- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Office space leasing: హైదరాబాద్లో 40% పెరిగిన కార్యాలయాల అద్దె లావాదేవీలు
అంతర్జాతీయ సంస్థలతో పాటు, దేశీయ కంపెనీలూ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడంతో, హైదరాబాద్లో కార్యాలయాల స్థలానికి గిరాకీ పెరిగింది.
కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక
ఈనాడు, హైదరాబాద్: అంతర్జాతీయ సంస్థలతో పాటు, దేశీయ కంపెనీలూ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడంతో, హైదరాబాద్లో కార్యాలయాల స్థలానికి గిరాకీ పెరిగింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో మొత్తం 50 లక్షల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్లింది. గత ఏడాది ఇదే కాలంలో 36 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సంస్థలు అద్దెకు తీసుకున్నాయి. దీంతో పోలిస్తే ఈసారి అద్దె లావాదేవీల్లో 40% వృద్ధి కనిపించిందని స్థిరాస్తి సేవల సంస్థ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ప్రముఖ సంస్థలు తమ వ్యాపార విస్తరణకు హైదరాబాద్ను కీలక స్థానంగా భావిస్తున్నాయని పేర్కొంది.
అందుబాటులో ఉండటమే..: హైదరాబాద్లో కార్యాలయ స్థలానికి గిరాకీ పెరిగేందుకు ఇక్కడి మౌలిక వసతులతో పాటు, అనువైన వ్యాపార విధానాలు, స్థిరమైన ప్రభుత్వం లాంటివి తోడ్పడుతున్నాయని నివేదిక పేర్కొంది. ఇక్కడ స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉండటం, నిపుణుల లభ్యతా అనుకూలంగా ఉందని తెలిపింది. దీంతో హైదరాబాద్పై పెట్టుబడిదారులు, స్థిరాస్తి డెవలపర్లు, సంస్థలూ సానుకూలంగా ఉంటున్నట్లు వెల్లడించింది.
గ్రేడ్ ఏ ప్రాజెక్టులకు..: భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు వీలుగా ఉండేలా చూసుకోవడంతో పాటు, ఆధునిక వసతులు, కీలక ప్రాంతాల్లో ఉన్న గ్రేడ్ ఏ వాణిజ్య ప్రాజెక్టులకు అధిక గిరాకీ ఉందని నివేదిక పేర్కొంది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో కొత్తగా 27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది.
ఐటీ రంగంలోనే..: అత్యధిక లీజింగ్ లావాదేవీలు ఐటీ-బీపీఎం రంగంలోనే జరిగాయి. మొత్తం అద్దెకు వెళ్లిన స్థలంలో 36% వరకు ఈ సంస్థలే తీసుకున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థలు 29% స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ఫ్లెక్సిబుల్ వర్క్ప్లేస్ సంస్థలు 17% స్థలాన్ని తీసుకున్నాయి. వీటితో పాటు కో-లివింగ్ లాంటి వాటి కోసమూ అద్దె లావాదేవీలు జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో.. రూ.55,000 కోట్ల ఐపీఓ?
రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్ జియోను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఉక్కు నిర్మాణాలను ప్రోత్సహించాలి
మౌలిక వసతుల పరంగా తెలుగు రాష్ట్రాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నందున, ఇక్కడ ఉక్కు ఆధారిత నిర్మాణాలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా సూచించారు. -
కార్ల రిటైల్ అమ్మకాలకు వడదెబ్బ
భారత్లో ప్రయాణికుల వాహనాల (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) రిటైల్ విక్రయాలు జూన్లో నెమ్మదించాయి. -
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక వెనక చైనా హస్తం?
అదానీ గ్రూప్ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణలు చేసిన ఉదంతం కొత్త మలుపులు తీసుకుంటోంది. -
సెన్సెక్స్కు స్వల్ప నష్టాలు
గరిష్ఠ స్థాయుల్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్, స్వల్ప నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ మాత్రం తాజా రికార్డు గరిష్ఠానికి చేరింది. -
త్వరలో భారత్లో షియోమీ విద్యుత్ కారు ఎస్యూ7 ప్రదర్శన!
భారత విద్యుత్ వాహన (ఈవీ) విపణిలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై చైనా మొబైల్, విద్యుత్తు వాహన సంస్థ షియోమీ దృష్టి సారిస్తోంది. -
వంట పాత్రలకూ ఐఎస్ఐ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
వంటకు ఉపయోగించే అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకూ ఇక నుంచి ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) ముద్రను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్
సీఎన్జీ ఇంధనంగా వినియోగించే మోటార్సైకిల్ను ప్రపంచంలోనే తొలిసారిగా బజాజ్ ఆటో ఆవిష్కరించింది. -
డీమ్యాట్ ఖాతాలు 16.2 కోట్లు
ఈ ఏడాది జూన్ చివరకు డీమ్యాట్ ఖాతాల సంఖ్య 16.2 కోట్లకు చేరినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ తెలిపాయి. -
శాకాహార భోజన ఖర్చు 10% అధికం
శాకాహార భోజనం (వెజ్ థాలి) సగటు ధర జూన్లో 10% పెరిగిందని క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. -
ఎమ్ఎస్ఎమ్ఈ రుణాల్లో 7 శాతమే మహిళలకు
సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎమ్ఎస్ఎమ్ఈ)లకు ఇచ్చిన మొత్తం రుణాల్లో కేవలం 7 శాతమే మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు వెళ్లాయని రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) నీరజ్ నిగమ్ పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (2)
వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వచ్చిన వార్తలను టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ శుక్రవారం కొట్టిపారేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
Jio OTT plans: జియో సంస్థ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను తగ్గించేసింది. 21 నుంచి ఏడుకు కుదించింది.