- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి!
అనేక రంగాల్లో తన సత్తా చాటిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాజాగా రాజకీయ రంగంలో ప్రవేశించడానికి సిద్ధమైంది.
AI Candidate In UK Elections | ఇంటర్నెట్డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).. ఈ సాంకేతికత వినియోగం శరవేగంగా పెరుగుతోంది. వర్చువల్ అసిస్టెంట్లు, ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ల నుంచి న్యూస్ యాంకర్లు, వర్చువల్ టీచర్ల వరకు ఈ సాంకేతికత అన్నింటా అద్భుతమైన పనులు చేసేస్తోంది. ఇప్పుడు ఏకంగా రాజకీయ రంగంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. అవునండీ మీరు విన్నది నిజమే? తొలిసారి ఏఐ అభ్యర్థి జాతీయ పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఎక్కడో తెలుసా?
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికలు జులై4 న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వ్యాపారవేత్త స్టీవ్ కాట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు. అయితే తన స్థానంలో ఏఐ అభ్యర్థిని నిలబెట్టాలనే వినూత్న ఆలోచన వచ్చింది. దీంతో తన ఫొటో సాయంతో రూపొందించిన ఏఐ అవతార్ను వినియోగించారు. ‘‘ఏఐ స్టీవ్’’ పేరుతో నామినేషన్ ఫారమ్ను సమర్పించి ఎన్నికల బరిలోకి దిగారు. ఈ వర్చువల్ అభ్యర్థి కాట్ తరపున నిలబడనుంది. ప్రచారంలో పాల్గొంటుంది. ఈ ఎన్నికల్లో ఏఐ స్టీవ్ గెలిస్తే.. వర్చువల్ అభ్యర్థికి బదులుగా కాట్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
యూట్యూబ్లో కొత్త ఫీచర్..డీప్ఫేక్ వీడియోల ఆటకట్టు
ఈ సంచలన నిర్ణయంతో బ్రిటన్ ఎన్నికలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అదే సమయంలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఎన్నికల తర్వాత పార్టీని స్థాపించి.. దేశవ్యాప్తంగా ఏఐ అభ్యర్థులను తీసుకొస్తానని స్టీవ్ చెబుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయాలతో విసుగుచెంది.. ‘బ్రైటన్ పవిలియన్’ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలబడినట్టు తెలిపారు. ఏఐ స్టీవ్ ప్రజలకు 24/7 అందుబాటులో ఉంటుందని తెలిపారు. అనేక సమస్యలపై పరిష్కారాలు సూచిస్తుంది, ప్రజల నుంచి సూచనల్ని తీసుకుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. 2022లో కన్జర్వేటీవ్ పార్టీ తరపున స్థానిక ఎన్నికల్లో పోటీచేసిన స్టీవ్ ఓడిపోయారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తానన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో vs ఎయిర్టెల్ vs వొడాఫోన్ ఐడియా.. పాపులర్ ప్లాన్ల లేటెస్ట్ ధరలు ఇవే..
Jio vs Airtel vs VI: ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు తమ మొబైల్ ప్లాన్ల ధరలను సవరించాయి. -
జియో సేఫ్, జియో ట్రాన్స్లేట్.. ఎలా పనిచేస్తాయ్..?
Jio Safe- Jio Translate: రిలయన్స్ జియో కొత్తగా రెండు కొత్త సర్వీసులను ప్రారంభించింది. ఒకటి జియో సేఫ్, రెండోది జియో ట్రాన్స్లేట్. -
జియో, ఎయిర్టెల్ బాటలోనే వీఐ.. టారిఫ్ల పెంపు
Vodafone Idea: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కూడా మొబైల్ టారిఫ్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. -
పోర్టింగ్కు కొత్త రూల్.. సిమ్ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!
New MNP rules: మొబైల్ నంబర్ పోర్టింగ్కు కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. -
క్రోమ్లో కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగపడనున్నాయంటే?
Google Chrome: మెరుగైన సెర్చ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా గూగుల్ క్రోమ్ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నట్లు తన బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది. అవేంటంటే? -
రియల్మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. 32MP కెమెరా, 5000mAh బ్యాటరీ
Realme C61: రియల్మీ సీ61 మరో కొత్త ఫోన్ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో వస్తోన్న ఈ ఫోన్లో 32MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి. -
రీఛార్జి ప్లాన్ల ధరలను పెంచిన జియో... ఎప్పటి నుంచి అంటే?
జియో తమ టారిఫ్ల ఒక్కో ప్లాన్ మీద 12.5 శాతం నుంచి 25 శాతం వరకు పెంచనున్నట్లు జియో ప్రకటించింది. -
2024 సెకండాఫ్లో టెక్ ప్రియులకు పండగే.. ‘బ్లాక్ బస్టర్’ ఫోన్లు క్యూ!
Upcoming smartphones: ఈ ఏడాది రెండో అర్ధభాగంలో యాపిల్, శాంసంగ్ సహా పలు కంపెనీలు స్మార్ట్ఫోన్లు తీసుకురానున్నాయి. -
ఈ 35 ఫోన్ల మోడల్స్లో వాట్సప్ బంద్.. జాబితాలో మీ మొబైల్ ఉందా?
WhatsApp: త్వరలోనే కొన్ని మొబైల్ ఫోన్లలో వాట్సప్ తన సేవల్ని నిలిపి వేయనుంది. దీనికి సంబంధించిన జాబితాను కెనాల్టెక్ విడుదల చేసింది. -
రిస్క్లో బీఎస్ఎన్ఎల్ యూజర్ల డేటా.. అమ్మకానికి ఉంచిన హ్యాకర్!
Data Breached: బీఎస్ఎన్ఎల్ యూజర్ల డేటా మరోసారి ప్రమాదంలో పడింది. వినియోగదారులకు చెందిన 278 జీబీ డేటాను ఓ వ్యక్తి అమ్మకానికి పెట్టినట్లు అథెంటియన్ టెక్నాలజీస్ పేర్కొంది. -
ఐపీ రేటింగ్ అంటే ఏంటి? IP67, IP68ని ఎలా అర్థం చేసుకోవాలి?
IP ratings: మొబైల్ తయారీ కంపెనీలు తమ స్మార్ట్ఫోన్లకు ఐపీ రేటింగ్లు ఇస్తుంటాయి. అసలేంటా రేటింగ్స్? ఎందుకు ఉపయోగపడతాయి? -
యూపీఐ, యూట్యూబ్తో నోకియా 3 ఫీచర్ ఫోన్లు
Nokia mobiles: నోకియా బ్రాండ్పై ఫోన్లు తయారుచేసే హెఎండీ గ్లోబల్ సంస్థ.. మూడు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. -
నెట్ఫ్లిక్స్ నుంచి త్వరలో ఫ్రీ ప్లాన్..?
Netflix: ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక నెట్ఫ్లిక్స్ త్వరలో ఓ ఫ్రీ ప్లాన్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోందని సమాచారం! -
ఐఓఎస్ 18 డెవలపర్ బీటా 2 వెర్షన్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లివే..!
iOS 18 developer beta 2: యాపిల్ మరిన్ని కొత్త ఫీచర్లతో ఐఓఎస్ 18 బీటా 2 వెర్షన్ను విడుదల చేసింది. కొత్త ఫీచర్లు ఏంటి? ఏయే ఫోన్లకు ఇది అందుబాటులో ఉందో చూద్దాం..! -
₹20వేలకే వన్ప్లస్ కొత్త ఫోన్.. CE4 Lite విశేషాలివీ..
OnePlus Nord CE4 Lite 5G: వన్ప్లస్ సీఈ 4 లైట్ ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. -
భారత్లోకి ‘మెటా ఏఐ’.. వాట్సప్, ఎఫ్బీ, ఇన్స్టాలో ఏఐ అసిస్టెంట్
Meta AI: ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో యూజర్లకు చేదోడుగా ఉండేలా మెటా.. ‘ఏఐ అసిస్టెంట్’ను రూపొందించింది. ‘మెటా ఏఐ’ పేరిట తీసుకొచ్చిన దీన్ని తాజాగా భారత్లో విడుదల చేసింది. -
యూట్యూబ్లో కొత్త ఫీచర్..డీప్ఫేక్ వీడియోల ఆటకట్టు
YouTube: డీప్ఫేక్ వీడియోలను అరికట్టేందుకు యూట్యూబ్ మరో అడుగు ముందుకు వేసింది. ఈ వీడియోలను తొలగించేందుకు కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. -
ఇకపై లైవ్స్ట్రీమ్ ప్రారంభించాలంటే సబ్స్క్రిప్షన్ ఉండాల్సిందే..! ‘ఎక్స్’లో కీలక మార్పు
Social Media X: ప్రీమియం చందాదారులను పెంచుకోవడంలో భాగంగా ఇప్పటికే అనేక మార్పులు చేపట్టిన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఇకపై లైవ్స్ట్రీమ్ ప్రారంభించాలంటే సబ్స్క్రిప్షన్ తప్పనిసరి చేసేలా నిబంధనలు తీసుకురానుంది. -
మొదలైన యాపిల్ స్కూల్ సేల్.. ఐప్యాడ్, మ్యాక్బుక్, ఐమ్యాక్పై డిస్కౌంట్లు
Apple School Sale: యాపిల్ స్కూల్ సేల్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 20వరకు కొనసాగే ఈ సేల్లో ఐప్యాడ్, మ్యాక్బుక్, ఐమ్యాక్, ఐమ్యాక్ మినీపై రాయితీ ఇస్తోంది. వాటి వివరాలపై ఓ లుక్కేయండి. -
ఎయిర్టెల్ కొత్త డేటా వోచర్.. రూ.9కే 10జీబీ డేటా, కానీ..
Airtel: తక్కువ ధరతో అధిక డేటా పొందేలా ఎయిర్టెల్ కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. కానీ, దీంట్లో ఓ తిరకాసు ఉంది. అదేంటో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
-
నేనెప్పుడూ గణాంకాలు చూడను.. భారత్ గెలుపే ముఖ్యం: రోహిత్
-
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు
-
ఇదెంతో ప్రత్యేకం.. గత ఆరు నెలలు ఎలా ఉన్నాయో తెలుసు: హార్దిక్
-
టీమ్ఇండియా విజయం.. సినీ ప్రముఖుల ఆనందం.. ఎవరేమన్నారంటే?
-
తొలుత పెళ్లి.. తర్వాత అంత్యక్రియలు.. వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి