- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి.
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. కాస్త నష్టభయం భరించగలిగిన వారు కొన్ని ప్రత్యేక రంగాల్లో ఉన్న వృద్ధిని అందుకోవాలని భావించే వారికి థీమాటిక్ ఫండ్లు (ఒకే రంగంలో మదుపు చేసేవి) అందుబాటులో ఉన్నాయి.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఎన్నో రంగాలు కీలకంగా ఉంటాయి. మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రంగంలోని సంస్థలూ బహుళ జాతి కంపెనీలూ, బ్యాంకులు, ఆర్థిక సేవలు, వాహన, వినియోగ వస్తువులు, ఫార్మా, ఐటీ రంగాల్లోని సంస్థలు ఇందులో ఉంటాయి. వీటిలో ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని, అందులోని కంపెనీల్లోనే మదుపు చేసేవే థీమాటిక్ లేదా సెక్టోరియల్ ఫండ్లు. ఆర్థిక వ్యవస్థను కాస్త అర్థం చేసుకోగలిగిన వారు వీటిలో మదుపు చేసి, దీర్ఘకాలంలో మంచి రాబడిని ఆర్జించే అవకాశం ఉంటుంది.
థీమాటిక్ ఫండ్లు తమ పెట్టుబడుల్లో 80 శాతం వరకూ ఎంచుకున్న రంగంలోని సంస్థలకే కేటాయిస్తాయి. అన్ని రకాల షేర్లలోనూ మదుపు చేసే ఫండ్లలాగా కాకుండా, ఆర్థిక వ్యవస్థలోని ఒకే రంగంపై దృష్టి కేంద్రీకరించి, ఆ రంగం నుంచి ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటాయన్నమాట.
పెట్టుబడులు ఎలా?
నిర్ణీత రంగంలోని కంపెనీల షేర్లలో మంచి పనితీరున్న వాటిని ఎంచుకొని, మదుపరులకు లాభాలను తీసుకురావడమే ఈ థీమాటిక్ షేర్ల ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా ఫండ్ మేనేజర్లు పథకం వ్యూహానికి తగ్గట్లుగా షేర్లను ఎంపిక చేసుకొని, పోర్ట్ఫోలియోను నిర్మిస్తారు. ఎంచుకున్న షేర్ల పనితీరును బట్టి, వాటిని సర్దుబాటు చేస్తుంటారు. ఆయా రంగానికి చెందిన ప్రామాణిక సూచీతో వీటిని పోల్చి చూస్తారు. ఫండ్ పనితీరు ఎంచుకున్న రంగం పురోగతి మీద ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఆ రంగం కీలకంగా ఉన్నప్పుడు మంచి రాబడులు వచ్చేందుకు అవకాశాలు పెరుగుతాయి. లేకపోతే, స్వల్పకాలంలో నష్టాలు వచ్చే ఆస్కారమూ ఉంది.
లాభాలేమిటి?
సెక్టోరియల్ ఫండ్లు నిర్ణీత రంగాలపై ఆధారపడి ఉన్నప్పటికీ, మీ మొత్తం పోర్ట్ఫోలియోకు వైవిధ్యం జోడించే అవకాశం ఉంది. నష్టభయాన్ని పరిమితం చేసుకునేందుకు ఇవి తోడ్పడతాయి.
- దీర్ఘకాలంలో ఆయా కంపెనీల విలువ పెరిగినప్పుడు.. పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో డైవర్సిఫైడ్ ఫండ్లతో పోల్చి చూసినా అధిక రాబడే అందుతుందని చెప్పొచ్చు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ధోరణులను ఇవి అందుకుంటాయి. కాబట్టి, వృద్ధికి అవకాశాలు అధికం.
- పెట్టుబడి పెట్టే పథకం గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ తర్వాతే మదుపు నిర్ణయం తీసుకోవాలి.
- కొన్నిసార్లు మార్కెట్ పోకడలు నిర్ణీత రంగాలకు వ్యతిరేకంగా ఉండొచ్చు. ఇలాంటప్పుడు నష్టం వచ్చే సందర్భాలుంటాయి. కాబట్టి, ఫండ్ విలువలో హెచ్చుతగ్గులు సహజమని గుర్తించాలి.
- భౌగోళిక, రాజకీయ పరిస్థితులు థీమాటిక్ ఫండ్లకు నష్టం చేకూరుస్తాయి. కాబట్టి, వీటికి ప్రభావితం కాని రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- ఒకే రంగానికి పరిమితమైన ఫండ్లను ఎంచుకునేటప్పుడు అవి మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యాలు, నష్టభయం భరించే శక్తిని బట్టి సరైన పథకాన్ని ఎంచుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది. -
ఆరోగ్య బీమా క్లెయిమ్ చిక్కులకు చెక్.. త్వరలో ప్రభుత్వ పోర్టల్!
Health Insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్మెంట్లను సులభతరం చేసే లక్ష్యంతో కేంద్రం త్వరలోనే సరికొత్త పోర్టల్కు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. -
జూన్ 14 తర్వాత ఆ ఆధార్ కార్డులు పనిచేయవా? ఉడాయ్ వివరణ..
Aadhaar Card: జూన్ 14లోపు ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోకపోతే అవి పనిచేయబోవంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఉడాయ్ వివరణ ఇచ్చింది. -
5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ఆప్షన్ గురించి తెలుసా?
Railway ticket booking: ట్రైన్ బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా ట్రైన్ టికెట్ బుక్ చేసుకొనే సదుపాయం ఉందని మీకు తెలుసా? అదెలాగంటే..? -
హెచ్చుతగ్గులు తక్కువగా...
ఇండెక్స్ తరగతికి చెందిన ఒక ఓపెన్ ఎండెడ్ పతకాన్ని కోటక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా తీసుకొచ్చింది. కోటక్ నిఫ్టీ 100 లోవోలటైలిటీ 30 ఇండెక్స్ ఫండ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓలో ఈ నెల 31 వరకూ మదుపు చేయొచ్చు. -
రాబడి హామీతో పన్ను ఆదా
నెలకు రూ.6,000 చొప్పున మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 8 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. -
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా తన బ్యాగేజీ పాలసీని మార్చింది. కొత్త రూల్స్ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి.