- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Real Estate: రూ. కోటి ఇళ్లకే అధిక గిరాకీ
భూముల ధరలు, నిర్మాణ ఖర్చు పెరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా రూ. కోటి, అంతకంటే విలువైన (ప్రీమియం) ఇల్లు/ఫ్లాట్ అనేది సాధారణ విషయంగా మారిందని స్థిరాస్తి సేవల సంస్థ ప్రాప్టైగర్ వెల్లడించింది.
దిల్లీ: భూముల ధరలు, నిర్మాణ ఖర్చు పెరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా రూ. కోటి, అంతకంటే విలువైన (ప్రీమియం) ఇల్లు/ఫ్లాట్ అనేది సాధారణ విషయంగా మారిందని స్థిరాస్తి సేవల సంస్థ ప్రాప్టైగర్ వెల్లడించింది. విశాలమైన లేఔట్లలో, అధునాతన సౌకర్యాలతో నివాస గృహం ఉండాలని కోరుకుంటున్న వారి సంఖ్యా పెరిగిందని తెలిపింది. దేశ వ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో జనవరి-మార్చి మధ్య అమ్ముడైన 1,20,640 ఇళ్లు/ఫ్లాట్లలో దాదాపు 37% ప్రీమియం విభాగంలోనే ఉన్నాయని పేర్కొంది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, దిల్లీ-ఎన్సీఆర్, ముంబయి మెట్రోపాలిటిన్ రీజియన్, పుణే నగరాల్లో రూ.75 లక్షల నుంచి రూ. కోటి పలుకుతున్న ఇళ్ల విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు తెలిపింది. 2019లో ప్రీమియం ఇళ్ల విక్రయాలు 16 శాతమే ఉండేవి. దేశ స్థిరాస్తి రంగం వృద్ధి చెందుతుందనేందుకు ప్రీమియం ఇళ్లకు గిరాకీయే నిదర్శనమని ప్రాప్టైగర్.కామ్ గ్రూపు సీఎఫ్ఓ వికాస్ వాధ్వాన్ తెలిపారు.
గచ్చిబౌలిలో 3% పెరిగిన అద్దె: నివాస గృహాల అద్దె ఏప్రిల్-జూన్ మధ్య సగటున 2-4% పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తెలిపింది. 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని 2బీహెచ్కే ఇళ్ల అద్దె పెరుగుదల దేశంలోని 7 ప్రధాన నగరాలైన దిల్లీ-ఎన్సీఆర్, ముంబయి మెట్రోపాలిటిన్ రీజియన్, చెన్నై, కోల్కతా, పుణే, హైదరాబాద్, బెంగళూరులలో మధ్యస్థాయిలోనే ఉందని పేర్కొంది. హైదరాబాద్లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో, ఏప్రిల్-జూన్లో ఇళ్ల అద్దె సగటున 3% పెరిగిందని తెలిపింది. ఇదే ప్రాంతంలో జనవరి-మార్చి మధ్య అద్దెల్లో వృద్ధి సగటున 5% కనిపించింది.
వృద్ధి దశలో విశాఖపట్నం, తిరుపతి: ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి, పర్యటక నగరం విశాఖపట్నంలో స్థిరాస్తి వృద్ధికి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని కొలియర్స్ పేర్కొంది. వీటితోపాటు కోయంబత్తూర్, కోచి స్థిరాస్తి రంగానికి ఆసక్తిగా కనిపిస్తున్నాయని తెలిపింది. అయోధ్య, వారణాసి, ద్వారక, పూరి, శిరిడీలాంటి ఆధ్యాత్మిక నగరాలూ వేగంగా వృద్ధి చెందుతున్నాయని పేర్కొంది. దేశ వ్యాప్తంగా మొత్తం 30 నగరాలకు ఈ జాబితాలో సంస్థ స్థానం కల్పించింది. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కలిసొస్తున్నాయని పేర్కొంది. నివాస గృహాలతో పాటు, ఆతిథ్యం, రిటైల్, వాణిజ్య, పారిశ్రామిక రంగాల నుంచీ గిరాకీ వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది. కొన్ని నగరాల్లో డేటా కేంద్రాలవంటివీ వచ్చే వీలుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెన్సెక్స్ @ 78,000
సూచీల రికార్డుల జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాంకింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ చరిత్రలోనే తొలిసారి 78,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. -
అయిదేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు
నిర్మాణ రంగంలో వినియోగించే మైల్డ్ స్టీల్(ఎంఎస్)ను ఉత్పత్తి చేసే మారుతీ ఇస్పాత్ అండ్ పైప్స్(ఎంఐపీపీఎల్) రానున్న అయిదేళ్లలో దశల వారీగా రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. -
2024లో ఎఫ్ఎంసీజీ వృద్ధి 7-9%!
ఈ ఏడాది ఎఫ్ఎంసీజీ రంగం స్థిరంగా 7-9 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నివేదిక అంచనా వేసింది. -
అదానీ రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూపు తన వ్యాపార కంపెనీల్లో రూ.1.3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని ప్రణాళికగా పెట్టుకుంది. -
భారత్, చైనాల్లోని ఫార్మా యూనిట్ల తనిఖీల తీరుపై ఎన్నో అనుమానాలు
చైనా, భారత్లోని ఫార్మా కంపెనీల యూనిట్ల తనిఖీల తీరుతెన్నులపై యూఎస్ఎఫ్డీఏ (అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ)ను అమెరికా చట్ట సభలోని ముగ్గురు సభ్యులు నిలదీశారు. -
సత్వ గ్రూప్ రూ.12,000-14,000 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్లో 2.5 కోట్ల చదరపు అడుగుల వాణిజ్య నిర్మాణాల్ని పూర్తి చేసిన స్థిరాస్తి సంస్థ సత్వ గ్రూప్ వచ్చే మూడేళ్లలో రూ.12,000-14,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు తెలిపింది. -
ట్రేడింగ్లో 46 లక్షలు పోగొట్టుకున్న బీటెక్ విద్యార్థి
పూర్తి అవగాహన ఉంటేనే ఎఫ్ అండ్ ఓలో ట్రేడ్ చేయాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా.. ఓ బీటెక్ విద్యార్థి మాత్రం పెడచెవిన పెట్టి భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. -
అధిక ద్రవ్యోల్బణ ప్రభావం గ్రామీణులపైనే ఎక్కువ
కొవిడ్-19 తర్వాత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకున్న మాదిరే భారత ద్రవ్యోల్బణం పుంజుకోవడమూ ‘కె- ఆకారం’లోనే సాగుతోందని, కొన్ని రంగాలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని విదేశీ బ్రోకరేజీ సంస్థ హెచ్ఎస్బీసీ విశ్లేషించింది. -
సంక్షిప్త వార్తలు
ఇప్పటికే జౌళి రంగం కోసం రూ.10,000 కోట్లకు పైగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం.. త్వరలో వస్త్ర రంగానికి సైతం ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోందని జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. -
28 నుంచి నెఫ్రో కేర్ ఐపీఓ
కోల్కతా ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మూత్రపిండాల సంరక్షణ సేవలు అందించే సంస్థ నెఫ్రో కేర్ ఇండియా లిమిటెడ్ ఈ నెల 28 నుంచి ఐపీఓకు రాబోతోంది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
యూపీఐ, యూట్యూబ్తో నోకియా 3 ఫీచర్ ఫోన్లు
Nokia mobiles: నోకియా బ్రాండ్పై ఫోన్లు తయారుచేసే హెఎండీ గ్లోబల్ సంస్థ.. మూడు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. -
నెట్ఫ్లిక్స్ నుంచి త్వరలో ఫ్రీ ప్లాన్..?
Netflix: ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక నెట్ఫ్లిక్స్ త్వరలో ఓ ఫ్రీ ప్లాన్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోందని సమాచారం!
తాజా వార్తలు (Latest News)
-
నా కుమార్తె కన్నీళ్లు మిమ్మల్ని వెంటాడతాయి: రేణు దేశాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/06/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
గాల్లో తెరచుకున్న విమానం పైకప్పు.. పైలట్కు భయానక అనుభవం!
-
యూపీఐ, యూట్యూబ్తో నోకియా 3 ఫీచర్ ఫోన్లు
-
‘ మీ విమానం ఎక్కను’: ఎయిరిండియా సేవలపై ఓ నెటిజన్ అసహనం