- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Demat accounts: జూన్లో 42 లక్షల డీమ్యాట్ ఖాతాలు.. మొత్తం ఎన్ని?
Demat accounts: దేశంలో డీమ్యాట్ ఖాతాల తెరిచే వారి సంఖ్య పెరుగుతోంది. జూన్లో ఈ సంఖ్య మరో 42 లక్షలు పెరిగింది.
Demat accounts | ముంబయి: దేశంలో ఈక్విటీ మార్కెట్లు ఊరిస్తున్నాయి. వీటిల్లో పెట్టుబడులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. డీమ్యాట్ ఖాతాలు (Demat accounts) తెరిచే వారి సంఖ్య పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది జూన్లో కొత్తగా 42 లక్షల డీమ్యాట్ ఖాతాలు జతయ్యాయి. దేశీయ స్టాక్మార్కెట్ పట్ల బుల్లిష్ ధోరణి కొనసాగుతుండడమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ అండ్ నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ డేటా ప్రకారం.. జూన్లో 42.4 డీమ్యాట్ ఖాతాలు కొత్తగా చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో డీమ్యాట్ ఖాతాలు పెరగడం ఇదే తొలిసారి. గత నెలలో 36 లక్షల డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అవ్వగా.. గతేడాది ఇదే నెలలో 23.6 లక్షల డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. ఒక నెలలో 40 లక్షల డీమ్యాట్ ఖాతాలు తెరుచుకోవడం ఇది నాలుగో సందర్భం. 2023 డిసెంబర్, 2024 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇదే స్థాయిలో డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. దీంతో దేశంలో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 16.2 కోట్లకు చేరినట్లు డేటా చెబుతోంది.
కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడం ఈక్విటీ మార్కెట్లలో మదుపర్లలో ఉత్సాహం నెలకొందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా మార్కెట్ నుంచి మెరుగైన రిటర్నులు వస్తుండడం, ఐపీఓలు క్యూ కడుతుండడం కూడా కారణమని చెబుతున్నారు. ఇటీవల సూచీలు కొత్త గరిష్ఠాలను చేరుతుండడంతో మదుపరుల్లో విశ్వాసాన్ని నింపుతున్నట్లు భావిస్తున్నారు. అయితే, తెరుచుకున్న అకౌంట్లన్నీ కొత్త ఇన్వెస్టర్లుగా భావించకూడదని, వేరే బ్రోకర్ దగ్గర కొత్తగా నమోదయ్యేవీ ఉంటాయని అనలిస్టులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నివేదికను హిండెన్బర్గ్ ముందే లీక్ చేసింది.. లాభాల్లో వాటా తీసుకుంది’
Adani Hindenburg Row: అదానీ గ్రూప్పై తయారు చేసిన నివేదికను హిండెన్బర్గ్ ముందే తమ క్లయింట్లకు లీక్ చేసిందని సెబీ ఆరోపించింది. తద్వారా ఆయా క్లయింట్లు పొందిన లాభాల నుంచి వాటా తీసుకుందని తెలిపింది. -
రూ.10 లక్షలకు ఆయుష్మాన్ భారత్.. మరింత మందికి పథకం విస్తరణ?
Ayushman Bharat: రాబోయే బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పథకం కింద లభించే హామీ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
బుల్ను మించిన బంగారం
ప్రస్తుత సంవత్సరం తొలి అర్ధభాగంలో అటు స్టాక్ మార్కెట్, ఇటు బంగారం సానుకూలతలనే అందించాయి. ఈ రెండింటిలో పెట్టుబడి పెట్టిన మదుపర్లకు మంచి లాభాలే వచ్చాయి. -
జీఎస్టీని 5 శాతం చేయండి
దేశంలో 2047 నాటికి అందరికీ బీమా అందించాలనే లక్ష్యాన్ని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) విధించుకుంది. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. -
501 ఒప్పందాలు.. 21.4 బి.డాలర్లు
ప్రస్తుత ఏడాది రెండో త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో భారత కార్పొరేట్లు మొత్తం 501 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. -
గృహ పథకానికి రూ.55,000 కోట్ల సబ్సిడీ!
-
భారత స్థిరాస్తిలోకి రూ.25,700 కోట్ల విదేశీ పెట్టుబడులు
ఈ ఏడాది జనవరి- జూన్ మధ్య భారత స్థిరాస్తి రంగంలో, విదేశీ పెట్టుబడిదారులు 3.1 బి.డాలర్ల (రూ.25,700 కోట్లు) పెట్టుబడులు పెట్టినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది. -
ఎఫ్ఎంసీజీ ఆదాయ వృద్ధి 7-9%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఎఫ్ఎంసీజీ రంగ ఆదాయ వృద్ధి 7-9 శాతం మధ్య నమోదు కావొచ్చని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. -
గూగుల్ మ్యాప్స్ నుంచి ఓలా నిష్క్రమణ
ఓలాలో క్యాబ్/ఆటో/బైక్ బుక్ చేసుకుంటే.. గమ్యస్థానాన్ని చేరే మార్గం, సమయం తదితరాలు మ్యాప్ రూపంలో మనకు కనిపిస్తుంటాయి. -
బంధన్ బ్యాంక్ తాత్కాలిక ఎండీ, సీఈఓగా రతన్ కుమార్ కేశ్
బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రతన్ కుమార్ కేశ్ తాత్కాలిక ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
ప్యాకేజ్డ్ ఆహార వస్తువులపై సమాచారం పెద్ద అక్షరాల్లో..
ప్యాకేజ్డ్ ఆహార వస్తువులపై ముద్రించే పోషక సమాచారంలో మార్పులు చేయడానికి ఆహార నియంత్రణాధికార సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) శనివారం ఆమోదం తెలిపింది. -
సంక్షిప్తవార్తలు(5)
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ చర్యల నుంచి పాఠం నేర్చుకున్నట్లు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..