- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Indian Railways: రైల్లో లోయర్ బెర్త్ కావాలా? ఈసారి ఇలా చేయండి..
How to book lower berth tickets: రైలు ప్రయాణంలో చాలా మంది లోయర్ బెర్త్ కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ అన్నిసార్లూ సాధ్యం కాదు. ఇలా చేస్తే మాత్రం మీకు లోయర్ బెర్త్ ఖాయం.
ఇంటర్నెట్ డెస్క్: రైళ్లలో (Indian Railways) లోయర్ బెర్త్ (Lowr berth) దొరికితే ఆ సౌకర్యమే వేరు. కూర్చున్నంత సేపూ కిటికీ నుంచి అందాలను వీక్షించొచ్చు. పడుకునేటప్పుడు పైకెక్కాల్సిన బాధలేదు. అందుకే పెద్దవాళ్లతో ప్రయాణించేవారు లోయర్ బెర్త్ కోసం ప్రయత్నిస్తుంటారు. వారికి టికెట్ బుక్ చేసినప్పుడు లోయర్ బెర్త్ను (Berth preference) ప్రిఫరెన్స్గా పెడతారు. అయినా ఏ కొద్ది మందికో మినహా లోయర్ బెర్తులు ఒక్కోసారి దొరక్కపోవచ్చు. ప్రయాణానికి చాలా రోజుల ముందు టికెట్ బుక్ చేసినా ఈ పరిస్థితి తలెత్తొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి?
ఓ నలుగురు వ్యక్తులు దూర ప్రయాణం చేయాలి. అందులో ఇద్దరు పెద్దవాళ్లు.. మరో ఇద్దరు మధ్య వయసు వారూ ఉన్నారనుకుందాం. ఇలాంటి సందర్భాల్లో అందరికీ కలిపి టికెట్లు బుక్ చేసేస్తుంటారు. ఇలా చేసినప్పుడు బెర్త్ ప్రిఫరెన్స్ను బట్టి పెద్దవారికి ఒక్కోసారి లోయర్ బెర్త్ వచ్చినా.. ఇద్దరికీ లోయర్ బెర్త్ రావడం అరుదు. ఎందుకంటే ఇది పూర్తిగా జనరల్ కోటా కాబట్టి. సీట్ల అందుబాటును బట్టి బెర్తుల కేటాయింపు జరుగుతుంది. ఇందులో ఎలాంటి మానవ ప్రమేయమూ ఉండదని రైల్వే ఓ సందర్భంలో తెలిపింది. ఒకవేళ వయోభారం కారణంగా మిడిల్, అప్పర్ బెర్తుల్లో పడుకోవడానికి ఇబ్బంది పడితే టీటీఈని సంప్రదిస్తే వారికి వేరే బెర్త్ కేటాయిస్తారు. అదీ బెర్తుల అందుబాటును బట్టి మాత్రమే. కాబట్టి ఇకపై అలా జరగకుండా ఉండాలంటే సీనియర్ సిటిజన్ కోటాలో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఎయిర్టెల్ నుంచి ఎయిర్ ఫైబర్.. ప్లాన్ వివరాలు ఇవే..!
సాధారణంగా సీనియర్ సిటిజన్ కోటాలో టికెట్లు అందుబాటులో ఉన్నప్పుడు బుక్ చేసుకున్న వారికి లోయర్ బెర్త్ను కేటాయిస్తారు. సాధారణంగా అన్ని రైళ్లలో ఈ కోటా అందుబాటులో ఉంటుంది. ఒక్కో బోగీలో స్లీపర్ క్లాస్కు అయితే ఆరు బెర్తులు, ఏసీ-3 టైర్, ఏసీ-2 టైర్ బోగీల్లో అయితే మూడేసి బెర్తులు చొప్పున సీనియర్ సిటిజన్ కోటాలో అందుబాటులో ఉంచుతారు. రైళ్లను బట్టి ఈ కోటాలో తేడా ఉండొచ్చు.
ఈ కోటాలో 60 ఏళ్లు దాటిన పురుష ప్రయాణికులను సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు. అదే స్త్రీలు అయితే 45 ఏళ్లు దాటితే వారిని సీనియర్ సిటిజన్లుగా పరిగణించి లోయర్ బెర్త్ కేటాయిస్తారు. గర్భిణులతో రైళ్లలో ప్రయాణించేటప్పుడు కూడా లోయర్ బెర్త్ ఆప్షన్ వినియోగించుకోవచ్చు. అయితే, రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లలో మాత్రమే ఈ టికెట్లను బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. ఒక పీఎన్ఆర్ నంబర్పై గరిష్ఠంగా ఇద్దరికి మాత్రమే సీనియర్ టికెట్ కోటాలో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండు కంటే ఎక్కువ టికెట్లు బుక్ చేసినప్పుడు మిగిలిన టికెట్లు జనరల్ కోటా కింద పరిగణిస్తారు. కాబట్టి మీ ప్రయాణంలో ఒకవేళ పెద్దలు ఉంటే ఈ సారి సీనియర్ సిటిజన్ కోటాను వినియోగించుకోండి. అప్పుడు లోయర్ బెర్తులు తప్పకుండా దొరకుతాయి. మిగిలిన వారికి వారి బెర్తులకు అటూ ఇటూగా బెర్తులు వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
EPS rule: ఈపీఎస్ విత్డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది. -
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది. -
ఆరోగ్య బీమా క్లెయిమ్ చిక్కులకు చెక్.. త్వరలో ప్రభుత్వ పోర్టల్!
Health Insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్మెంట్లను సులభతరం చేసే లక్ష్యంతో కేంద్రం త్వరలోనే సరికొత్త పోర్టల్కు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. -
జూన్ 14 తర్వాత ఆ ఆధార్ కార్డులు పనిచేయవా? ఉడాయ్ వివరణ..
Aadhaar Card: జూన్ 14లోపు ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోకపోతే అవి పనిచేయబోవంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఉడాయ్ వివరణ ఇచ్చింది. -
5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ఆప్షన్ గురించి తెలుసా?
Railway ticket booking: ట్రైన్ బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా ట్రైన్ టికెట్ బుక్ చేసుకొనే సదుపాయం ఉందని మీకు తెలుసా? అదెలాగంటే..? -
హెచ్చుతగ్గులు తక్కువగా...
ఇండెక్స్ తరగతికి చెందిన ఒక ఓపెన్ ఎండెడ్ పతకాన్ని కోటక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా తీసుకొచ్చింది. కోటక్ నిఫ్టీ 100 లోవోలటైలిటీ 30 ఇండెక్స్ ఫండ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓలో ఈ నెల 31 వరకూ మదుపు చేయొచ్చు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అనంత్- రాధిక సంగీత్లో టీ20 హీరోలకు గ్రాండ్ వెల్కమ్
-
కాళేశ్వరం పంపహౌస్ ఇంజినీర్లను విచారించనున్న పీసీ ఘోష్ కమిషన్
-
సమంతకు క్షమాపణలు చెప్పిన డాక్టర్.. కానీ..
-
సికింద్రాబాద్‑గోవా బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలు.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కిషన్రెడ్డి
-
నటుడు రాజ్ తరుణ్ వ్యవహారంలో మరో ట్విస్ట్
-
అస్సాం అతలాకుతలం.. ఉప్పొంగుతున్న నదులు