- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Anant Ambani Wedding: అనంత్ అంబానీ-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకల్లో సామూహిక వివాహాలు
Anant Ambani-Radhika Merchant wedding: అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా పలు జంటలకు సామూహిక వివాహాలు జరిపించనున్నారు. జులై 2న ఈ కార్యక్రమం జరగనుంది.
Anant Ambani-Radhika Merchant wedding | ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani)-రాధికా మర్చెంట్ పెళ్లి ముచ్చట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం, ప్రీవెడ్డింగ్ వేడుక అంగరంగా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ముందస్తు పెళ్లి వేడుకల (Pre Wedding)కు అంబానీ కుటుంబం సిద్ధమైంది. ఇందులో భాగంగా పలు జంటలకు సామూహిక వివాహాలు (Mass wedding) జరిపించనున్నారు.
పాల్ఘర్లోని స్వామి వివేకానంద విద్యామందిర్లో జులై 2న సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది. పేద కుటుంబాలకు చెందిన పలు జంటలకు ఇందులో సామూహిక పెళ్లిళ్లు జరిపించనున్నారు. ఈ వేడుకలకు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు. ఇటీవల గుజరాత్లో జరిగిన ప్రీవెడ్డింగ్ వేడుకల సమయంలోనూ అంబానీ కుటుంబం సమీప గ్రామ ప్రజలకు అన్న సేవను నిర్వహించిన సంగతి తెలిసిందే.
పారిశ్రామికవేత్త వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధికతో అనంత్ అంబానీ వివాహం జులై 12న జరగనుంది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదిక కానుంది. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. జులై 12న ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’తో మొదలయ్యే ఈ సెలబ్రేషన్స్.. జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’తో ముగుస్తాయి.
అంబానీ వారి పెళ్లి శుభలేఖ.. అదుర్స్!
ఇప్పటికే ఆహ్వాన పత్రికకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. తొలి పత్రికను నీతా అంబానీ (Nita Ambani) వారణాసిలోని కాశీ విశ్వనాథుని పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. అటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులను అంబానీ కుటుంబం స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తోంది.
ఇక, గుజరాత్లోని జామ్నగర్ వేదికగా ఈ ఏడాది మార్చి 1-3 వరకు అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ, విదేశాల్లో పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వారికి అంబానీ కుటుంబం గ్రాండ్గా ఆతిథ్యమిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూన్లో తగ్గిన ఈవీ విక్రయాలు.. కారణం ఇదేనా..?
EV sales: దేశంలో జూన్ నెలలో విద్యుత్ వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. -
కొత్త గరిష్ఠాల వద్ద ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 443, నిఫ్టీ 131 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. -
ఐపీఓకు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్.. రూ.3వేల కోట్ల సమీకరణ
Niva Bupa IPO: ప్రముఖ ఆరోగ్య బీమా కంపెనీ నివా బుపా ఐపీఓకు రాబోతోంది. సెబీ ఆమోదం కోరుతూ ప్రాథమిక పత్రాలు సమర్పించింది. -
సమాచారం కావాలంటే.. ఇక వాట్సప్లో సెర్చ్ చేయొచ్చు!
Meta AI: వాట్సప్లో ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏ సమాచారం అయిన క్షణాల్లో తెలుసుకోవడానికి వీలుపడుతుంది. -
ఐటీ రిటర్నులు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసా?
ITR filing 2023-24: ఐటీఆర్ దాఖలు చేసే సమయం దగ్గర పడటంతో అందరూ రిటర్నులు ఫైల్ చేయడం మొదలు పెట్టేశారు. అసలు రిటర్నులు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాల గురించి తెలుసా? -
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర..
LPG commercial cylinder Price: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించాయి. ఒక్కో సిలిండర్పై రూ.32 తగ్గడం గమనార్హం. -
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 79,113 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు ఎగబాకి 24,023 దగ్గర కొనసాగుతోంది. -
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
భారతీయ వివాహ వైభోగమే!
భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణం సుమారు రూ.10 లక్షల కోట్లు (130 బిలియన్ డాలర్లు)గా ఉందని బ్రోకరేజీ జెఫ్రీస్ నివేదిక పేర్కొంది. -
పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్
స్టాక్ మార్కెట్లు ఈ వారం చాలా తక్కువ శ్రేణిలోనే కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎటువంటి ప్రధాన వార్తలూ లేకపోవడానికి తోడు, కొద్ది రోజుల ర్యాలీతో షేర్ల ధరలు అధిక స్థాయిలకు చేరడం ఇందుకు కారణంగా నిలవవచ్చని చెబుతున్నారు. -
3 ఐపీఓలు.. రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యం
నిధుల సమీకరణ కోసం ఈ వారం రెండు మెయిన్ బోర్డ్ ఐపీఓలు, ఒక ఎస్ఎంఈ ఐపీఓ రాబోతున్నాయి. మొత్తం రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇవి వస్తున్నాయి. -
పత్తి సానుకూలమే!
పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,044 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. -
77400- 78000 పాయింట్ల శ్రేణి కీలకం!
దేశీయ గణాంకాలు, అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం మార్కెట్లు జీవనకాల తాజా గరిష్ఠాలను అధిరోహించాయి. ఎఫ్ఐఐ, డీఐఐ కొనుగోళ్లు ఇందుకు అండగా నిలిచాయి. -
లిక్విడేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు ఎలక్ట్రానిక్ ఫామ్లు: ఐబీబీఐ
దివాలా పరిష్కార వృత్తి నిపుణులకు నిబంధనల భారం సులభతరం చేసేందుకు, లిక్విడేషన్ ప్రక్రియను ప్రభావవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా దివాలా స్మృతి (ఐబీసీ) కింద ఎలక్ట్రానిక్ ఫామ్లను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) తీసుకొచ్చింది. -
సంక్షిప్త వార్తలు
భారత సైన్యం చేతికి తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్ చేరింది. బెంగళూరు సంస్థ సిగ్నల్ట్రాన్ ఈ 4జీ బేస్ స్టేషన్ను భారత సైన్యానికి అందించింది. -
భారత్లో చదువు కంటే వివాహాలపైనే ఖర్చెక్కువ: జెఫరీస్
Indian Weddings: భారత్లో వివాహాల సమయంలో జరిగే ఆడంబరాల గురించి జెఫరీస్ నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. చేసే ఖర్చు, వివిధ రంగాలకు లభించే గిరాకీ గురించి ప్రస్తావించింది.
తాజా వార్తలు (Latest News)
-
క్రెడిట్ కార్డే కాదు.. కరెంట్ బిల్లు చెల్లింపులూ ఆ యాప్స్లో కుదరవ్..!
-
జులైలో అలరించనున్న చిత్రాలివే.. సీక్వెల్తో కమల్.. యాక్షన్తో ధనుష్
-
మైక్ కట్ చేస్తున్నాననడం సరికాదు.. ఇది గౌరవానికి సంబంధించిన అంశం: ఓం బిర్లా
-
నెల్లూరు వైద్య కళాశాల వద్ద వైద్యురాలి ఆత్మహత్య
-
ఇది రాహుల్కి కఠిన పరీక్ష.. అనురాగ్ ఠాకూర్ విమర్శలు
-
ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 5PM