- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Naresh Goyal: నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న నరేశ్ గోయల్ (Naresh Goyal) సతీమణి అనితా గోయల్ నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు.
ముంబయి: జెట్ ఎయిర్వేస్ (Jet Airways) వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (Naresh Goyal)కు సతీవియోగం కలిగింది. ఆయన భార్య అనితా గోయల్ గురువారం ఉదయం కన్నుమూశారని కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గత కొద్దికాలంగా ఆమె క్యాన్సర్తో బాధడుతున్నారు. ఈ రోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరగనున్నట్టు తెలుస్తోంది. మరోపక్క నరేశ్ కూడా క్యాన్సర్తో బాధపడుతున్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆయనకు (Naresh Goyal) ఇటీవలే బెయిల్ మంజూరైంది. తనతోపాటు తన భార్య అనిత కూడా క్యాన్సర్తో బాధపడుతున్నందున బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన బాంబే హైకోర్టు.. రెండు నెలల తాత్కాలిక ఊరట కల్పించింది.
‘ఆశలన్నీ కోల్పోయా.. చనిపోవడం మేలు..!’ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు కన్నీరుమున్నీరు
దేశీయ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’కు కెనరా బ్యాంకు మొత్తం 848.86 కోట్లు రుణం ఇచ్చింది. అయితే అందులో 538.62 కోట్లు కంపెనీ తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంకు కేసు పెట్టింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టింది. జెట్ ఎయిర్వేస్ మోసం చేసినట్లు తేల్చింది. ఈ కేసులో మనీలాండరింగ్ అంశాలు తేలడంతో ఈడీ సైతం దర్యాప్తు చేపట్టింది. గతేడాది సెప్టెంబరు 1న నరేశ్ గోయల్ను అరెస్టు చేసింది. అదే ఏడాది నవంబర్లో గోయల్ భార్యను అరెస్ట్ చేసినప్పటికీ.. ఆమె అనారోగ్య పరిస్థితి కారణంగా ప్రత్యేక కోర్టు అదేరోజు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో చదువు కంటే వివాహాలపైనే ఖర్చెక్కువ: జెఫరీస్
Indian Weddings: భారత్లో వివాహాల సమయంలో జరిగే ఆడంబరాల గురించి జెఫరీస్ నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. చేసే ఖర్చు, వివిధ రంగాలకు లభించే గిరాకీ గురించి ప్రస్తావించింది. -
జొమాటోకు రూ.9.5 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు
Zomato: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటోకు రూ.9.5 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసులు జారీ చేసింది. -
స్టాక్స్.. టీ20 కప్ విజయం మధ్య సారూప్యతేంటి?.. వివరించిన సెహ్వాగ్!
T20 World Cup: స్టాక్స్, భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడాన్ని పోల్చుతూ వీరేంద్ర సెహ్వాగ్ చక్కని వివరణ ఇచ్చారు. ఇకపై భారత జట్టు విజయపరంపర కొనసాగాలని ఆకాంక్షించారు. -
జియో vs ఎయిర్టెల్ vs వొడాఫోన్ ఐడియా.. పాపులర్ ప్లాన్ల లేటెస్ట్ ధరలు ఇవే..
Jio vs Airtel vs VI: ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు తమ మొబైల్ ప్లాన్ల ధరలను సవరించాయి. -
ఎస్బీఐ ఛైర్మన్గా తెలుగు వ్యక్తి!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తదుపరి ఛైర్మన్ పదవికి ఇదే బ్యాంక్లో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న చల్లా శ్రీనివాసులు (సీఎస్) శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) సిఫారసు చేసింది. -
నాణ్యత లేదు.. ప్రమాణాలు లేవు
దేశంలోని చిన్న, మధ్య తరహా ఫార్మా యూనిట్లలో నాణ్యతా ప్రమాణాలపై సంబంధిత వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. -
ఆతిథ్య రంగంలో 10 లక్షల ఉద్యోగాలు!
వచ్చే కొన్నేళ్లలో ఆతిథ్య రంగం సుమారు 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
2024-25లో దేశీయ వస్తు, సేవల ఎగుమతులు రూ.66 లక్షల కోట్లు
అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2024-25) దేశీయ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను (సుమారు రూ.66 లక్షల కోట్లు) అధిగమించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
రాణించిన చిన్న షేర్లు
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా (తొలి ఆరు నెలల్లో) చిన్న, మధ్య స్థాయి షేర్లు రాణించాయి. రిటైల్ మదుపర్ల నుంచి వచ్చిన అసాధారణ, బలమైన గిరాకీ ఇందుకు కలిసివచ్చింది. -
సెల్కాన్ గ్రూపు నుంచి వైఫై-6 రౌటర్లు
మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, యాక్సెసరీలు అందిస్తున్న సెల్కాన్ గ్రూపు వైఫై-6 రౌటర్ల విభాగంలోకి అడుగుపెడుతోంది. -
హెచ్సీజీ చేతికి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్?
విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను దేశంలోని అతిపెద్ద క్యాన్సర్ వైద్య సేవల సంస్థ అయిన హెచ్సీజీ సొంతం చేసుకోనుందని తెలుస్తోంది. -
రూ.12,000 కోట్ల సమీకరణలో ఎన్టీపీసీ
ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ.. మార్పిడి రహిత డిబెంచర్ల (ఎన్సీడీ) జారీ ద్వారా రూ.12,000 కోట్లను సమీకరించనుంది. -
సంక్షిప్త వార్తలు
అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణ ప్రణాళికలో భాగంగా టైటన్ కంపెనీ బంగ్లాదేశ్లో తన ఆభరణాల బ్రాండ్ తనిష్క్ను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. -
జియో సేఫ్, జియో ట్రాన్స్లేట్.. ఎలా పనిచేస్తాయ్..?
Jio Safe- Jio Translate: రిలయన్స్ జియో కొత్తగా రెండు కొత్త సర్వీసులను ప్రారంభించింది. ఒకటి జియో సేఫ్, రెండోది జియో ట్రాన్స్లేట్.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. హాట్స్టార్లో వ్యూయర్షిప్ ఎంతంటే?
-
పిఠాపురంలో పవన్ పర్యటన.. అభిమానుల భారీ ఏర్పాట్లు
-
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
-
మోదీ బర్త్డే వేళ ‘సుభద్ర యోజన’ ప్రారంభం: ఒడిశా సీఎం
-
అర్జునుడిగా నేను.. ప్రభాస్ కర్ణుడు.. అలాగే చూడండి: విజయ్ దేవరకొండ
-
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్