- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
RBI Interest Rates: వడ్డీరేట్లు మళ్లీ యథాతథం.. రెపోరేటు 6.5 శాతం వద్ద ఫిక్స్
RBI Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. గవర్నర్ శక్తికాంత దాస్ ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (MPC) సమీక్ష నిర్ణయాలను శుక్రవారం ప్రకటించారు.
RBI Interest Rates | ముంబయి: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. బుధవారం ప్రారంభమైన ద్వైమాసిక ద్రవ్యపరపతి కమిటీ విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఇంధన ధరల్లో ప్రతిద్రవ్యోల్బణం నమోదవుతోందని తెలిపారు. అయినప్పటికీ.. ధరల పెరుగుదలపై ఎంపీసీ అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యత అనుకూలంగా ఉందన్నారు. ఆహార ద్రవ్యోల్బణమే కొంత వరకు ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.
ఎంపీసీ సమీక్షలోని కీలక ప్రకటనలు..
- ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపునకు తీసుకురావడానికి ఆర్బీఐ కట్టుబడి ఉంది.
- నైరుతి రుతుపవనాలతో ఖరీఫ్ సాగు ఉత్పత్తి పెరుగుతుందని ఆశిస్తున్నాం. రిజర్వాయర్లలో నీటిమట్టాలు పెరుగుతాయనుకుంటున్నాం.
- 2024-2025 వృద్ధిరేటు అంచనా 7.5 శాతం. ఇది కార్యరూపం దాల్చితే వరుసగా నాలుగో ఏడాది 7 శాతం ఎగువన వృద్ధి నమోదైనట్లు అవుతుంది.
- 2024-25 రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలు..
- ఆర్థిక సంత్సరం - 4.5%
- తొలి త్రైమాసికం - 4.9%
- రెండో త్రైమాసికం - 3.8%
- మూడో త్రైమాసికం - 4.6%
- నాలుగో త్రైమాసికం - 4.5%
- ఆహార ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పర్యవేక్షించాల్సి ఉంది.
- ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి స్థిరత్వం భారతదేశ దృఢమైన ఆర్థిక పునాదులకు నిదర్శనం.
- 2023-24 ఆర్థిక సంవత్సర వార్షిక ఫలితాలు బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉందో సూచిస్తున్నాయి.
- కస్టమర్ల భద్రతకు ఆర్బీఐ తొలి ప్రాధాన్యం. ఇప్పటికే కొన్ని సంస్థలు వినియోగదారులకు తెలియజేయకుండా కొన్ని రకాల రుసుములను వసూలు చేస్తున్నాయి.
- అన్సెక్యూర్డ్ లోన్ల జారీని మరింత అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.
- ప్రపంచ రెమిటెన్స్లలో భారత్ వాటా 15.2 శాతం. తద్వారా విదేశీ ద్రవ్యాన్ని పొందుతున్న అతిపెద్ద దేశంగా కొనసాగుతోంది.
- ఎఫ్డీఐలు బలంగా కొనసాగుతున్నాయి. నికరంగా చూస్తే మాత్రం తగ్గుదల నమోదైంది.
- వస్తు-సేవల ఎగుమతులు-దిగుమతులకు సంబంధించిన ఫెమా నిబంధనలను హేతుబద్ధీకరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
భారతీయ వివాహ వైభోగమే!
భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణం సుమారు రూ.10 లక్షల కోట్లు (130 బిలియన్ డాలర్లు)గా ఉందని బ్రోకరేజీ జెఫ్రీస్ నివేదిక పేర్కొంది. -
పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్
స్టాక్ మార్కెట్లు ఈ వారం చాలా తక్కువ శ్రేణిలోనే కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎటువంటి ప్రధాన వార్తలూ లేకపోవడానికి తోడు, కొద్ది రోజుల ర్యాలీతో షేర్ల ధరలు అధిక స్థాయిలకు చేరడం ఇందుకు కారణంగా నిలవవచ్చని చెబుతున్నారు. -
3 ఐపీఓలు.. రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యం
నిధుల సమీకరణ కోసం ఈ వారం రెండు మెయిన్ బోర్డ్ ఐపీఓలు, ఒక ఎస్ఎంఈ ఐపీఓ రాబోతున్నాయి. మొత్తం రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇవి వస్తున్నాయి. -
పత్తి సానుకూలమే!
పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,044 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. -
77400- 78000 పాయింట్ల శ్రేణి కీలకం!
దేశీయ గణాంకాలు, అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం మార్కెట్లు జీవనకాల తాజా గరిష్ఠాలను అధిరోహించాయి. ఎఫ్ఐఐ, డీఐఐ కొనుగోళ్లు ఇందుకు అండగా నిలిచాయి. -
లిక్విడేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు ఎలక్ట్రానిక్ ఫామ్లు: ఐబీబీఐ
దివాలా పరిష్కార వృత్తి నిపుణులకు నిబంధనల భారం సులభతరం చేసేందుకు, లిక్విడేషన్ ప్రక్రియను ప్రభావవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా దివాలా స్మృతి (ఐబీసీ) కింద ఎలక్ట్రానిక్ ఫామ్లను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) తీసుకొచ్చింది. -
సంక్షిప్త వార్తలు
భారత సైన్యం చేతికి తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్ చేరింది. బెంగళూరు సంస్థ సిగ్నల్ట్రాన్ ఈ 4జీ బేస్ స్టేషన్ను భారత సైన్యానికి అందించింది. -
భారత్లో చదువు కంటే వివాహాలపైనే ఖర్చెక్కువ: జెఫరీస్
Indian Weddings: భారత్లో వివాహాల సమయంలో జరిగే ఆడంబరాల గురించి జెఫరీస్ నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. చేసే ఖర్చు, వివిధ రంగాలకు లభించే గిరాకీ గురించి ప్రస్తావించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!
-
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
-
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!