- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Jefferies Report: భారతీయ వివాహ వైభోగమే!
భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణం సుమారు రూ.10 లక్షల కోట్లు (130 బిలియన్ డాలర్లు)గా ఉందని బ్రోకరేజీ జెఫ్రీస్ నివేదిక పేర్కొంది.
చదువు కంటే పెళ్లిళ్లపైనే రెట్టింపు ఖర్చు!
ఈ పరిశ్రమ పరిమాణం రూ.10 లక్షల కోట్లు
జెఫ్రీస్ నివేదిక
దిల్లీ: భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణం సుమారు రూ.10 లక్షల కోట్లు (130 బిలియన్ డాలర్లు)గా ఉందని బ్రోకరేజీ జెఫ్రీస్ నివేదిక పేర్కొంది. ఆహారం, నిత్యావసరాల తర్వాత..దేశీయులు పెళ్లిళ్లపైనే అధికంగా ఖర్చు పెడుతున్నారని తెలిపింది. సగటు భారతీయులు చదువు కోసం వెచ్చిస్తున్న మొత్తం కంటే వివాహ వేడుకలకు రెట్టింపు ఖర్చు చేస్తున్నారని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం..
ఏటా కోటి వివాహాలు
వార్షికంగా చైనాలో 70-80 లక్షలు, అమెరికాలో 20-25 లక్షల పెళ్లిళ్లు జరుగుతుండగా, మన దేశంలో 80 లక్షల నుంచి కోటి వరకు వివాహాలు జరుగుతున్నాయని తెలిపింది. అమెరికాలో వివాహాల కోసం వెచ్చిస్తున్న 70 బి.డాలర్లతో పోలిస్తే, దాదాపు రెట్టింపు పరిమాణంలో భారత్లో ఖర్చు పెడుతున్నారని.. అయితే చైనాతో పోలిస్తే (170 బి.డాలర్లు) మాత్రం తక్కువగానే ఉన్నట్లు నివేదిక వివరించింది. ఆహారం, నిత్యావసరాల కోసం దేశీయులు వెచ్చిస్తున్న సుమారు రూ. 56.52 లక్షల కోట్ల (681 బి.డాలర్లు) విభాగం తర్వాత భారత్లో వివాహ పరిశ్రమ రెండో అతిపెద్ద వినియోగ రంగంగా ఉందని తెలిపింది.
భారతదేశంలో వివాహాలను వేడుకలు-వ్యయాల ఆధారంగా వర్గీకరించాల్సి ఉంటుంది. వివాహాల కోసం బంగారు, వెండి ఆభరణాలు, దుస్తుల కొనుగోళ్లు అధికంగా జరుగుతుంటాయి. వాహనాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలకూ పరోక్షంగా కారణమవుతున్నాయి. ఏడాదికి 80 లక్షల నుంచి కోటి పెళ్లిళ్లు జరుగుతున్నందున, అంతర్జాతీయంగా అతి పెద్ద పెళ్లిళ్ల గమ్యస్థానంగా భారత్ మారిందని రిటైలర్ల సంఘం తెలిపింది. మనదేశంలో వివాహ వేడుకలు ఎక్కువ రోజులు/అనేకసార్లుగా/ పలు రకాల వేడుకలుగా జరుగుతున్నందున.. పలు రకాల అమ్మకాలు చోటుచేసుకుంటున్నాయి.
సగటు వ్యయం రూ.12.5 లక్షలు
విలువలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే భారతీయులు పెళ్లిళ్లపై అధికంగా వ్యయం చేస్తుంటారు. వారి వారి ఆదాయాలు, సంపదకు తగ్గట్లు, అంతకుమించి కూడా వివాహాలను ఆడంబరంగా నిర్వహించేందుకు ప్రాధాన్యమిస్తుంటారు. ఒక్కో పెళ్లి సగటు వ్యయం 15,000 డాలర్లు (రూ.12.5 లక్షలు) ఉంటుంది. ఇది తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువ. కొందరి కుటుంబ ఆదాయం కన్నా కూడా ఇది ఎక్కువే.
అమెరికాకు పూర్తి భిన్నం
ఒక చిన్నారి ప్రీప్రైమరీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు చదువుపై వెచ్చించే వ్యయాల కంటే, రెట్టింపు మొత్తాన్ని మన దేశంలో వారి పెళ్లికి ఆయా కుటుంబాలు ఖర్చు చేస్తున్నాయని నివేదిక తెలిపింది. అదే అమెరికాలో అయితే మొత్తం విద్యాభ్యాసానికి అయిన ఖర్చులో, సగం మొత్తాన్నే వివాహాలకు వినియోగిస్తున్నారట.
భారీ ప్రణాళికతోనే..
మన దేశంలో పెళ్లికి ప్రణాళిక కనీసం 6-12 నెలల ముందు నుంచే ప్రారంభమవుతోంది. అతి భారీ స్థాయి పెళ్లిళ్లకు 50,000 మంది వరకు అతిథులు హాజరవుతున్నారని అంచనా. పెళ్లికూతురు లెహంగాలు ఒక్కోసారి 10 కిలోల వరకు బరువుంటాయి. దేశీయంగా జరుగుతున్న మొత్తం ఆభరణాల విక్రయాల్లో సగం పెళ్ళికూతుర్ల నగల రూపంలోనే ఉంటున్నాయి. ఇటలీ విలాసవంత ఉత్పత్తుల సంస్థ బుల్గరీ, 2021లో భారత్ కోసమే మంగళసూత్ర ఆభరణాన్ని విడుదల చేసిందంటే ఇక్కడ విపణి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలంకరణకు మాత్రం ఇక్కడ ఖర్చు తక్కువే చేస్తున్నారు. చాకోలేట్ పానీపూరి, వాఫిల్ దోస, పైనాపిల్ ప్లేవర్డ్ పనీర్ వంటి ఆహార పదార్థాలు కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారని నివేదిక పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫార్మా షేర్లు కోలుకుంటున్నాయ్
ఫార్మా కంపెనీలపై స్టాక్మార్కెట్ మదుపరుల్లో మళ్లీ ఆసక్తి కనిపిస్తోంది. కొవిడ్-19 ముంచుకొచ్చినప్పుడు, మందులకు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో ఫార్మా కంపెనీలు అధిక అమ్మకాలు, లాభాలు నమోదు చేశాయి. -
మదుపర్ల సంపద రూ.443 లక్షల కోట్లు
బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీల లాభాల జోరు కొనసాగింది. సెన్సెక్స్ కొత్త గరిష్ఠ స్థాయి వద్ద ముగియగా, నిఫ్టీ 24,100 పాయింట్ల ఎగువకు చేరింది. సానుకూల ఆసియా, ఐరోపా సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. -
పతంజలి ఫుడ్స్ చేతికి మరిన్ని వ్యాపారాలు
పతంజలి ఆయుర్వేద్కు చెందిన గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారాలను రూ.1,100 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు వంటనూనెల దిగ్గజ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. -
జూన్లో కార్ల విక్రయాలు 4% పెరిగాయ్
ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు గత నెలలో 4% పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ అధికంగా ఉండటంతో, విక్రయాలపై ప్రభావం పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. -
రిలయన్స్ మార్కెట్ విలువకు మరో 100 బి. డాలర్లు జత!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ మరో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) మేర పెరగనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది. -
రూ.2,000 నోట్లు 97.87% వెనక్కి వచ్చాయ్: ఆర్బీఐ
రూ.2,000 నోట్లలో 97.87% వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం వెల్లడించింది. రూ.7,581 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. -
ఆర్బీఐకి ఇద్దరు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అర్నబ్ కుమార్ ఛౌధ్రీ, చారులతా ఎస్ కర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు వీరు ఆర్బీఐలో చీఫ్ జనరల్ మేనేజర్లుగా ఉన్నారు. -
ఎయిరిండియా పైలట్ల శిక్షణ సంస్థ
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా, మహారాష్ట్రలోని అమరావతిలో పైలట్ల శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ఏడాదికి 180 మంది వాణిజ్య పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది ప్రతిపాదన. -
సంక్షిప్త వార్తలు(6)
ప్రభుత్వ రంగ సంస్థ పవర్గ్రిడ్ కార్పొరేషన్ దక్షిణ ప్రాంత చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా అఖిలేష్ పాఠక్ బాధ్యతలు చేపట్టారు. పవర్గ్రిడ్ దక్షిణ ప్రాంత ట్రాన్స్మిషన్ సిస్టమ్-1 పరిధిలో తెలంగాణ, -
ఐపీఓలకు కంపెనీలు సై
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ శివాలిక్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు