- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Deferred Annuity Plan: ఈ ప్లాన్లతో జీవితకాలం కచ్చితమైన ఆదాయం!
Deferred Annuity Plan: పదవీ విరమణ అనంతరం క్రమంతప్పకుండా కచ్చితమైన ఆదాయం కావాలనుకునేవారికి డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్లు సరిగ్గా సరిపోతాయి.
Deferred Annuity Plan | ఇంటర్నెట్ డెస్క్: టర్మ్ ఇన్సూరెన్స్, సేవింగ్స్ ప్లాన్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లతో పాటు జీవిత బీమా కంపెనీలు యాన్యుటీ ప్లాన్లను (Annuity Plans) కూడా అందిస్తున్నాయి. ఇవి మీరు ఎంచుకున్న వ్యవధి ప్రకారం.. స్థిరమైన, కచ్చితమైన ఆదాయాన్ని క్రమంతప్పకుండా అందిస్తాయి. చెల్లింపు విధానాన్ని బట్టి రెండు రకాల యాన్యుటీ ప్లాన్లు ఉన్నాయి. అవి తక్షణ యాన్యుటీ, డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్లు (Deferred Annuity Plans). మొదటి దాంట్లో పథకం ప్రయోజనాలు వెంటనే అందుతాయి. మరి రెండో ప్లాన్ ఎలా పనిచేస్తుంది? దాని ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూద్దాం..
డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ అంటే?
డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ (Deferred Annuity Plan) అనేది జీవితాంతం క్రమంతప్పకుండా ఆదాయాన్నందించే ఒక ఫైనాన్షియల్ ప్రొడక్ట్. తక్షణ ప్లాన్ తరహాలో కాకుండా.. మీరు ఎంచుకున్న ప్రకారం.. ప్లాన్ గడువు ముగిసిన కొంత కాలం తర్వాత చెల్లింపులు ప్రారంభమవుతాయి.
ఎలా పని చేస్తుంది?
మీరు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కోసం చూస్తున్నారనుకుందాం. మీ వయసు ప్రస్తుతం 30 ఏళ్లయితే 60 ఏళ్లు నిండిన తర్వాతే యాన్యుటీలను స్వీకరించాలనుకుంటే ఈ ప్లాన్ సరిపోతుంది. పదవీ విరమణ చేసే ముందు మీకు అదనపు ఆదాయ వనరు అవసరం లేదు. కాబట్టి డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ని కొనుగోలు చేయడం ఉత్తమం.
ప్లాన్ నిబంధనల ప్రకారం.. కొంతమొత్తం నెలవారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలా 20 ఏళ్ల (మీకు 50 ఏళ్లు వచ్చే వరకు) వరకు కొనసాగించాలి. ప్రీమియం చెల్లించే కాలాన్ని ‘అక్యుములేషన్ ఫేజ్’ అంటారు. ఈ దశ ముగిసిన తర్వాత 10 సంవత్సరాల వరకు ఎలాంటి ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆ తర్వాత కూడా యాన్యుటీ చెల్లింపులు ప్రారంభం కాబోవు. 60 ఏళ్లు వచ్చిన తర్వాతే చెల్లింపు దశ ప్రారంభమవుతుంది. అక్కడినుంచి జీవితాంతం నెలవారీ లేదా త్రైమాసిక లేదా వార్షిక ప్రాతిపదికన రెగ్యులర్ యాన్యుటీ చెల్లింపులను పింఛను తరహాలో అందుతాయి.
ఫీచర్లు, ప్రయోజనాలు..
-
మనకు నచ్చినట్లుగా చెల్లింపులు..
డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్లలో చెల్లింపు దశ ఎప్పుడు ప్రారంభం కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ మదుపర్లకు ఉంటుంది. అయితే, ప్లాన్ రకం, ప్రీమియం చెల్లింపు ఎంపికను బట్టి ఎన్నేళ్ల పాటు చెల్లింపు దశను వాయిదా వేసుకోవాలనేది ఆధారపడి ఉంటుంది.
-
హామీతో కూడిన ఆదాయం..
మార్కెట్- అనుసంధానిత పెట్టుబడి పథకాల్లా కాకుండా, డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ నుంచి వచ్చే రాబడికి కచ్చితమైన హామీ ఉంటుంది. మార్కెట్ల కదలికలు, వడ్డీరేట్ల వంటి వాటిపై ఆధారపడి ఉండదు. పైగా మీకు భవిష్యత్తులో ఎంత అందుతుందనేది కూడా ముందే నిర్ణయమై ఉంటుంది. తద్వారా ఆర్థిక వ్యవహారాలను ముందుగానే మెరుగైన రీతిలో ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
-
అధిక చెల్లింపులు..
డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్లలో (Deferred Annuity Plan) వడ్డీ కూడా వస్తుంది. తద్వారా అక్యుములేషన్తో పాటు చెల్లింపులు ప్రారంభమయ్యే వరకు కూడా వడ్డీ లభిస్తుంది. ఫలితంగా యాన్యుటీ చెల్లింపుల మొత్తం కూడా ఆ మేరకు పెరుగుతుంది.
-
ప్రీమియం చెల్లింపుల్లో వెసులుబాటు..
ప్రీమియం చెల్లింపు విషయంలోనూ వెసులుబాటు ఉంటుంది. కావాలంటే ఒకేసారి ఏకమొత్తంలో చెల్లించొచ్చు. లేదంటే నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది.. ఇలా వీలును బట్టి చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుంది.
-
కావాలంటే ఏక మొత్తం చెల్లింపు..
డిఫర్డ్ యాన్యుటీలోనూ (Deferred Annuity Plan) కావాలంటే ఒకేసారి ఏకమొత్తాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ఎంచుకున్న వ్యవధిని బట్టి జీవితకాలం క్రమం తప్పకుండా చెల్లింపులు అందిస్తూనే ఉంటారు.
భద్రమైన రిటైర్మెంట్ అనంతర జీవితానికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ పెట్టుబడి ఎంపికలలో డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్లు ఒకటి. అయితే, వీటినుంచి స్వీకరించే చెల్లింపులను ‘వేతనాల నుంచి వచ్చే ఆదాయం’ కింద పరిగణిస్తారు. మీ పన్ను శ్లాబ్ ప్రకారం దీనికి కూడా ట్యాక్స్ వర్తిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఐవీఎఫ్తో కవలలకు జన్మనిచ్చా’: వ్యక్తిగత విషయం వెల్లడించిన ఈశా అంబానీ
రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని నడిపిస్తోన్న ఈశా అంబానీ(Isha Ambani).. తన కవలలకు ఐవీఎఫ్(IVF) పద్ధతిలో జన్మనిచ్చినట్లు తెలిపారు. -
జియో, ఎయిర్టెల్ బాటలోనే వీఐ.. టారిఫ్ల పెంపు
Vodafone Idea: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కూడా మొబైల్ టారిఫ్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. -
అనంత్ అంబానీ-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకల్లో సామూహిక వివాహాలు
Anant Ambani-Radhika Merchant wedding: అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా పలు జంటలకు సామూహిక వివాహాలు జరిపించనున్నారు. జులై 2న ఈ కార్యక్రమం జరగనుంది. -
పోర్టింగ్కు కొత్త రూల్.. సిమ్ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!
New MNP rules: మొబైల్ నంబర్ పోర్టింగ్కు కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. -
చిన్న కంపెనీలూ డిజిటైజేషన్ బాటలో
వచ్చే ఏడాది కల్లా దాదాపు 60 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్ఎమ్ఈ)లు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయనున్నాయని వొడాఫోన్ ఐడియా బిజినెస్ తన నివేదికలో పేర్కొంది. -
ఎయిర్టెల్ ఛార్జీలూ పెరిగాయ్
ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ టారిఫ్లను 10-21 శాతం పెంచుతున్నట్లు శుకవ్రారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధం
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగించే పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ లైఫ్సైన్సెస్ ఉమ్మడిగా విక్రయించనున్నాయి. -
రికార్డుల పరుగుకు విరామం
మూడు రోజుల రికార్డుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్ షేర్లలో మదుపర్ల లాభాల స్వీకరణతో గరిష్ఠ స్థాయుల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ వెనక్కి వచ్చాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 83.34 వద్ద ముగిసింది. -
ప్రాథమిక డీమ్యాట్ ఖాతా పరిమితి రూ.10 లక్షలకు పెంపు
సెక్యూరిటీల మార్కెట్లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యం పెంచేందుకు, ప్రాథమిక సేవల డీమ్యాట్ ఖాతా (బీఎస్డీఏ) పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సెబీ తెలిపింది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ నుంచి సరికొత్త కాంప్లెక్స్ ఎరువు
‘పరమ్ఫోస్ ప్లస్’ అనే పేరుతో మెగ్నీషియంతో కూడిన కాంప్లెక్స్ ఎరువును కోరమాండల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. -
మేలో కీలక రంగాల వృద్ధి 6.3%
మేలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తిలో 6.3 శాతం మేర వృద్ధి నమోదైంది. విద్యుత్, బొగ్గు, సహజవాయువు రంగాలు రాణించడం ఇందుకు ఉపకరించింది. -
చిన్ని మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా రెండో త్రైమాసికమూ ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. -
ఎంఎస్ఎంఈ సంస్థలకు యాక్సిస్ బ్యాంకు ప్రత్యేక సదుపాయాలు
అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు పలు ఆఫర్లు ప్రకటించింది. -
భారత్ ఎలక్ట్రానిక్స్కు రూ.3,172 కోట్ల ఆర్డర్లు
నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) రూ.3,172 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. -
సంక్షిప్త వార్తలు(7)
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. జులై 3 నుంచి మొబైల్ సేవల టారిఫ్లను 12-27 శాతం పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్.. వాహనాలు దగ్ధం
-
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
-
‘ఐవీఎఫ్తో కవలలకు జన్మనిచ్చా’: వ్యక్తిగత విషయం వెల్లడించిన ఈశా అంబానీ
-
పులివెందుల కౌన్సిలర్ల అసమ్మతి.. పార్టీలోనే ఉండాలని ఎంపీ అవినాశ్ సూచన
-
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా
-
కేంద్రానికి నీతీశ్ కుమార్ మెలిక.. ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలంటూ తీర్మానం