- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Naresh Goyal: ‘ఆశలన్నీ కోల్పోయా.. చనిపోవడం మేలు..!’ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు కన్నీరుమున్నీరు
జీవితంపై ఆశలన్నీ కోల్పోయానని, బతకడం కంటే చనిపోవడం మేలని.. జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కోర్టులో కంటతడి పెట్టారు.
ముంబయి: ‘‘జీవితంపై ఆశలన్నీ కోల్పోయా. ప్రస్తుత పరిస్థితుల్లో బతకడం కంటే జైల్లోనే చనిపోవడం మేలు..!’’ అంటూ జెట్ ఎయిర్వేస్ (Jet Airways) వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (Naresh Goyal) కోర్టులో కన్నీరుమున్నీరయ్యారు. కెనరా బ్యాంకుకు సంబంధించి రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసులో ‘ఈడీ’ ఆయన్ను అరెస్టు చేయగా.. ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా శనివారం ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వ్యక్తిగత విచారణకు అభ్యర్థించగా.. న్యాయమూర్తి ఎంజీ దేశ్పాండే అనుమతించారు.
‘‘నా భార్యకు క్యాన్సర్ ముదిరిపోయింది. ఆమెను చాలా మిస్ అవుతున్నా. ఒక్కగానొక్క కుమార్తె కూడా అనారోగ్యంతో ఉంది. వారిని చూసుకునేందుకు ఎవరూ లేరు. నేనూ బలహీనంగా ఉన్నా. ఆరోగ్యం క్షీణిస్తోంది. జేజే హాస్పిటల్కు తీసుకెళ్తోన్నా.. సమయానికి సేవలు అందడం లేదు. ఇవన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఆ ఆస్పత్రికి పంపొద్దు. ఇటువంటి పరిస్థితుల్లో జీవించడం కంటే.. జైల్లోనే చనిపోయేందుకు అనుమతించండి’’ అని న్యాయమూర్తి ఎదుట చేతులు జోడించి, విలపించినట్లు న్యాయస్థానం రోజువారీ విచారణల రికార్డుల్లో నమోదయ్యింది.
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్టు
నరేశ్ గోయల్ తన పరిస్థితులను వివరిస్తున్నప్పుడు వణుకుతున్నట్లు గుర్తించానని న్యాయమూర్తి ఎంజీ దేశ్పాండే కోర్టు రికార్డుల్లో ప్రస్తావించారు. నిస్సహాయ స్థితిలో వదిలేయబోమని, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడేందుకు సరైన చికిత్స అందించే విషయంలో ఆయనకు భరోసా ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గోయల్ తరఫు న్యాయవాదులను ఆదేశించారు. మరోవైపు.. ఆయన బెయిల్ పిటిషన్పై ఈడీ ప్రతిస్పందనను దాఖలు చేసింది. జనవరి 16న ఈ అంశం తదుపరి విచారణకు రానుంది.
దేశీయ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’కు కెనరా బ్యాంకు మొత్తం 848.86 కోట్లు రుణం ఇచ్చింది. అయితే అందులో 538.62 కోట్లు కంపెనీ తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంకు కేసు పెట్టింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టింది. జెట్ ఎయిర్వేస్ మోసం చేసినట్లు తేల్చింది. ఈ కేసులో మనీలాండరింగ్ అంశాలు తేలడంతో ఈడీ సైతం దర్యాప్తు చేపట్టింది. గతేడాది సెప్టెంబరు 1న నరేశ్ గోయల్ను అరెస్టు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
50 జంటలకు సామూహిక వివాహాలు.. భారీ కానుకలు అందజేసిన అంబానీ కుటుంబం
చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో ముకేశ్ కుటుంబం ఓ సామాజిక కార్యక్రమాన్ని భాగం చేసింది. -
గ్రూప్ఎం దక్షిణాసియా సీఓఓగా అశ్విన్ పద్మనాభన్
డబ్ల్యూపీపీకి చెందిన మీడియా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గ్రూప్ఎమ్ దక్షిణాసియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా (COO) అశ్విన్ పద్మనాభన్ నియమితులయ్యారు. -
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
EPS rule: ఈపీఎస్ విత్డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది. -
బ్యాంకింగ్ షేర్లలో ఒత్తిడి.. ఆరంభ లాభాలు ఆవిరి
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 34, నిఫ్టీ 18 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
బీఎస్ఎన్ఎల్ రూ.249 ప్లాన్.. 45 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా
BSNL: ప్రైవేట్ టెలికాం సంస్థలన్నీ టారిఫ్లను పెంచిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్లోని రూ.249 ప్లాన్ ఇప్పుడు ట్రెండవుతోంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలేంటో చూద్దాం. -
రోజులో ఆ టైమ్ నాకు ఇంపార్టెంట్: దినచర్య గురించి జెఫ్ బెజోస్ ఏం చెప్పారంటే?
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ (Jeff Bezos) తన దినచర్యను ఎలా ప్రారంభిస్తారో వెల్లడించారు. ఉదయం ఏమేమీ చేస్తారో చెప్పారు. -
ఈ నెలలోనే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే!
Amazon Prime Day Sale: అమెజాన్ సంస్థ కొత్త సేల్ను ప్రకటించింది. ఈ నెలలోనే ప్రైమ్ డే సేల్ పేరుతో ముందుకు రానుంది. -
అదానీ హిండెన్బర్గ్ వివాదంలో కొత్త మలుపు.. మధ్యలో కోటక్ బ్యాంకు ప్రస్తావన!
Adani Hindenburg Row: అదానీ హిండెన్బర్గ్ వివాదంలోకి తాజాగా కోటక్ బ్యాంకు కూడా వచ్చి చేరింది. సెబీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు స్పందిస్తూ.. హిండెన్బర్గ్ తాజాగా మరికొన్ని ఆరోపణలు చేసింది. -
ఎఫ్డీ కంటే అధిక వడ్డీ.. ఆర్బీఐ గ్యారెంటీతో వచ్చే ఈ బాండ్స్ గురించి తెలుసా?
RBI Floating Rate Savings Bonds | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ సేవింగ్స్ బాండ్లు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. ఇందులో పెట్టుబడి చేయాలంటే కొన్ని విషయాలను తెలుసుకోవాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,150 ఎగువన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 125 పాయింట్ల లాభంతో 79,601 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు పుంజుకొని 24,189 దగ్గర కొనసాగుతోంది. -
ఫార్మా షేర్లు కోలుకుంటున్నాయ్
ఫార్మా కంపెనీలపై స్టాక్మార్కెట్ మదుపరుల్లో మళ్లీ ఆసక్తి కనిపిస్తోంది. కొవిడ్-19 ముంచుకొచ్చినప్పుడు, మందులకు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో ఫార్మా కంపెనీలు అధిక అమ్మకాలు, లాభాలు నమోదు చేశాయి. -
మదుపర్ల సంపద రూ.443 లక్షల కోట్లు
బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీల లాభాల జోరు కొనసాగింది. సెన్సెక్స్ కొత్త గరిష్ఠ స్థాయి వద్ద ముగియగా, నిఫ్టీ 24,100 పాయింట్ల ఎగువకు చేరింది. సానుకూల ఆసియా, ఐరోపా సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. -
పతంజలి ఫుడ్స్ చేతికి మరిన్ని వ్యాపారాలు
పతంజలి ఆయుర్వేద్కు చెందిన గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారాలను రూ.1,100 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు వంటనూనెల దిగ్గజ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. -
జూన్లో కార్ల విక్రయాలు 4% పెరిగాయ్
ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు గత నెలలో 4% పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ అధికంగా ఉండటంతో, విక్రయాలపై ప్రభావం పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. -
రిలయన్స్ మార్కెట్ విలువకు మరో 100 బి. డాలర్లు జత!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ మరో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) మేర పెరగనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది. -
రూ.2,000 నోట్లు 97.87% వెనక్కి వచ్చాయ్: ఆర్బీఐ
రూ.2,000 నోట్లలో 97.87% వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం వెల్లడించింది. రూ.7,581 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. -
ఆర్బీఐకి ఇద్దరు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అర్నబ్ కుమార్ ఛౌధ్రీ, చారులతా ఎస్ కర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు వీరు ఆర్బీఐలో చీఫ్ జనరల్ మేనేజర్లుగా ఉన్నారు. -
ఎయిరిండియా పైలట్ల శిక్షణ సంస్థ
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా, మహారాష్ట్రలోని అమరావతిలో పైలట్ల శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ఏడాదికి 180 మంది వాణిజ్య పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది ప్రతిపాదన. -
సంక్షిప్త వార్తలు(6)
ప్రభుత్వ రంగ సంస్థ పవర్గ్రిడ్ కార్పొరేషన్ దక్షిణ ప్రాంత చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా అఖిలేష్ పాఠక్ బాధ్యతలు చేపట్టారు. పవర్గ్రిడ్ దక్షిణ ప్రాంత ట్రాన్స్మిషన్ సిస్టమ్-1 పరిధిలో తెలంగాణ, -
ఐపీఓలకు కంపెనీలు సై
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ శివాలిక్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీకి సీఎం చంద్రబాబు.. బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రధానితో చర్చించే అవకాశం
-
గూగుల్ మ్యాప్స్ను నమ్మి.. దట్టమైన అడవిలో 11 గంటలు చిక్కుకొని..
-
పేపర్ లీక్లను తీవ్రంగా పరిగణిస్తున్నాం - ప్రధాని మోదీ
-
ఆస్పత్రిలో భారత మాజీ హెడ్ కోచ్.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు
-
50 జంటలకు సామూహిక వివాహాలు.. భారీ కానుకలు అందజేసిన అంబానీ కుటుంబం
-
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 87కి చేరిన మృతుల సంఖ్య