- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
జీఎస్టీ ఆదాయంలో కేంద్రం భారీ త్యాగం
జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి, రాష్ట్రాలకు పరిహారం చెల్లించడం కోసం జీఎస్టీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కేంద్రప్రభుత్వం త్యాగం చేయాల్సి వచ్చిందని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు.
రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకే: మాజీ సీఈఏ
దిల్లీ: జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి, రాష్ట్రాలకు పరిహారం చెల్లించడం కోసం జీఎస్టీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కేంద్రప్రభుత్వం త్యాగం చేయాల్సి వచ్చిందని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు. గత ఏడేళ్లుగా ఏటా జీఎస్టీ ఆదాయంలో, జీడీపీలో 0.5- 1 శాతానికి సమానమైన మొత్తాన్ని కేంద్రం కోల్పోయిందని అన్నారు. పెట్రో ఉత్పత్తులు, మద్యాన్ని జీఎస్టీ విధానంలోకి తెచ్చేందుకు ఇది సరైన సమయం కాదని సలహా ఇచ్చారు. జీఎస్టీ విధానం అమలు ప్రక్రియలో సుబ్రమణియన్ కూడా కీలక పాత్ర పోషించారు. పరోక్ష విధానంలోని 17 పన్నులు, 13 సెస్సులను విలీనం చేస్తూ 2017 జులై 1న జీఎస్టీ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తద్వారా పరోక్ష పన్నుల విధానాన్ని సులభతరం చేసింది. సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ ప్రోగ్రెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుబ్రమణియన్ మాట్లాడుతూ.. సమాఖ్య వ్యవస్థకు ప్రతిబింబంగా జీఎస్టీ విధానం నిలిచిందని అన్నారు. పేద రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరాలనే లక్ష్యానికి అనుగుణంగా చాలా వరకు జీఎస్టీ విధానం పనిచేసిందని తెలిపారు. జీఎస్టీ విధానం ప్రవేశపెట్టే ముందు ఉన్న పన్ను ఆదాయం స్థాయికి, ప్రస్తుతం జీఎస్టీ ఆదాయాలు చేరాయనే విషయాన్ని గుర్తు చేశారు. పన్ను రేట్లు తగ్గించినప్పటికీ వసూళ్లలో వృద్ధి కనిపిస్తోందని అన్నారు. జీఎస్టీ విధానంలో సంస్కరణలు అవసరమైనప్పటికీ.. వాటిని చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉండకపోవచ్చని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుల్ను మించిన బంగారం
ప్రస్తుత సంవత్సరం తొలి అర్ధభాగంలో అటు స్టాక్ మార్కెట్, ఇటు బంగారం సానుకూలతలనే అందించాయి. ఈ రెండింటిలో పెట్టుబడి పెట్టిన మదుపర్లకు మంచి లాభాలే వచ్చాయి. -
జీఎస్టీని 5 శాతం చేయండి
దేశంలో 2047 నాటికి అందరికీ బీమా అందించాలనే లక్ష్యాన్ని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) విధించుకుంది. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. -
501 ఒప్పందాలు.. 21.4 బి.డాలర్లు
ప్రస్తుత ఏడాది రెండో త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో భారత కార్పొరేట్లు మొత్తం 501 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. -
గృహ పథకానికి రూ.55,000 కోట్ల సబ్సిడీ!
-
భారత స్థిరాస్తిలోకి రూ.25,700 కోట్ల విదేశీ పెట్టుబడులు
ఈ ఏడాది జనవరి- జూన్ మధ్య భారత స్థిరాస్తి రంగంలో, విదేశీ పెట్టుబడిదారులు 3.1 బి.డాలర్ల (రూ.25,700 కోట్లు) పెట్టుబడులు పెట్టినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది. -
ఎఫ్ఎంసీజీ ఆదాయ వృద్ధి 7-9%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఎఫ్ఎంసీజీ రంగ ఆదాయ వృద్ధి 7-9 శాతం మధ్య నమోదు కావొచ్చని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. -
గూగుల్ మ్యాప్స్ నుంచి ఓలా నిష్క్రమణ
ఓలాలో క్యాబ్/ఆటో/బైక్ బుక్ చేసుకుంటే.. గమ్యస్థానాన్ని చేరే మార్గం, సమయం తదితరాలు మ్యాప్ రూపంలో మనకు కనిపిస్తుంటాయి. -
బంధన్ బ్యాంక్ తాత్కాలిక ఎండీ, సీఈఓగా రతన్ కుమార్ కేశ్
బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రతన్ కుమార్ కేశ్ తాత్కాలిక ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
ప్యాకేజ్డ్ ఆహార వస్తువులపై సమాచారం పెద్ద అక్షరాల్లో..
ప్యాకేజ్డ్ ఆహార వస్తువులపై ముద్రించే పోషక సమాచారంలో మార్పులు చేయడానికి ఆహార నియంత్రణాధికార సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) శనివారం ఆమోదం తెలిపింది. -
సంక్షిప్తవార్తలు(5)
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ చర్యల నుంచి పాఠం నేర్చుకున్నట్లు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
-
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
-
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం
-
పూరీ జగన్నాథుని రత్న భాండాగారంపై 9వ తేదీన నిర్ణయం
-
జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ