- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
MIPPL: అయిదేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు
నిర్మాణ రంగంలో వినియోగించే మైల్డ్ స్టీల్(ఎంఎస్)ను ఉత్పత్తి చేసే మారుతీ ఇస్పాత్ అండ్ పైప్స్(ఎంఐపీపీఎల్) రానున్న అయిదేళ్లలో దశల వారీగా రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది.
మంత్రాలయం ప్లాంటును విస్తరించనున్న ఎంఐపీపీఎల్
ఈనాడు, హైదరాబాద్: నిర్మాణ రంగంలో వినియోగించే మైల్డ్ స్టీల్(ఎంఎస్)ను ఉత్పత్తి చేసే మారుతీ ఇస్పాత్ అండ్ పైప్స్(ఎంఐపీపీఎల్) రానున్న అయిదేళ్లలో దశల వారీగా రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయంలో 300 ఎకరాల్లో ఉన్న ఉత్పత్తి కేంద్రాన్ని విస్తరించడంతోపాటు; ఘజియాబాద్, ఒడిశా లేదా ఛత్తీస్గఢ్లో కొత్తగా రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు సంస్థ సీఈఓ అభిషేక్ అగర్వాల్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. ఆఫ్రికాలోనూ ఒక ప్లాంటును ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రాలయంలో ఉన్న ప్లాంటు కోసం అదనంగా మరో 300 ఎకరాలు కొనుగోలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ 1.80 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, వచ్చే ఏడాది డిసెంబరు నాటికి 2.86 లక్షల టన్నులకు చేరుతుందని పేర్కొన్నారు. అయిదేళ్లలో మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 6 లక్షల టన్నులకు చేరుకుంటుందన్నారు. సంస్థకు ప్రస్తుతం 2,000 మంది ఉద్యోగులున్నారని, విస్తరణ కార్యకలాపాలు పూర్తయ్యే నాటికి కొత్తగా మరో 10,000 మందిని చేర్చుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ ద్వారా రూ.400 కోట్ల మేరకు సమీకరించి, ఉత్తరాది రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేశారు. కొత్తగా ఎంఎస్ వాయు పేరుతో ఉత్పత్తిని ప్రవేశపెట్టినట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్న కంపెనీలూ డిజిటైజేషన్ బాటలో
వచ్చే ఏడాది కల్లా దాదాపు 60 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్ఎమ్ఈ)లు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయనున్నాయని వొడాఫోన్ ఐడియా బిజినెస్ తన నివేదికలో పేర్కొంది. -
ఎయిర్టెల్ ఛార్జీలూ పెరిగాయ్
ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ టారిఫ్లను 10-21 శాతం పెంచుతున్నట్లు శుకవ్రారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధం
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగించే పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ లైఫ్సైన్సెస్ ఉమ్మడిగా విక్రయించనున్నాయి. -
రికార్డుల పరుగుకు విరామం
మూడు రోజుల రికార్డుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్ షేర్లలో మదుపర్ల లాభాల స్వీకరణతో గరిష్ఠ స్థాయుల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ వెనక్కి వచ్చాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 83.34 వద్ద ముగిసింది. -
ప్రాథమిక డీమ్యాట్ ఖాతా పరిమితి రూ.10 లక్షలకు పెంపు
సెక్యూరిటీల మార్కెట్లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యం పెంచేందుకు, ప్రాథమిక సేవల డీమ్యాట్ ఖాతా (బీఎస్డీఏ) పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సెబీ తెలిపింది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ నుంచి సరికొత్త కాంప్లెక్స్ ఎరువు
‘పరమ్ఫోస్ ప్లస్’ అనే పేరుతో మెగ్నీషియంతో కూడిన కాంప్లెక్స్ ఎరువును కోరమాండల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. -
మేలో కీలక రంగాల వృద్ధి 6.3%
మేలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తిలో 6.3 శాతం మేర వృద్ధి నమోదైంది. విద్యుత్, బొగ్గు, సహజవాయువు రంగాలు రాణించడం ఇందుకు ఉపకరించింది. -
చిన్ని మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా రెండో త్రైమాసికమూ ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. -
ఎంఎస్ఎంఈ సంస్థలకు యాక్సిస్ బ్యాంకు ప్రత్యేక సదుపాయాలు
అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు పలు ఆఫర్లు ప్రకటించింది. -
భారత్ ఎలక్ట్రానిక్స్కు రూ.3,172 కోట్ల ఆర్డర్లు
నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) రూ.3,172 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. -
సంక్షిప్త వార్తలు(7)
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. జులై 3 నుంచి మొబైల్ సేవల టారిఫ్లను 12-27 శాతం పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేను మునుపటిలా లేను కానీ..: డిబేట్లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?
-
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ