- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
మహిళా పారిశ్రామికవేత్తతో ఈఈఎస్ఎల్ ఒప్పందం
విద్యుత్తు ఆదా చేసే సాధనాల వినియోగంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త పద్మ వథ్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్తు ఆదా చేసే సాధనాల వినియోగంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త పద్మ వథ్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు పొదుపు చేసే ఉపకరణాలను ప్రజలకు పెద్దఎత్తున అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన రిటైల్ విక్రయ కేంద్రాలను పద్మ వథ్యా ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు ఎస్కే ఎలక్ట్రికల్స్ అనే సంస్థతో కూడా ఈఈఎస్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. స్వయం సహాయక బృందం (సెల్ఫ్ హెల్ప్ గ్రూపు) నాయకురాలైన పద్మ వథ్యా దాదాపు 100 మంది మహిళలతో హైదరాబాద్లో విద్యుత్తు దీపాల వ్యవస్థను నిర్వహిస్తున్నారు. ఆమె దేశవ్యాప్తంగా ఈఈఎస్ఎల్తో జట్టుకట్టిన తొలి మహిళా పారిశ్రామికవేత్త కావడం ప్రత్యేకత.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుల్ను మించిన బంగారం
ప్రస్తుత సంవత్సరం తొలి అర్ధభాగంలో అటు స్టాక్ మార్కెట్, ఇటు బంగారం సానుకూలతలనే అందించాయి. ఈ రెండింటిలో పెట్టుబడి పెట్టిన మదుపర్లకు మంచి లాభాలే వచ్చాయి. -
జీఎస్టీని 5 శాతం చేయండి
దేశంలో 2047 నాటికి అందరికీ బీమా అందించాలనే లక్ష్యాన్ని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) విధించుకుంది. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. -
501 ఒప్పందాలు.. 21.4 బి.డాలర్లు
ప్రస్తుత ఏడాది రెండో త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో భారత కార్పొరేట్లు మొత్తం 501 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. -
గృహ పథకానికి రూ.55,000 కోట్ల సబ్సిడీ!
-
భారత స్థిరాస్తిలోకి రూ.25,700 కోట్ల విదేశీ పెట్టుబడులు
ఈ ఏడాది జనవరి- జూన్ మధ్య భారత స్థిరాస్తి రంగంలో, విదేశీ పెట్టుబడిదారులు 3.1 బి.డాలర్ల (రూ.25,700 కోట్లు) పెట్టుబడులు పెట్టినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది. -
ఎఫ్ఎంసీజీ ఆదాయ వృద్ధి 7-9%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఎఫ్ఎంసీజీ రంగ ఆదాయ వృద్ధి 7-9 శాతం మధ్య నమోదు కావొచ్చని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. -
గూగుల్ మ్యాప్స్ నుంచి ఓలా నిష్క్రమణ
ఓలాలో క్యాబ్/ఆటో/బైక్ బుక్ చేసుకుంటే.. గమ్యస్థానాన్ని చేరే మార్గం, సమయం తదితరాలు మ్యాప్ రూపంలో మనకు కనిపిస్తుంటాయి. -
బంధన్ బ్యాంక్ తాత్కాలిక ఎండీ, సీఈఓగా రతన్ కుమార్ కేశ్
బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రతన్ కుమార్ కేశ్ తాత్కాలిక ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
ప్యాకేజ్డ్ ఆహార వస్తువులపై సమాచారం పెద్ద అక్షరాల్లో..
ప్యాకేజ్డ్ ఆహార వస్తువులపై ముద్రించే పోషక సమాచారంలో మార్పులు చేయడానికి ఆహార నియంత్రణాధికార సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) శనివారం ఆమోదం తెలిపింది. -
సంక్షిప్తవార్తలు(5)
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ చర్యల నుంచి పాఠం నేర్చుకున్నట్లు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
భారమనుకుని నేలకేసి బాది.. ఏడాదిన్నర పసివాడిని పొట్టన పెట్టుకున్న కర్కశుడు
-
రూ.కోటి విలువచేసే ఫ్లాటు.. ఆడీ కారు.. పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
-
వయసు 57.. సెంచరీలు 1000
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..