- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Jensen Huang: జపాన్లో ఓ తోటమాలి విలువైన పాఠం నేర్పాడు: ఎన్విడియా సీఈవో
Jensen Huang: ఎన్వీడియా సీఈఓ ఓ తోటమాలి నుంచి నేర్చుకున్న పాఠాన్ని తాజాగా పంచుకున్నారు. ఆ గార్డెనర్ మాటలు తనలో ఆలోచనల్ని రేపాయన్నారు.
Jensen Huang | ఇంటర్నెట్డెస్క్: జీవితంలో ఏదో ఒక దశలో ఎవరో ఒకరి నుంచి మనం స్ఫూర్తి పొందుతుంటాం. వారు మనకు తెలిసిన వాళ్లే అయిఉండనవసరం లేదు. తెలియకుండానే వారి మాటలు మనలో సానుకూల మార్పు తీసుకొస్తాయి. కొత్తగా ఆలోచించేలా ప్రేరేపిస్తాయి. మనం నిజంగా దేనిపై దృష్టి పెట్టాలో నేర్పుతాయి. ఇలానే తన జీవితంలో ఓ తోటమాలి చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి అంటున్నారు ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్ (Jensen Huang). ఆ గార్డెనర్ చెప్పిన మాటలు ప్రభావం చూపాయన్నారు.
వ్యాపార రంగంలో సవాళ్లను స్వీకరిస్తూ, అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్ల తయారీ సంస్థ ఎన్విడియాను ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మార్చారు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు. ఇటీవలె కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి విచ్చేసిన ఆయన అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. తన జీవితంలో మార్పు తీసుకొచ్చిన విషయాన్ని వారితో పంచుకున్నారు. ‘ కుటుంబంతో కలిసి జపాన్లోని క్యోటోలోని సిల్వర్ టెంపుల్ను చూడటానికి వెళ్లాం. అక్కడ వేడి తీవ్రంగా ఉంది. అలానే చుట్టూ ప్రదేశాలు చూస్తున్నాం. ఆ సమయంలో తోటమాలిని చూశా. ఇంతటి ఎండలోనూ ఆయన పెద్ద తోటను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయా’’
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు సెబీ ఆమోదం.. రూ.7,250 కోట్ల సమీకరణకు గ్రీన్ సిగ్నల్
‘‘వెంటనే ఆయన వద్దకు వెళ్లి ‘ఇంతటి ఎండలో మీరు ఏం చేస్తున్నారు. ఈ తోట చాలా పెద్దగా ఉందే’ అని అడిగాను. ‘పిచ్చి మొక్కలు తీసేస్తున్నాను. నేనే 25 సంవత్సరాలుగా తోటను చూసుకుంటున్నాను అని సమాధానమిచ్చాడు. ‘ఇంతటి తోటను చూసుకోవడానికి మీకు సమయం సరిపోతుందా’ అని అడిగాను. ప్రాధాన్యత ఉన్న పనికే ఎక్కువ సమయం కేటాయిస్తా అని సమాధానమిచ్చాడు. ఆ మాటలు విని ఆలోచనలో పడ్డా’’ అని చెప్పుకొచ్చారు. తోటమాలి చెప్పిన మాటలు జీవితంలో విలువైన పాఠాలుగా మారాయని తెలిపారు. తన పని చేయడానికి ఎంత నిబద్ధతతో ఉన్నాడో అప్పుడే తెలిసింది. పనులను ప్రాధాన్య క్రమంలో చేసుకోవడం వల్ల ఎంత సమయం ఆదా అవుతుందో అప్పుడే అర్థమైందన్నారు. ఆ తర్వాత నుంచి ప్రతి ఉదయం ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పనిని ముందుగా చేయడం మొదలు పెట్టినట్లు తెలిపారు. ముఖ్యమైన పని పూర్తి చేసిన తర్వాతే ఇతర పనులు చేయడానికి మిగిలిన సమయాన్ని కేటాయిస్తానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫార్మా షేర్లు కోలుకుంటున్నాయ్
ఫార్మా కంపెనీలపై స్టాక్మార్కెట్ మదుపరుల్లో మళ్లీ ఆసక్తి కనిపిస్తోంది. కొవిడ్-19 ముంచుకొచ్చినప్పుడు, మందులకు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో ఫార్మా కంపెనీలు అధిక అమ్మకాలు, లాభాలు నమోదు చేశాయి. -
మదుపర్ల సంపద రూ.443 లక్షల కోట్లు
బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీల లాభాల జోరు కొనసాగింది. సెన్సెక్స్ కొత్త గరిష్ఠ స్థాయి వద్ద ముగియగా, నిఫ్టీ 24,100 పాయింట్ల ఎగువకు చేరింది. సానుకూల ఆసియా, ఐరోపా సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. -
పతంజలి ఫుడ్స్ చేతికి మరిన్ని వ్యాపారాలు
పతంజలి ఆయుర్వేద్కు చెందిన గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారాలను రూ.1,100 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు వంటనూనెల దిగ్గజ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. -
జూన్లో కార్ల విక్రయాలు 4% పెరిగాయ్
ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు గత నెలలో 4% పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ అధికంగా ఉండటంతో, విక్రయాలపై ప్రభావం పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. -
రిలయన్స్ మార్కెట్ విలువకు మరో 100 బి. డాలర్లు జత!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ మరో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) మేర పెరగనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది. -
రూ.2,000 నోట్లు 97.87% వెనక్కి వచ్చాయ్: ఆర్బీఐ
రూ.2,000 నోట్లలో 97.87% వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం వెల్లడించింది. రూ.7,581 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. -
ఆర్బీఐకి ఇద్దరు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అర్నబ్ కుమార్ ఛౌధ్రీ, చారులతా ఎస్ కర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు వీరు ఆర్బీఐలో చీఫ్ జనరల్ మేనేజర్లుగా ఉన్నారు. -
ఎయిరిండియా పైలట్ల శిక్షణ సంస్థ
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా, మహారాష్ట్రలోని అమరావతిలో పైలట్ల శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ఏడాదికి 180 మంది వాణిజ్య పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది ప్రతిపాదన. -
సంక్షిప్త వార్తలు(6)
ప్రభుత్వ రంగ సంస్థ పవర్గ్రిడ్ కార్పొరేషన్ దక్షిణ ప్రాంత చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా అఖిలేష్ పాఠక్ బాధ్యతలు చేపట్టారు. పవర్గ్రిడ్ దక్షిణ ప్రాంత ట్రాన్స్మిషన్ సిస్టమ్-1 పరిధిలో తెలంగాణ, -
ఐపీఓలకు కంపెనీలు సై
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ శివాలిక్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..