- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ICICI Lombard: 2024లో ఎఫ్ఎంసీజీ వృద్ధి 7-9%!
ఈ ఏడాది ఎఫ్ఎంసీజీ రంగం స్థిరంగా 7-9 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నివేదిక అంచనా వేసింది.
ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నివేదిక
దిల్లీ: ఈ ఏడాది ఎఫ్ఎంసీజీ రంగం స్థిరంగా 7-9 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నివేదిక అంచనా వేసింది. వినియోగాన్ని పెంచడంతో పాటు ఉద్యోగావకాశాలను సృష్టించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ రంగ వృద్ధికి మద్దతు ఇస్తాయని పేర్కొంది. అయితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వినియోగదార్ల సన్నగిల్లిన విశ్వాసం, ప్రబలంగా ఉన్న నిరుద్యోగిత రేటు వంటి సవాళ్లను ఈ రంగం ఎదుర్కొంటోందని తెలిపింది. ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ పరిశ్రమ రూ.9.1 లక్షల కోట్లతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో, ఉద్యోగాల సృష్టిలో కీలక పాత్ర పోషిస్తోందని నివేదిక వెల్లడించింది. ఎఫ్ఎంసీజీ ఆన్లైన్ విక్రయాల ఛానెల్ కూడా పెరుగుతోందని, ఇది రూ.1.7 లక్షల కోట్ల విలువ కలిగి ఉందని తెలిపింది. డిజిటల్ వినియోగదార్లకు సేవలు అందించేలా, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమ ఎప్పటికప్పుడు మారుతుండటం, డిజిటలీకరణ వేగవతం కావడం చూస్తున్నామని కార్పొరేట్ ఇండియా రిస్క్ ఇండెక్స్ 2023 పేరుతో రూపొందించిన నివేదిక వివరించింది. కొవిడ్ మహమ్మారి తర్వాత ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొందని, కొన్ని త్రైమాసికాల పాటు గ్రామీణ గిరాకీ ప్రతికూల వృద్ధిని నమోదు చేసిందని తెలిపింది. 2023 రెండో అర్ధ భాగం నుంచి పరిమాణం, విలువ పరంగా చెప్పుకోదగ్గ వృద్ధి కనిపిస్తోందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్న కంపెనీలూ డిజిటైజేషన్ బాటలో
వచ్చే ఏడాది కల్లా దాదాపు 60 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్ఎమ్ఈ)లు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయనున్నాయని వొడాఫోన్ ఐడియా బిజినెస్ తన నివేదికలో పేర్కొంది. -
ఎయిర్టెల్ ఛార్జీలూ పెరిగాయ్
ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ టారిఫ్లను 10-21 శాతం పెంచుతున్నట్లు శుకవ్రారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధం
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగించే పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ లైఫ్సైన్సెస్ ఉమ్మడిగా విక్రయించనున్నాయి. -
రికార్డుల పరుగుకు విరామం
మూడు రోజుల రికార్డుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్ షేర్లలో మదుపర్ల లాభాల స్వీకరణతో గరిష్ఠ స్థాయుల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ వెనక్కి వచ్చాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 83.34 వద్ద ముగిసింది. -
ప్రాథమిక డీమ్యాట్ ఖాతా పరిమితి రూ.10 లక్షలకు పెంపు
సెక్యూరిటీల మార్కెట్లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యం పెంచేందుకు, ప్రాథమిక సేవల డీమ్యాట్ ఖాతా (బీఎస్డీఏ) పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సెబీ తెలిపింది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ నుంచి సరికొత్త కాంప్లెక్స్ ఎరువు
‘పరమ్ఫోస్ ప్లస్’ అనే పేరుతో మెగ్నీషియంతో కూడిన కాంప్లెక్స్ ఎరువును కోరమాండల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. -
మేలో కీలక రంగాల వృద్ధి 6.3%
మేలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తిలో 6.3 శాతం మేర వృద్ధి నమోదైంది. విద్యుత్, బొగ్గు, సహజవాయువు రంగాలు రాణించడం ఇందుకు ఉపకరించింది. -
చిన్ని మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా రెండో త్రైమాసికమూ ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. -
ఎంఎస్ఎంఈ సంస్థలకు యాక్సిస్ బ్యాంకు ప్రత్యేక సదుపాయాలు
అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు పలు ఆఫర్లు ప్రకటించింది. -
భారత్ ఎలక్ట్రానిక్స్కు రూ.3,172 కోట్ల ఆర్డర్లు
నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) రూ.3,172 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. -
సంక్షిప్త వార్తలు(7)
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. జులై 3 నుంచి మొబైల్ సేవల టారిఫ్లను 12-27 శాతం పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పంచశీల ఒప్పందం భేష్.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
-
ఆ కథలేవీ నిజం కావు.. అందుకే సంతోషంగా ఉంది: కమల్ హాసన్
-
అవును నేను వృద్ధుడినే.. కానీ: డిబేట్లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?
-
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు