథం
RBI Monetary Policy: రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఏడోసారి.
ముంబయి: ఆర్థిక నిపుణుల ముందస్తు అంచనాలకు అనుగుణంగానే ‘రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపోరేటును (Repo Rate) 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా ఏడోసారి ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన (RBI Monetary Policy) సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమానికి రిజర్వ్ బ్యాంక్ ప్రయాణానికి దగ్గరి సంబంధం ఉందని దాస్ అన్నారు. సంస్థపై ఉన్న బహుళ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కొత్త అంశాలను స్వీకరిస్తామన్నారు. నూతన ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఆర్బీఐ ఇటీవలే 90వ వార్షికోత్సవం నిర్వహించుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ద్రవ్యపరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయాల్లో కీలకాంశాలు..
- ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యానికి తీసుకురావడంపై దృష్టి కేంద్రీకరించేందుకు బలమైన వృద్ధి అవకాశాలు వెసులుబాటు కల్పిస్తున్నాయి.
- ద్రవ్యోల్బణాన్ని లక్షిత పరిధి అయిన 4 శాతానికి తీసుకువచ్చేందుకు ఎంపీసీ కట్టుబడి ఉంది.
- ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణ పెరుగుదలపై ఆర్బీఐ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
- గ్లోబల్ జీడీపీలో రుణాల నిష్పత్తి అధికంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై దాని ప్రభావం ఉండొచ్చు.
- గ్రామీణ గిరాకీ పుంజుకుంటోంది. ఇది 2024-25లో ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని అంచనా.
- ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం, తయారీ, సేవల రంగాలలో స్థిరమైన వృద్ధి ప్రైవేట్ పెట్టుబడులను ఊతమివ్వనుంది.
- 2024-25లో భారత జీడీపీ వృద్ధిరేటు అంచనా 7 శాతం. జూన్ త్రైమాసికంలో 7 శాతం, సెప్టెంబరులో 6.9 శాతం, మూడు, నాలుగు త్రైమాసికాల్లో 7 శాతం వృద్ధిరేటు అంచనా.
- ప్రపంచ వృద్ధి పుంజుకుంటోంది. ముడి చమురు ధరల పెరుగుదలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
- కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కమొడిటీ ధరలను తలకిందులు చేసే ప్రమాదం ఉంది.
- స్థూల ద్రవ్యోల్బణ పెరుగుదలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలకు అధిక ఆహార ద్రవ్యోల్బణం గండికొట్టొచ్చు.
- సాధారణ వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతంగా అంచనా. తొలి త్రైమాసికంలో 4.9%, రెండో త్రైమాసికంలో 3.8%, మూడో త్రైమాసికంలో 4.6%, నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా అంచనా.
- వర్ధమాన మార్కెట్ల కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి ఒక పరిధిలోనే కొనసాగుతోంది. 2023లో మన రూపాయి అత్యల్ప ఒడుదొడుకులను చవిచూసింది.
- బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు సహా ఇతర ఆర్థిక సంస్థలు పాలనాపరమైన అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
-
మార్చి 29 నాటికి 645.6 బిలియన్ డాలర్ల వద్ద భారత విదేశీ మారక నిల్వలు జీవనకాల గరిష్ఠానికి చేరాయి. రెమిటెన్స్లను స్వీకరిస్తున్న అతిపెద్ద దేశంగా భారత్ కొనసాగుతోంది.
-
ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్లో రిటైల్ భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఆర్బీఐ మొబైల్ యాప్ను తీసుకురానుంది.
-
అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో సావరిన్ గ్రీన్ బాండ్పై ట్రేడింగ్ కోసం ఆర్బీఐ త్వరలో స్కీమ్ను నోటిఫై చేయనుంది.
-
UPI ద్వారా నగదు డిపాజిట్లను అనుమతించాలని RBI ప్రతిపాదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
Adani Hindenburg Row: అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందంటూ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక వెనక చైనా హస్తం ఉందని ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ ఆరోపించారు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200
Stock Market Opening bell: ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 492 పాయింట్ల నష్టంతో 79,557 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 24,201 వద్ద ట్రేడవుతోంది. -
హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి
హైదరాబాద్లో 2024 జనవరి-జూన్లో 18,573 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయమైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. -
మార్కెట్లు పెరుగుతున్నాయ్.. జాగ్రత్త
ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ సూచించారు. -
ఎల్ఐసీ ‘జీవన్ సమర్థ్’ ప్రాజెక్టు
తమ వ్యవస్థను మరింత మెరుగు పరచుకునే లక్ష్యంతో ‘జీవన్ సమర్థ్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) గురువారం ప్రకటించింది. -
సిమెంట్ రంగంలో 2-3 శాతం వృద్ధి!
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో సిమెంట్ రంగంలో 2-3% వృద్ధి నమోదు కావొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. -
ఆకర్షణీయంగా ఆఫీస్లు
ఉద్యోగుల వలసలను ఆపడంతో పాటు.. కార్యాలయాలకు వచ్చేలా వారిని ఆకర్షించేందుకు ‘ఆఫీస్ పీకాకింగ్’నకు పలు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. -
స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించనున్న రేమండ్
స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించి, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ప్రత్యేక సంస్థగా నమోదు చేయనున్నట్లు రేమండ్ లిమిటెడ్ గురువారం ప్రకటించింది. -
రూ.447.30 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పెద్ద షేర్లు రాణించడంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల ఎగువన ముగిసింది. -
వ్యవసాయ రుణాలకు ప్రత్యేక కేంద్రాలు: ఎస్బీఐ
వ్యవసాయ రుణాల కోసం అగ్రికల్చరల్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్స్ పేరుతో 35 ప్రత్యేక కేంద్రాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రారంభించింది. -
అన్వితా గ్రూప్ రూ.2000 కోట్ల స్థిరాస్తి ప్రాజెక్టు
స్థిరాస్తి సేవల సంస్థ అన్వితా గ్రూప్ హైదరాబాద్ శివార్లలోని కొల్లూరులో రూ.2,000 కోట్ల విలువైన నూతన గృహ సముదాయ ప్రాజెక్టు ఇవానాను చేపట్టింది. -
మహిళా పారిశ్రామికవేత్తతో ఈఈఎస్ఎల్ ఒప్పందం
విద్యుత్తు ఆదా చేసే సాధనాల వినియోగంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త పద్మ వథ్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. -
బ్రోకరేజీల్లో మోసాల అడ్డుకట్టకు ఒక వ్యవస్థ!
స్టాక్ మార్కెట్లో మదుపర్ల ప్రయోజనాలను రక్షించేందుకు.. మోసాలను కనిపెట్టి, వాటిని అరికట్టే ఒక సంస్థాగత వ్యవస్థను బ్రోకింగ్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలని సెబీ గురువారం ఆదేశించింది. -
సిలిండర్లకు క్యూఆర్ కోడ్!
నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పెసో (పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్)ను ఆదేశించారు. -
జీఎస్టీ ఆదాయంలో కేంద్రం భారీ త్యాగం
జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి, రాష్ట్రాలకు పరిహారం చెల్లించడం కోసం జీఎస్టీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కేంద్రప్రభుత్వం త్యాగం చేయాల్సి వచ్చిందని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు. -
పెట్టుబడుల ఉపసంహరణ భారీ స్థాయిలో లేనట్లే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2.1 లక్షల కోట్ల డివిడెండును కేంద్రానికి ఇవ్వడంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో భారీ స్థాయి పెట్టుబడుల ఉపసంహరణలు ఉండకపోవచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ కేర్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లో మోసాలు చేసే వారి గురించి తమకు తెలియజేయాలని మార్కెట్ వర్గాలకు సెబీ ఛైర్మన్ మాధబి పురి బచ్ పిలుపునిచ్చారు. -
యులిప్.. ఎప్పుడు తీసుకోవాలంటే..
బీమా.. పెట్టుబడి కలిసి ఉండే యూనిట్ ఆధారిత బీమా పాలసీ(యులిప్)లు కాస్త భిన్నమైన పథకాలనే చెప్పాలి. ఇప్పటి వరకూ వీటిని బీమా సంస్థలు పెట్టుబడి పథకాలుగానే చెబుతూ పాలసీదారులకు విక్రయించేవి. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
మీ డబ్బు సురక్షితంగా..
ఆర్థిక లావాదేవీలు డిజిటల్లో సులువుగా చేసేస్తున్నాం. అదే సమయంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భద్రత అనేది కీలకంగా మారుతోంది. -
పింఛను పాలసీ తీసుకోవచ్చా?
బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే కార్పొరేట్ బాండ్లు కాస్త అధిక రాబడిని ఇచ్చే మాట వాస్తవమే. కానీ, పెద్ద కంపెనీలు, క్రెడిట్ రేటింగ్ బాగున్న వాటినే ఎంచుకోవాలి.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?
-
24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!
-
కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో సీఎం చంద్రబాబు భేటీ
-
నిద్ర సరిపోవట్లేదు.. రాత్రి 8 తర్వాత రాలేను: బైడెన్
-
శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాశ్ రెడ్డి
-
ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్.. 39 మందికి అస్వస్థత