- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Niva Bupa IPO: ఐపీఓకు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్.. రూ.3వేల కోట్ల సమీకరణ
Niva Bupa IPO: ప్రముఖ ఆరోగ్య బీమా కంపెనీ నివా బుపా ఐపీఓకు రాబోతోంది. సెబీ ఆమోదం కోరుతూ ప్రాథమిక పత్రాలు సమర్పించింది.
దిల్లీ: ప్రముఖ బీమా సంస్థ ‘నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్’ ఐపీఓకి (Niva Bupa Health Insurance IPO) రాబోతోంది. ఈమేరకు సెబీ ఆమోదం కోరుతూ ప్రాథమిక పత్రాలు సమర్పించింది. దాదాపు రూ.3,000 కోట్ల నిధులు సమీకరించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.
ప్రతిపాదిత ఐపీఓలో (IPO) రూ.800 కోట్లు విలువ చేసే కొత్త షేర్లను జారీ చేయాలనుకుంటున్నట్లు నివా బుపా తెలిపింది. మరో రూ.2,200 కోట్ల షేర్లు ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు తమ వాటాల నుంచి విక్రయించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఇన్వెస్టర్ ఫెటిల్ టోన్ ఎల్ఎల్పీ రూ.1,880 కోట్లు, ప్రమోటర్ బుపా సింగపూర్ హోల్డింగ్స్ లిమిటెడ్ రూ.320 కోట్లు విలువ చేసే షేర్లను ఐపీఓలో (Niva Bupa Health Insurance IPO) ఉంచుతున్నట్లు పేర్కొంది. ఈ కంపెనీ నిర్వహణను ప్రధానంగా యూకే కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ కంపెనీ బుపా చేపడుతోంది. ప్రస్తుతం 62.27 శాతం వాటా బుపా సింగపూర్ హోల్డింగ్స్కు, 27.86 శాతం వాటా ఫెటిల్ ఎల్ఎల్పీకి ఉంది.
రూ.160 కోట్ల విలువైన సెక్యూరిటీలను ప్రీ-ఐపీఓ ప్లేస్మెంట్ ద్వారా జారీ చేసే యోచనలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అదే జరిగితే ఐపీఓ (Niva Bupa Health Insurance IPO) పరిమాణం తగ్గుతుందని పేర్కొంది. సమీకరించిన నిధుల్లో రూ.625 కోట్లు రుణ చెల్లింపుల కోసం కేటాయిస్తామని తెలిపింది. మిగిలిన వాటిని కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తామని వెల్లడించింది.
దేశీయంగా ఐపీఓకు వస్తున్న రెండో ఆరోగ్య బీమా సంస్థ నివా బుపా. గతంలో ‘స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. దేశంలోని ప్రధాన ఆరోగ్య బీమా కంపెనీల్లో నివా బుపా ఒకటి. 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపదికన ఈ కంపెనీ స్థూల రిటెన్ ప్రీమియం 37.68 శాతం పెరిగి రూ.5,607.57 కోట్లకు చేరింది. లాభం రూ.12.54 కోట్ల నుంచి రూ.81.85 కోట్లకు పెరిగింది. 2024 మార్చి 31 నాటికి ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 210 బ్రాంచీలు ఉన్నాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీ, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఈ ఐపీఓకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీఎస్ఎన్ఎల్ రూ.249 ప్లాన్.. 45 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా
BSNL: ప్రైవేట్ టెలికాం సంస్థలన్నీ టారిఫ్లను పెంచిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్లోని రూ.249 ప్లాన్ ఇప్పుడు ట్రెండవుతోంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలేంటో చూద్దాం. -
రోజులో ఆ టైమ్ నాకు ఇంపార్టెంట్: దినచర్య గురించి జెఫ్ బెజోస్ ఏం చెప్పారంటే?
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ (Jeff Bezos) తన దినచర్యను ఎలా ప్రారంభిస్తారో వెల్లడించారు. ఉదయం ఏమేమీ చేస్తారో చెప్పారు. -
ఈ నెలలోనే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే!
Amazon Prime Day Sale: అమెజాన్ సంస్థ కొత్త సేల్ను ప్రకటించింది. ఈ నెలలోనే ప్రైమ్ డే సేల్ పేరుతో ముందుకు రానుంది. -
అదానీ హిండెన్బర్గ్ వివాదంలో కొత్త మలుపు.. మధ్యలో కోటక్ బ్యాంకు ప్రస్తావన!
Adani Hindenburg Row: అదానీ హిండెన్బర్గ్ వివాదంలోకి తాజాగా కోటక్ బ్యాంకు కూడా వచ్చి చేరింది. సెబీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు స్పందిస్తూ.. హిండెన్బర్గ్ తాజాగా మరికొన్ని ఆరోపణలు చేసింది. -
ఎఫ్డీ కంటే అధిక వడ్డీ.. ఆర్బీఐ గ్యారెంటీతో వచ్చే ఈ బాండ్స్ గురించి తెలుసా?
RBI Floating Rate Savings Bonds | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ సేవింగ్స్ బాండ్లు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. ఇందులో పెట్టుబడి చేయాలంటే కొన్ని విషయాలను తెలుసుకోవాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,150 ఎగువన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 125 పాయింట్ల లాభంతో 79,601 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు పుంజుకొని 24,189 దగ్గర కొనసాగుతోంది. -
ఫార్మా షేర్లు కోలుకుంటున్నాయ్
ఫార్మా కంపెనీలపై స్టాక్మార్కెట్ మదుపరుల్లో మళ్లీ ఆసక్తి కనిపిస్తోంది. కొవిడ్-19 ముంచుకొచ్చినప్పుడు, మందులకు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో ఫార్మా కంపెనీలు అధిక అమ్మకాలు, లాభాలు నమోదు చేశాయి. -
మదుపర్ల సంపద రూ.443 లక్షల కోట్లు
బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీల లాభాల జోరు కొనసాగింది. సెన్సెక్స్ కొత్త గరిష్ఠ స్థాయి వద్ద ముగియగా, నిఫ్టీ 24,100 పాయింట్ల ఎగువకు చేరింది. సానుకూల ఆసియా, ఐరోపా సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. -
పతంజలి ఫుడ్స్ చేతికి మరిన్ని వ్యాపారాలు
పతంజలి ఆయుర్వేద్కు చెందిన గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారాలను రూ.1,100 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు వంటనూనెల దిగ్గజ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. -
జూన్లో కార్ల విక్రయాలు 4% పెరిగాయ్
ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు గత నెలలో 4% పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ అధికంగా ఉండటంతో, విక్రయాలపై ప్రభావం పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. -
రిలయన్స్ మార్కెట్ విలువకు మరో 100 బి. డాలర్లు జత!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ మరో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) మేర పెరగనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది. -
రూ.2,000 నోట్లు 97.87% వెనక్కి వచ్చాయ్: ఆర్బీఐ
రూ.2,000 నోట్లలో 97.87% వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం వెల్లడించింది. రూ.7,581 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. -
ఆర్బీఐకి ఇద్దరు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అర్నబ్ కుమార్ ఛౌధ్రీ, చారులతా ఎస్ కర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు వీరు ఆర్బీఐలో చీఫ్ జనరల్ మేనేజర్లుగా ఉన్నారు. -
ఎయిరిండియా పైలట్ల శిక్షణ సంస్థ
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా, మహారాష్ట్రలోని అమరావతిలో పైలట్ల శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ఏడాదికి 180 మంది వాణిజ్య పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది ప్రతిపాదన. -
సంక్షిప్త వార్తలు(6)
ప్రభుత్వ రంగ సంస్థ పవర్గ్రిడ్ కార్పొరేషన్ దక్షిణ ప్రాంత చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా అఖిలేష్ పాఠక్ బాధ్యతలు చేపట్టారు. పవర్గ్రిడ్ దక్షిణ ప్రాంత ట్రాన్స్మిషన్ సిస్టమ్-1 పరిధిలో తెలంగాణ, -
ఐపీఓలకు కంపెనీలు సై
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ శివాలిక్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యాపై నాన్- బెయిలబుల్ వారెంట్.. జారీ చేసిన ముంబయి కోర్టు
-
9 నెలల క్రితం మిస్సయిన అమ్మాయిని 48 గంటల్లో పట్టుకున్నాం: డిప్యూటీ సీఎం పవన్
-
హిట్మ్యాన్తో కోహ్లీ ఫొటో.. రోహిత్ శర్మ తల్లి ఇన్స్టా పోస్టు వైరల్
-
భారత్-పాక్ సంబంధాలపై.. అమెరికా ఏమన్నదంటే?
-
కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రాలు.. ఏ ఓటీటీలో ఏదంటే?
-
బీసీసీఐ స్పెషల్ ఫ్లైట్.. బార్బడోస్ నుంచి భారత్కు రానున్న టీమ్ఇండియా