- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
EPS New rule: ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
EPS rule: ఈపీఎస్ విత్డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది.
EPS rule | ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల పింఛను పథకం (EPS), 1995కు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కొన్ని సవరణలు చేసింది. ఆరు నెలల కంటే తక్కువ సర్వీసు ఉన్నా ఉపసంహరణ ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు పేర్కొంది. దీనివల్ల ఏటా సుమారు 7 లక్షల మందికి ప్రయోజనం కలగనుందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, పదేళ్లు సర్వీసు పూర్తికాక ముందే సర్వీసు నుంచి వైదొలిగే ఉద్యోగులు.. ఉపసంహరించుకునే మొత్తాలకు సంబంధించి గణాంకాల్లోనూ ఈపీఎఫ్ఓ మరో మార్పు చేసింది.
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థలో పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు పెన్షన్కు అర్హులుగా పరిగణిస్తారు. ఆ మేర వారికి పెన్షన్ లభిస్తుంది. అయితే, కొందరు కొద్ది రోజులకే సర్వీసులను విడిచిపెట్టేస్తుంటారు. అలా ఎవరైతే ఆరు నెలల పాటు ఈపీఎస్లో జమ చేస్తారో వారికే విత్డ్రా బెన్ఫిట్స్ లభిస్తున్నాయి. ఆరు నెలల కన్నా తక్కువ సమయంలోనే సర్వీసును వీడే వారికి ఎలాంటి ఉపసంహరణ ప్రయోజనాలూ అందడం లేదు. దీంతో అనేక క్లెయిమ్లు రిజెక్ట్ అవుతున్నాయని, ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఏడు లక్షల మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో సవరణలు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈపీఎస్ చట్టం, 1995 టేబుల్-డికి ఈపీఎఫ్వో కొన్ని సవరణలు చేసింది. పదేళ్ల సర్వీసు లేనివారికి ఈపీఎస్లో జమైన నగదును వెనక్కి ఇచ్చేస్తారు. ఇలాంటి వారికి టేబుల్-డి ప్రకారం మొత్తాన్ని లెక్కించి ఇస్తారు. ఎవరైనా ఉద్యోగి పదేళ్ల సర్వీసుకు ముందే తన ఉద్యోగానికి రాజీనామా లేదంటే పదవీ విరమణ చేయడం ద్వారా ఈపీఎస్ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే... అతడి సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఎంత చెల్లించాలో లెక్కించేవారు. తాజా నిబంధనల ప్రకారం నెలల్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. దీనివల్ల ముందస్తు ఉపసంహరణపై వచ్చే మొత్తం తగ్గుతుంది.
లెక్క ఇలా..
ప్రతి ఉద్యోగి వేతనం నుంచి 12% ఈపీఎఫ్ ఖాతాకు వెళ్తుంది. అంతేమొత్తంలో యజమాని చెల్లించే 12% వాటాలో 8.33% ఈపీఎస్లోకి, మిగతా 3.67% ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. 2014 నుంచి ఈపీఎఫ్వో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచారు. దాని ప్రకారం యజమాని చెల్లించే 12% వాటా (రూ.1,800)లో 8.33% అంటే రూ.1,250 ఈపీఎస్కు వెళ్తుంది. ఎవరైనా ఉద్యోగి పదేళ్ల సర్వీసుకు కన్నా ముందే వైదొలిగితే.. అతడికి ఉద్యోగి మూలవేతనం + డీఏ కలిపి రూ.15 వేలుంది.ఉదాహరణకు ఒక వ్యక్తి ఆరేళ్ల ఏడు నెలలపాటు పని చేశారు. అప్పుడు గత నిబంధన ప్రకారం ఆరేళ్ల ఏడు నెలలను మొత్తం ఏడేళ్లుగా పరిగణించి ఈపీఎస్ వాటా నగదును చెల్లించేవారు. రాజీనామా/విరమణ చేసినప్పుడు రూ.15 వేలు ఉన్నందున... టేబుల్-డి ప్రకారం ఏడేళ్ల కాలానికి 7.13 నిష్పత్తి లెక్కన చెల్లించేవారు. అంటే రూ.15,000 X 7.13 చొప్పున రూ.1,06,950 లభిస్తాయి. తాజా నిబంధనల ప్రకారం ఆరేళ్ల ఏడు నెలలు అంటే.. 79 నెలలు అవుతుంది. 79 నెలల కాలానికి నిష్పత్తి 6.69 అవుతుంది. అంటే రూ.15000 X 6.69 లెక్కన రూ.1,00,350 అందుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది. -
ఆరోగ్య బీమా క్లెయిమ్ చిక్కులకు చెక్.. త్వరలో ప్రభుత్వ పోర్టల్!
Health Insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్మెంట్లను సులభతరం చేసే లక్ష్యంతో కేంద్రం త్వరలోనే సరికొత్త పోర్టల్కు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. -
జూన్ 14 తర్వాత ఆ ఆధార్ కార్డులు పనిచేయవా? ఉడాయ్ వివరణ..
Aadhaar Card: జూన్ 14లోపు ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోకపోతే అవి పనిచేయబోవంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఉడాయ్ వివరణ ఇచ్చింది. -
5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ఆప్షన్ గురించి తెలుసా?
Railway ticket booking: ట్రైన్ బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా ట్రైన్ టికెట్ బుక్ చేసుకొనే సదుపాయం ఉందని మీకు తెలుసా? అదెలాగంటే..? -
హెచ్చుతగ్గులు తక్కువగా...
ఇండెక్స్ తరగతికి చెందిన ఒక ఓపెన్ ఎండెడ్ పతకాన్ని కోటక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా తీసుకొచ్చింది. కోటక్ నిఫ్టీ 100 లోవోలటైలిటీ 30 ఇండెక్స్ ఫండ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓలో ఈ నెల 31 వరకూ మదుపు చేయొచ్చు. -
రాబడి హామీతో పన్ను ఆదా
నెలకు రూ.6,000 చొప్పున మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 8 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
మోదీవే అసత్య ప్రకటనలు.. చర్యలు తీసుకోండి: కాంగ్రెస్
-
అందుకే భోలే బాబాను ఇంకా అరెస్టు చేయలేదు: పోలీసులు
-
‘నీట్ను రద్దు చేయొద్దు’ - సుప్రీం కోర్టును ఆశ్రయించిన 56 మంది ర్యాంకర్లు
-
సీఎం రేవంత్రెడ్డి సూచనపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్
-
జగన్ జైలుకు పోయే సమయం ఆసన్నమైంది: మంత్రి రామ్ప్రసాద్రెడ్డి