- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ప్రమాదంలో ఆర్థిక ధీమా
ప్రమాదం జరిగినప్పుడు గాయాలు అవడంతోపాటు, కొన్నిసార్లు శాశ్వత వైకల్యమూ సంభవిస్తుంది. ప్రమాద తీవ్రత అధికంగా ఉంటే మరణించే ఆస్కారమూ ఉంది.
ప్రమాదం జరిగినప్పుడు గాయాలు అవడంతోపాటు, కొన్నిసార్లు శాశ్వత వైకల్యమూ సంభవిస్తుంది. ప్రమాద తీవ్రత అధికంగా ఉంటే మరణించే ఆస్కారమూ ఉంది. ఇలాంటప్పుడు ఎదురయ్యే ఆర్థిక ఒత్తిడి నుంచి కాపాడేది వ్యక్తిగత ప్రమాద బీమా. దీన్ని దృష్టిలో పెట్టుకునే రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. దీని పేరు
రిలయన్స్ పర్సనల్ యాక్సిడెంట్ 360 షీల్డ్. వ్యక్తిగతంగా, కుటుంబం అంతటికీ వర్తించేలా ఈ పాలసీని తీసుకునే వీలుంది. పాలసీదారుడికి అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రి ఖర్చులు, ఔట్ పేషెంట్ ఖర్చులు చెల్లించడంతోపాటు, గృహ, వాహన, విద్య, వ్యక్తిగత రుణాల వంటి వాటికీ కవరేజీ వర్తిస్తుంది. శాశ్వత వైకల్యం సందర్భాల్లో తీవ్రతను బట్టి, పాలసీ మొత్తానికి రెండు రెట్ల వరకూ పరిహారం చెల్లిస్తుంది. కోలుకునే వరకూ ఆదాయాన్ని అందించేలానూ పాలసీని ఎంచుకోవచ్చు. క్లెయిం చేసుకోని ఏడాదిలో క్యుములేటివ్ బోనస్నూ అందిస్తుంది. ప్రయాణ బీమా సౌకర్యాన్నీ ఇదే పాలసీలో పొందవచ్చు. ప్రయాణం రద్దయినప్పుడు రూ.25వేల వరకూ పరిహారం అందిస్తుంది. సాహస క్రీడల్లో గాయపడిన సందర్భంలోనూ పరిహారం అందుకునే ఏర్పాటు ఉంది. ఈ పాలసీని రూ.5 లక్షల నుంచి రూ.25 కోట్ల వరకూ తీసుకునే వీలుంది.
రక్షణ సంస్థల షేర్లలో
రక్షణ రంగంలోని కంపెనీలకు గత కొంతకాలంగా విశేషంగా వృద్ధి అవకాశాలు లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రక్షణ కొనుగోళ్ల విషయంలో దేశీయ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీనికి తోడు ఎగుమతులనూ గణనీయంగా ప్రోత్సహిస్తోంది. దీనివల్ల మన దేశం నుంచి వార్షిక రక్షణ ఎగుమతులు రూ.20,000 కోట్లకు మించిపోవటం గమనార్హం. అంతేగాక వచ్చే అయిదారేళ్లలో రక్షణ ఎగుమతులను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో రక్షణ రంగంలోని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు అధిక ఆదాయాలు, లాభాలు నమోదు చేసే అవకాశం కలుగుతోంది. అందుకే గత కొంతకాలంగా ఈ రంగంలోని కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశమూ కనిపిస్తోంది. ఈ సానుకూలతను పరిగణనలోకి తీసుకొని మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్’ అనే పథకాన్ని ఆవిష్కరించింది. రక్షణ రంగంలోని కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించాలన్నది ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం. ఈ పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 24వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ ఇండియా డిఫెన్స్ టీఆర్ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. స్వప్నిల్ మయేకర్, రాకేష్ షెట్టి ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. మదుపరులు కనీసం అయిదేళ్లపాటు ఇందులో పెట్టుబడిని కొనసాగించగలిగితే అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది.
ఉత్పత్తి పరిశ్రమల్లో
ఉత్పత్తి రంగంలోని కంపెనీలపై పెట్టుబడి పెట్టే వ్యూహంతో బరోడా బీఎన్పీ పారిబస్ మ్యూచువల్ ఫండ్, ఒక నూతన పథకాన్ని ఆవిష్కరించింది. ‘బరోడా బీఎన్పీ పారిబస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 24వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ.1,000. నిఫ్టీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ టీఆర్ఐ సూచీతో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. జితేంద్ర శ్రీరాం దీనికి ఫండ్ మేనేజర్గా వ్యవహరిస్తారు.
సేకరించిన నిధుల్లో కనీసం 80 శాతం ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీలపై పెట్టుబడి పెడతారు. కొంత సొమ్మును రుణ పత్రాలకు, రీట్/ ఇన్విట్లకు కేటాయించే అవకాశం ఉంది. మనదేశంలో ఉత్పత్తి రంగం సమీప భవిష్యత్తులో అత్యంత క్రియాశీలకంగా మారనుంది. ఆటోమొబైల్, రక్షణ ఉత్పత్తులు, నౌకల నిర్మాణం, హెలీకాఫ్టర్లు/ విమానాల విడిభాగాలు, యుద్ధ విమానాలు మనదేశంలో ఉత్పత్తి కావటంతో పాటు వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీలపై పెట్టుబడి అత్యంత లాభాదాయకంగా ఉంటుందని అంచనాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిటర్నులు..ఇవన్నీ తెలుసుకున్నాకే
నిర్దేశించిన పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు.. నిర్ణీత శ్లాబుల్లో పన్ను చెల్లించాలి. నిబంధనల మేరకు ఆదాయపు పన్ను రిటర్నులనూ సమర్పించాలి. అప్పుడే ఆదాయం చట్టబద్ధమైనదిగా గుర్తింపు పొందుతుంది. -
మ్యూచువల్ ఫండ్లు యూనిట్ల లెక్క చూసుకున్నారా?
దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు పెట్టుబడులు పెడుతుంటాం. ఇవన్నీ పూర్తిగా డిజిటల్లోనే ఉంటున్నాయి. -
పెట్టుబడుల్లో ఈ విషయాలు పట్టించుకోవద్దు
స్టాక్ మార్కెట్లు కొత్త జీవన కాలగరిష్ఠాలకు చేరుకున్నాయి. దీంతో చాలామంది పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనతో వస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే మదుపు చేసిన వారు లాభాలను స్వీకరించేందుకు సిద్ధం అవుతున్నారు. -
ఇండెక్సేషన్ అంటే ఏంటి ? ఇది పన్ను భారాన్ని ఎలా తగ్గిస్తుంది?
Indexation: పెట్టుబడులు, కొనుగోలు ధరల విలువ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా తరిగిపోకుండా సర్దుబాటు చేసే పద్ధతే ఇండెక్సేషన్. ఇది పన్ను భారాన్ని ఎలా తగ్గిస్తుందో చూద్దాం..! -
ఆరోగ్య బీమా.. టాపప్ చేస్తున్నారా?
వైద్య ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దీన్ని తట్టుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీ తప్పనిసరిగా మారింది. మరోవైపు అధికంగా ఉన్న ప్రీమియం రేట్లు కలవరపెడుతున్నాయి. -
అత్యవసరంలో ఆదుకునేలా
అత్యవసరం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఈ పరిస్థితికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండటమే మనం చేయాల్సిన పని. ముఖ్యంగా ఆర్థిక అత్యవసరాలు కొన్నిసార్లు మానసికంగా ఆందోళనను కలిగిస్తాయి. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
ఆదాయ పన్ను రిటర్నులు.. మీకు ఏ ఫారం వర్తిస్తుందో తెలుసా?
ITR: పొరపాటున తప్పు ఫారాన్ని ఎంచుకుంటే ఆదాయపు పన్ను శాఖ దానిని ‘డిఫెక్టివ్ రిటర్ను’గా పరిగణించే ప్రమాదం ఉంది. -
మ్యూచువల్ ఫండ్లు మీ ఎంపిక సరైనదేనా?
స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతోమంది మదుపరులు కొత్తగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
ఇంటికి ఇద్దాం.. బీమా రక్ష
కలల ఇంటిని కష్టపడి నిర్మించుకుంటాం. ఇది మనకు అతి పెద్ద పెట్టుబడి. ఇల్లు, ఇంట్లో ఉండే మనం, వస్తువులు సురక్షితంగా ఉండేలా అన్ని భద్రతా చర్యలూ తీసుకుంటాం. -
50 షేర్లలో పెట్టుబడి..
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక క్వాంట్ ఫండ్ను ఆవిష్కరించింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ క్వాంట్ ఫండ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 24 వరకూ అందుబాటులో ఉంటుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
3, 5, 10 సంవత్సరాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇక్కడ ఉన్నాయి. -
గృహ రుణ దరఖాస్తుదారులూ... ఈ విషయాలు తెలుసుకోండి..
చాలా మంది వ్యక్తులు హోమ్ లోన్ ద్వారా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రుణాన్ని తీసుకునే వారు ఏయే విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. -
తెలుసుకుంటే.. ఆస్తి మీ వెంటే!
ఏ ఆస్తి అయినా కొనే ముందు మనం చూడాల్సిన మొట్ట మొదటి విషయం ఏంటంటే అమ్మే వారికి ఉన్న హక్కులు ఏంటని. ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
ITR filing: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం.. -
పదవీ విరమణ ప్రశాంతంగా సాగాలంటే
పదవీ విరమణ.. ఎన్నో ఏళ్ల ఉద్యోగ జీవితం తర్వాత విశ్రాంతంగా ఉండే సమయం. ఈ కాలంలో ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉండగలం. దీనికోసం ఆర్జిస్తున్న సమయంలోనే కచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలి -
ఇంటి రుణం తొందరగా తీర్చేద్దాం
సొంతిల్లు.. ఎంతో మంది కల. అత్యంత ఖరీదైన పెట్టుబడుల్లో ఒకటి. దీన్ని నిజం చేసుకునే క్రమంలో గృహరుణం చాలామందికి తప్పనిసరి. కొంత కాలంగా రెపో రేటు స్థిరంగా ఉన్నప్పటికీ, బ్యాంకులు గృహరుణ వడ్డీ రేటును సవరిస్తూ ఉన్నాయి. -
వివిధ లార్జ్ క్యాప్ ఫండ్లపై రాబడులివే..
3, 5, 10 సంవత్సరాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇక్కడ ఉన్నాయి. -
చిన్నారుల కలలు నిజం అయ్యేలా..
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. పిల్లలకు బడిలో చేరింది మొదలు.. ఉన్నత విద్య వరకూ అంతా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఆర్థికంగా ఇదొక సవాలు లాంటిదే. చిన్నారులు వృద్ధిలోకి రావడానికి తల్లిదండ్రులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. -
మ్యూచువల్ ఫండ్లు మదుపు మార్గంలో వైవిధ్యంగా
కష్టపడి సంపాదించిన సొమ్మును స్టాక్ మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్నారా? నేరుగా షేర్లు కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేను మునుపటిలా లేను కానీ..: డిబేట్లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?
-
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ