- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
LPG commercial cylinder Price: తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర..
LPG commercial cylinder Price: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించాయి. ఒక్కో సిలిండర్పై రూ.32 తగ్గడం గమనార్హం.
దిల్లీ: వ్యాపారులు, వాణిజ్య సంస్థలకు ఊరటనిస్తూ చమురు మార్కెట్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి (LPG commercial cylinder Price). 19 కిలోల సిలిండర్ ధర గరిష్ఠంగా రూ.32 వరకు తగ్గింది. దిల్లీలో ప్రస్తుత ధర రూ.1,646కు దిగొచ్చింది. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
కొన్ని నెలలగా వాణిజ్య సిలిండర్ ధర (LPG commercial cylinder Price) తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. జూన్ 1న 19 కిలోల సిలిండర్ ధరను రూ.69.50 తగ్గించారు. అంతకుముందు మే 1న కూడా ధరను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధిక నిర్వహణ వ్యయాలతో సతమతమవుతున్న హోటళ్లు, రెస్టారంట్లు సహా ఇతర వ్యాపారులకు దీంతో ఊరట లభిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు, డిమాండ్- సరఫరా, పన్ను విధానాల ఆధారంగా గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతీనెలా సవరిస్తుంటారు. తాజా తగ్గింపునకు గల కారణాలను మాత్రం కంపెనీలు ప్రత్యేకంగా వెల్లడించలేదు. కానీ, సానుకూల స్థూల ఆర్థిక పరిస్థితులు, మార్కెట్లో స్థిరత్వం కారణంగానే ధరలు దిగొస్తున్నాయని నిపుణులు విశ్లేషించారు.
పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గృహవినియోగ సిలిండర్ ధరలను మాత్రం కంపెనీలు సవరించలేదు. హైదరాబాద్లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.855, విజయవాడలో రూ.844, విశాఖపట్నంలో రూ.811గా ఉంది. మరోవైపు లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్లో రూ.107.41, విజయవాడలో రూ.109.73, విశాఖపట్నంలో రూ.108.29గా ఉంది. లీటర్ డీజిల్ ధర వరుసగా.. రూ.95.65, రూ.97.56, రూ.96.17గా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో వాణిజ్య సిలిండన్ కొత్త ధరలు..
- హైదరాబాద్ - రూ.1,872
- విజయవాడ - రూ.1,832
- విశాఖపట్నం - రూ.1,704
- ముంబయి - రూ.1,598
- కోల్కతా - 1,756
- చెన్నై - రూ.1,809
- బెంగళూరు - రూ.1,724
- తిరువనంతపురం - రూ.1,676
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదానీ హిండెన్బర్గ్ వివాదంలో కొత్త మలుపు.. మధ్యలో కోటక్ బ్యాంకు ప్రస్తావన!
Adani Hindenburg Row: అదానీ హిండెన్బర్గ్ వివాదంలోకి తాజాగా కోటక్ బ్యాంకు కూడా వచ్చి చేరింది. సెబీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు స్పందిస్తూ.. హిండెన్బర్గ్ తాజాగా మరికొన్ని ఆరోపణలు చేసింది. -
ఎఫ్డీ కంటే అధిక వడ్డీ.. ఆర్బీఐ గ్యారెంటీతో వచ్చే ఈ బాండ్స్ గురించి తెలుసా?
RBI Floating Rate Savings Bonds | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ సేవింగ్స్ బాండ్లు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. ఇందులో పెట్టుబడి చేయాలంటే కొన్ని విషయాలను తెలుసుకోవాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,150 ఎగువన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 125 పాయింట్ల లాభంతో 79,601 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు పుంజుకొని 24,189 దగ్గర కొనసాగుతోంది. -
ఫార్మా షేర్లు కోలుకుంటున్నాయ్
ఫార్మా కంపెనీలపై స్టాక్మార్కెట్ మదుపరుల్లో మళ్లీ ఆసక్తి కనిపిస్తోంది. కొవిడ్-19 ముంచుకొచ్చినప్పుడు, మందులకు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో ఫార్మా కంపెనీలు అధిక అమ్మకాలు, లాభాలు నమోదు చేశాయి. -
మదుపర్ల సంపద రూ.443 లక్షల కోట్లు
బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీల లాభాల జోరు కొనసాగింది. సెన్సెక్స్ కొత్త గరిష్ఠ స్థాయి వద్ద ముగియగా, నిఫ్టీ 24,100 పాయింట్ల ఎగువకు చేరింది. సానుకూల ఆసియా, ఐరోపా సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. -
పతంజలి ఫుడ్స్ చేతికి మరిన్ని వ్యాపారాలు
పతంజలి ఆయుర్వేద్కు చెందిన గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారాలను రూ.1,100 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు వంటనూనెల దిగ్గజ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. -
జూన్లో కార్ల విక్రయాలు 4% పెరిగాయ్
ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు గత నెలలో 4% పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ అధికంగా ఉండటంతో, విక్రయాలపై ప్రభావం పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. -
రిలయన్స్ మార్కెట్ విలువకు మరో 100 బి. డాలర్లు జత!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ మరో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) మేర పెరగనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది. -
రూ.2,000 నోట్లు 97.87% వెనక్కి వచ్చాయ్: ఆర్బీఐ
రూ.2,000 నోట్లలో 97.87% వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం వెల్లడించింది. రూ.7,581 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. -
ఆర్బీఐకి ఇద్దరు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అర్నబ్ కుమార్ ఛౌధ్రీ, చారులతా ఎస్ కర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు వీరు ఆర్బీఐలో చీఫ్ జనరల్ మేనేజర్లుగా ఉన్నారు. -
ఎయిరిండియా పైలట్ల శిక్షణ సంస్థ
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా, మహారాష్ట్రలోని అమరావతిలో పైలట్ల శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ఏడాదికి 180 మంది వాణిజ్య పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది ప్రతిపాదన. -
సంక్షిప్త వార్తలు(6)
ప్రభుత్వ రంగ సంస్థ పవర్గ్రిడ్ కార్పొరేషన్ దక్షిణ ప్రాంత చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా అఖిలేష్ పాఠక్ బాధ్యతలు చేపట్టారు. పవర్గ్రిడ్ దక్షిణ ప్రాంత ట్రాన్స్మిషన్ సిస్టమ్-1 పరిధిలో తెలంగాణ, -
ఐపీఓలకు కంపెనీలు సై
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ శివాలిక్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో లైఫ్ ట్యాక్స్ సమస్యను పరిష్కరించండి.. లోకేశ్కు క్యాబ్ డ్రైవర్ల వినతి
-
అదానీ హిండెన్బర్గ్ వివాదంలో కొత్త మలుపు.. మధ్యలో కోటక్ బ్యాంకు ప్రస్తావన!
-
జిగాన గన్స్.. రూ.25 లక్షల కాంట్రాక్ట్..: కారులోనే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర
-
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
-
టీ20 వరల్డ్ కప్.. రోహిత్తో ఐకానిక్ ఫొటో.. ఎందుకో చెప్పిన కోహ్లీ
-
విమానంలో కుదుపులు.. ఓవర్హెడ్ బిన్లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు