- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Income Tax: ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి.
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. రాని వారికి మరో 10 రోజుల్లో అందే అవకాశాలున్నాయి. మీకు ఇప్పటికే ఈ పత్రం అందితే.. మీరు చేయాల్సిన మొదటి పని.. ఫారం-16ను ఫారం-26ఏఎస్తో పోల్చి చూసుకోవాలి. ఆ తర్వాతే రిటర్నులను దాఖలు చేసేందుకు సిద్ధంకండి.
పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు కీలకమైన పత్రాల్లో ఫారం-16 ఒకటి. దీంతోపాటు ఫారం-26ఏఎస్, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్) అవసరమూ ఉంటుంది. ఒక వ్యక్తికి వచ్చిన అన్ని రకాల ఆదాయాలూ, వాటిపై మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) వివరాలతో ఫారం-26ఏఎస్ ఉంటుంది. వేతనంతోపాటు, బ్యాంకులు ఇచ్చిన వడ్డీ, డివిడెండ్లపై విధించిన టీడీఎస్లూ ఇందులో కనిపిస్తాయి. ఫారం-16లో కేవలం వేతనానికి సంబంధించిన వివరాలే ఉంటాయని మర్చిపోవద్దు. ఈ రెండు పత్రాలనూ క్రోడీకరించి ఉండేదే ఏఐఎస్. కాబట్టి, పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వాస్తవ ఆదాయం, పన్ను చెల్లింపులను సరిగ్గా తెలుసుకోవాలంటే ఈ మూడు పత్రాలూ పరిశీలించాల్సిందే.
వ్యత్యాసాలుంటే..
పన్ను చెల్లింపుదారులు ఆదాయం, చెల్లించిన పన్నులు అన్నీ నమోదయ్యాయా లేదా చూసుకోవాలి. ఫారం-16, ఫారం-26ఏఎస్లను దగ్గర పెట్టుకొని, ఏదైనా వ్యత్యాసాలున్నాయా చూసుకోవాలి. తప్పులతో రిటర్నులు దాఖలు చేయడం మంచిది కాదు. ఈ రెండింటి మధ్య తేడా ఉన్నా, మీరు రిటర్నులు దాఖలు చేస్తే అవి చెల్లకపోయే ఆస్కారం ఉంది. నోటీసులూ రావచ్చు. జరిమానాకూ అవకాశం ఉంటుంది. కాబట్టి, రిటర్నులు దాఖలు చేయకముందే ఈ రెండింటినీ సరిపోల్చుకోవడం అవసరం.
తప్పులుంటే..
ఫారం-16, ఫారం 26ఏఎస్లలోని వివరాల్లో తేడాలుంటే ముందుగా మీ యాజమాన్యాన్ని లేదా టీడీఎస్ చేసిన వారిని సంప్రదించాలి. మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థ దానిని సులభంగానే సరిచేసేందుకు అవకాశం ఉంటుంది. సవరించిన టీడీఎస్ను ఫైల్ చేసి, కొత్త ఫారం-16, ఫారం-26ఏఎస్లను అందిస్తుంది. పన్ను వివరాలు సరిపోలేదని ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు వస్తే, ఇ-ఫైలింగ్ పోర్టల్లోనే దానికి స్పందన తెలియజేయొచ్చు.
ఏఐఎస్నూ చూడాలి..
ఆదాయ వనరులతోపాటు, టీడీఎస్కు సంబంధించిన వివరాలన్నీ నిశితంగా పరిశీలించడం తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న సాంకేతికతతో పన్ను విభాగం ప్రతి ఆదాయాన్నీ నమోదు చేస్తోంది. ఉదాహరణకు పన్ను రిఫండు, పొదుపు ఖాతా నుంచి వచ్చిన వడ్డీ, డివిడెండ్ ఆదాయం, పొందిన అద్దె, స్థిరాస్తుల క్రయవిక్రయాలు, షేర్ల లావాదేవీలు, విదేశీ చెల్లింపులు ఇలా ప్రతి అంశమూ వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో కనిపిస్తుంది. కాబట్టి, ఒకసారి ఈ పత్రాన్ని పూర్తిగా పరిశీలించాలి. ఆదాయపు పన్ను పోర్టల్లో లాగిన్ కావడం ద్వారా దీన్ని పొందవచ్చు. ఒకవేళ ఇందులో తప్పులున్నట్లు గమనిస్తే.. అక్కడే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. ఒకటికి రెండుసార్లు మీ వివరాలన్నీ పరిశీలించుకున్నాకే ఈ నిర్ణయం తీసుకోవాలి.
వివరాలు సరిపోకపోతే..
పన్ను రిటర్నులను మరింత సులభతరం చేసే క్రమంలో ఆదాయపు పన్ను విభాగం ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. ఇందులో ప్రధానంగా దాదాపు అన్ని వివరాలూ ముందే భర్తీ చేసి ఉన్న ఐటీఆర్-1. మీరు పోర్టల్లోకి లాగిన్ అయ్యాక, ఫారాన్ని ఎంపిక చేసుకోగానే మీ ఆదాయం, పన్ను మినహాయింపులు, టీడీఎస్, రిఫండ్కు సంబంధించి దాదాపు 90 శాతానికిపైగా వివరాలూ అక్కడ ముందే ఉంటాయి. కొన్నిసార్లు ఫారం-16 వివరాలకూ, ముందే నింపి ఉన్న ఐటీఆర్ ఫారానికీ పొంతన ఉండకపోవచ్చు. ఇది చాలా అరుదుగానే జరుగుతుందన్నదీ ఇక్కడ గుర్తుంచుకోవాలి.
- ఫారం -16లోనే ఏదైనా తప్పు ఉందా అనేది ముందు చూసుకోవాలి. అక్కడ అన్ని వివరాలూ ధ్రువీకరించుకోవాలి. ఆదాయం, మినహాయింపులు, పన్నును లెక్కించడంలో ఏదైనా తేడా ఉందా చూసుకోవాలి.
- కొన్నిసార్లు ఫారం-16లో ఉన్న వివరాలు ఐటీ విభాగం దగ్గర ఇంకా నమోదు కావడంలో ఆలస్యం కావచ్చు. ఇలాంటప్పుడు రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ రిటర్నులు దాఖలు చేసేందుకు ప్రయత్నించాలి.
- యాజమాన్యాలు కొత్త ఫారం-16 కాకుండా, పాత పద్ధతిలో జారీ చేస్తే అప్పుడు ఐటీ పోర్టల్ సాంకేతికత దాన్ని సరిగ్గా తీసుకోకపోవచ్చు.
- పన్ను చెల్లింపుదారుడు యాజమాన్యానికి తెలియజేయని మినహాయింపులూ ఇక్కడ ఐటీఆర్లో కనిపించవు. కాబట్టి, ఆ వివరాలకు సంబంధించి, సరైన ధ్రువీకరణలు దగ్గర పెట్టుకొని, వాటిని నమోదు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది. -
ఆరోగ్య బీమా క్లెయిమ్ చిక్కులకు చెక్.. త్వరలో ప్రభుత్వ పోర్టల్!
Health Insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్మెంట్లను సులభతరం చేసే లక్ష్యంతో కేంద్రం త్వరలోనే సరికొత్త పోర్టల్కు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. -
జూన్ 14 తర్వాత ఆ ఆధార్ కార్డులు పనిచేయవా? ఉడాయ్ వివరణ..
Aadhaar Card: జూన్ 14లోపు ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోకపోతే అవి పనిచేయబోవంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఉడాయ్ వివరణ ఇచ్చింది. -
5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ఆప్షన్ గురించి తెలుసా?
Railway ticket booking: ట్రైన్ బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా ట్రైన్ టికెట్ బుక్ చేసుకొనే సదుపాయం ఉందని మీకు తెలుసా? అదెలాగంటే..? -
హెచ్చుతగ్గులు తక్కువగా...
ఇండెక్స్ తరగతికి చెందిన ఒక ఓపెన్ ఎండెడ్ పతకాన్ని కోటక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా తీసుకొచ్చింది. కోటక్ నిఫ్టీ 100 లోవోలటైలిటీ 30 ఇండెక్స్ ఫండ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓలో ఈ నెల 31 వరకూ మదుపు చేయొచ్చు. -
రాబడి హామీతో పన్ను ఆదా
నెలకు రూ.6,000 చొప్పున మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 8 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. -
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా తన బ్యాగేజీ పాలసీని మార్చింది. కొత్త రూల్స్ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాలుగేళ్ల తర్వాత భారత్కు ప్రయాణం.. విమానంలో ప్రాణం విడిచిన యువతి!
-
అమరావతిపై చంద్రబాబు సమీక్ష.. ఎల్లుండి శ్వేతపత్రం
-
‘నన్ను బహిష్కరిస్తే.. 63 మంది ఎంపీలు ఇంటికెళ్లారు’: భాజపాపై మహువా మొయిత్రా ఫైర్
-
త్వరలో క్యాబినెట్ విస్తరణ.. సీతక్కకు హోంశాఖ దక్కే ఛాన్స్: దామోదర రాజనర్సింహ
-
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
-
అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు.. నిపుణులు ఏమంటున్నారు!