- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
CONCOR: కాంకర్లో 5-7% వాటా అమ్మకం!
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది.
ప్రైవేటీకరణ ప్రస్తుతానికి లేనట్లే
దిల్లీ: కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సంస్థలో వ్యూహాత్మక వాటా విక్రయ ప్రతిపాదనకు, ఆసక్తిగల పెట్టుబడి సంస్థల నుంచి స్పందన కరవవ్వడం ఇందుకు కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సంస్థలో 5-7% వాటా విక్రయించే అంశాన్ని ప్రభుత్వం తాజాగా పరిశీలిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఆఫర్ ఫర్ సేల్ లేదా అర్హులెనౖ సంస్థాగత మదుపర్లకు షేర్ల జారీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా ఆర్థిక సంస్థలతో కాంకర్ యాజమాన్యం చర్చలు ప్రారంభించిందనీ పేర్కొంటున్నారు.
ప్రభుత్వానికి 54.8% వాటా
కాంకర్లో ప్రభుత్వానికి 54.8% వాటా ఉంది. ఇందులో 30.8% వాటాను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా విక్రయించాలని భావించింది. స్థల అద్దె రుసుమును తగ్గించడంలో సంస్థ అశక్తత, రైల్వే శాఖ నుంచి సహకార లేకపోవడం లాంటి వాటి కారణంగా.. ఈ సంస్థలో వాటా కొనేందుకు పెట్టుబడి సంస్థలు పెద్దగా ఆసక్తి చూపలేదు.
2019 నుంచీ ఇంతే
కాంకర్లో 30.8% వాటా విక్రయంతో పాటు, యాజమాన్య నియంత్రణ బదిలీ ప్రతిపాదనకు 2019 నవంబరులో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటో అధికారాలు లేకుండా 24% వాటాను అట్టేపెట్టుకోవాలని ప్రభుత్వం భావించినా, ఇప్పటికీ సాకారం కావడం లేదు. ‘కాంకర్ వ్యూహాత్మక వాటా విక్రయ ప్రతిపాదన కొన్నేళ్లుగా నెరవేరడం లేదు. తొలుత ఈ వాటా విక్రయ ప్రతిపాదనపై రైల్వే శాఖకు అభ్యంతరాలు ఉండేవి. ఆ తర్వాత స్థల అద్దె విధానానికి ఆమోదం లభించడంతో, ఈ ప్రక్రియ ముందుకు కదులుతుందని భావించినా, జరగలేదు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ‘ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యూహాత్మక వాటా విక్రయ నిర్ణయాల’పై దూకుడు ఉండకపోవచ్చు. ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత ఉండటమే ఇందుకు కారణమ’ని ఓ ఆంగ్ల వెబ్సైట్కు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాంకర్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జరిగే అవకాశాల్లేవని తెలిపారు.
మార్కెట్ విలువ 200% అధికం
కాంకర్లో వ్యూహాత్మక పెట్టుబడి ఉపసంహరణ ప్రతిపాదనకు ఆమోదం లభించిన 2019 నవంబరుతో పోలిస్తే, ఇప్పటికి ఈ సంస్థ మార్కెట్ విలువ ఏకంగా 200% పెరిగి రూ.62,470.95 కోట్లకు చేరింది. ఈ విలువ ప్రకారం.. ఇందులో కనీసం 5-7 శాతం వాటాను విక్రయించినా, ప్రభుత్వానికి రూ.3,500- 4,700 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
61 డిపోలు
కాంకర్కు ప్రస్తుతం 61 ఇన్ల్యాండ్ కంటెయినర్ డిపోలు ఉన్నాయి. ఇందులో 26 డిపోలను రైల్వేల నుంచి అద్దెకు తీసుకుంది. కంపెనీ మొత్తం వార్షిక ఆదాయంలో సగానికి పైగా వాటా ఈ 26 డిపోల నుంచే వస్తోంది. తన ఇన్ల్యాండ్ టర్మినళ్లను ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్థలం- లైసెన్సు రుసుము విధానానికి బదిలీ చేసే ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరంలోనే కాంకర్ ప్రారంభించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించే స్థల అద్దె రుసుం పెరగకుండా నియంత్రించుకునే అవకాశం సంస్థకు ఉంటుంది. 2023-24లో రైల్వే శాఖకు స్థల అద్దె రుసుం కింద రూ.424 కోట్లను కాంకర్ చెల్లించింది. కొత్తగా తీసుకొచ్చిన స్థల అద్దె రుసుము విధానం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.125 కోట్లకు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి
హైదరాబాద్లో 2024 జనవరి-జూన్లో 18,573 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయమైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. -
మార్కెట్లు పెరుగుతున్నాయ్.. జాగ్రత్త
ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ సూచించారు. -
ఎల్ఐసీ ‘జీవన్ సమర్థ్’ ప్రాజెక్టు
తమ వ్యవస్థను మరింత మెరుగు పరచుకునే లక్ష్యంతో ‘జీవన్ సమర్థ్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) గురువారం ప్రకటించింది. -
సిమెంట్ రంగంలో 2-3 శాతం వృద్ధి!
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో సిమెంట్ రంగంలో 2-3% వృద్ధి నమోదు కావొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. -
ఆకర్షణీయంగా ఆఫీస్లు
ఉద్యోగుల వలసలను ఆపడంతో పాటు.. కార్యాలయాలకు వచ్చేలా వారిని ఆకర్షించేందుకు ‘ఆఫీస్ పీకాకింగ్’నకు పలు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. -
స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించనున్న రేమండ్
స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించి, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ప్రత్యేక సంస్థగా నమోదు చేయనున్నట్లు రేమండ్ లిమిటెడ్ గురువారం ప్రకటించింది. -
రూ.447.30 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పెద్ద షేర్లు రాణించడంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల ఎగువన ముగిసింది. -
వ్యవసాయ రుణాలకు ప్రత్యేక కేంద్రాలు: ఎస్బీఐ
వ్యవసాయ రుణాల కోసం అగ్రికల్చరల్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్స్ పేరుతో 35 ప్రత్యేక కేంద్రాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రారంభించింది. -
అన్వితా గ్రూప్ రూ.2000 కోట్ల స్థిరాస్తి ప్రాజెక్టు
స్థిరాస్తి సేవల సంస్థ అన్వితా గ్రూప్ హైదరాబాద్ శివార్లలోని కొల్లూరులో రూ.2,000 కోట్ల విలువైన నూతన గృహ సముదాయ ప్రాజెక్టు ఇవానాను చేపట్టింది. -
మహిళా పారిశ్రామికవేత్తతో ఈఈఎస్ఎల్ ఒప్పందం
విద్యుత్తు ఆదా చేసే సాధనాల వినియోగంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త పద్మ వథ్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. -
బ్రోకరేజీల్లో మోసాల అడ్డుకట్టకు ఒక వ్యవస్థ!
స్టాక్ మార్కెట్లో మదుపర్ల ప్రయోజనాలను రక్షించేందుకు.. మోసాలను కనిపెట్టి, వాటిని అరికట్టే ఒక సంస్థాగత వ్యవస్థను బ్రోకింగ్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలని సెబీ గురువారం ఆదేశించింది. -
సిలిండర్లకు క్యూఆర్ కోడ్!
నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పెసో (పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్)ను ఆదేశించారు. -
జీఎస్టీ ఆదాయంలో కేంద్రం భారీ త్యాగం
జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి, రాష్ట్రాలకు పరిహారం చెల్లించడం కోసం జీఎస్టీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కేంద్రప్రభుత్వం త్యాగం చేయాల్సి వచ్చిందని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు. -
పెట్టుబడుల ఉపసంహరణ భారీ స్థాయిలో లేనట్లే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2.1 లక్షల కోట్ల డివిడెండును కేంద్రానికి ఇవ్వడంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో భారీ స్థాయి పెట్టుబడుల ఉపసంహరణలు ఉండకపోవచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ కేర్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లో మోసాలు చేసే వారి గురించి తమకు తెలియజేయాలని మార్కెట్ వర్గాలకు సెబీ ఛైర్మన్ మాధబి పురి బచ్ పిలుపునిచ్చారు. -
యులిప్.. ఎప్పుడు తీసుకోవాలంటే..
బీమా.. పెట్టుబడి కలిసి ఉండే యూనిట్ ఆధారిత బీమా పాలసీ(యులిప్)లు కాస్త భిన్నమైన పథకాలనే చెప్పాలి. ఇప్పటి వరకూ వీటిని బీమా సంస్థలు పెట్టుబడి పథకాలుగానే చెబుతూ పాలసీదారులకు విక్రయించేవి. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
మీ డబ్బు సురక్షితంగా..
ఆర్థిక లావాదేవీలు డిజిటల్లో సులువుగా చేసేస్తున్నాం. అదే సమయంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భద్రత అనేది కీలకంగా మారుతోంది. -
పింఛను పాలసీ తీసుకోవచ్చా?
బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే కార్పొరేట్ బాండ్లు కాస్త అధిక రాబడిని ఇచ్చే మాట వాస్తవమే. కానీ, పెద్ద కంపెనీలు, క్రెడిట్ రేటింగ్ బాగున్న వాటినే ఎంచుకోవాలి. -
క్రెడిట్ స్కోరు ఈ సంగతులు తెలుసుకోండి
ప్రతి చిన్న అవసరానికీ అప్పు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. క్రెడిట్ బ్యూరో ఎక్స్పీరియన్ ఇండియా నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రుణ వితరణలో 19 శాతం వరకూ వృద్ధి నమోదయ్యింది. -
విద్యుత్తు ఉపకరణాల సంస్థల్లో
విద్యుత్తు రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విద్యుత్తు సరఫరా, పంపిణీ విభాగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్పై స్పందించిన నాగ్ అశ్విన్
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. అధికారం దిశగా లేబర్ పార్టీ
-
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
-
వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
-
అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం.. కాకాణి సొంతూరిలో భారీ మోసం
-
హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి