- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
పెట్టుబడుల ఉపసంహరణ భారీ స్థాయిలో లేనట్లే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2.1 లక్షల కోట్ల డివిడెండును కేంద్రానికి ఇవ్వడంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో భారీ స్థాయి పెట్టుబడుల ఉపసంహరణలు ఉండకపోవచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ కేర్ రేటింగ్స్ అంచనా వేస్తోంది.
ఆర్బీఐ డివిడెండు నేపథ్యం
కేర్ రేటింగ్స్ అంచనా
ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2.1 లక్షల కోట్ల డివిడెండును కేంద్రానికి ఇవ్వడంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో భారీ స్థాయి పెట్టుబడుల ఉపసంహరణలు ఉండకపోవచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ కేర్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని బడ్జెట్లో కేంద్రం రూ.50,000 కోట్లుగానే కొనసాగించొచ్చని అంటోంది. ఆర్బీఐ నుంచి భారీ డివిడెండు లభించడంతో, కేంద్రప్రభుత్వ ద్రవ్య పరిస్థితి సౌకర్యవంతంగా ఉండటమే ఇందుకు నేపథ్యం. ఒక వేళ నిధుల కొరత ఏర్పడితే, ప్రభుత్వం ఆస్తుల నగదీకరణకు మొగ్గుచూపొచ్చని అంటోంది.
ఈ సంస్థల్లో వాటా విక్రయాలకు అవకాశం: ‘షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ)లో వాటా విక్రయం ఈ ఏడాది పూర్తి కావొచ్చు. సానుకూల మార్కెట్ పరిస్థితులు కలిసిరావొచ్చు. ఎస్సీఐలో కేంద్రం తన మొత్తం వాటా విక్రయిస్తే రూ.12,500-22,500 కోట్లు సమీకరించడానికి అవకాశం ఉంది.
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(కాన్కర్), పవన్ హన్స్ సంస్థల్లో వాటా విక్రయాలనూ ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంద’ని కేర్ రేటింగ్స్ భావిస్తోంది.
గత పదేళ్లలో: గత 10 ఏళ్లలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.5.2 లక్షల కోట్లను కేంద్రం సమీకరించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో తన వాటా 51% కంటే కిందకు వెళ్లకుండానే అంటే మెజారిటీ వాటా అట్టేపెట్టి ఉంచుకుంటూనే.. మరో రూ.11.5 లక్షల కోట్లను ప్రభుత్వం సమీకరించేందుకు అవకాశం ఉందని కేర్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా రూ.5 లక్షల కోట్లు; బీమా కంపెనీలు, బ్యాంకుల్లో వాటాల అమ్మకాల ద్వారా ఇంకో రూ.6.5 లక్షల కోట్ల సమీకరణకు వీలుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుల్ను మించిన బంగారం
ప్రస్తుత సంవత్సరం తొలి అర్ధభాగంలో అటు స్టాక్ మార్కెట్, ఇటు బంగారం సానుకూలతలనే అందించాయి. ఈ రెండింటిలో పెట్టుబడి పెట్టిన మదుపర్లకు మంచి లాభాలే వచ్చాయి. -
జీఎస్టీని 5 శాతం చేయండి
దేశంలో 2047 నాటికి అందరికీ బీమా అందించాలనే లక్ష్యాన్ని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) విధించుకుంది. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. -
501 ఒప్పందాలు.. 21.4 బి.డాలర్లు
ప్రస్తుత ఏడాది రెండో త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో భారత కార్పొరేట్లు మొత్తం 501 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. -
గృహ పథకానికి రూ.55,000 కోట్ల సబ్సిడీ!
-
భారత స్థిరాస్తిలోకి రూ.25,700 కోట్ల విదేశీ పెట్టుబడులు
ఈ ఏడాది జనవరి- జూన్ మధ్య భారత స్థిరాస్తి రంగంలో, విదేశీ పెట్టుబడిదారులు 3.1 బి.డాలర్ల (రూ.25,700 కోట్లు) పెట్టుబడులు పెట్టినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది. -
ఎఫ్ఎంసీజీ ఆదాయ వృద్ధి 7-9%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఎఫ్ఎంసీజీ రంగ ఆదాయ వృద్ధి 7-9 శాతం మధ్య నమోదు కావొచ్చని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. -
గూగుల్ మ్యాప్స్ నుంచి ఓలా నిష్క్రమణ
ఓలాలో క్యాబ్/ఆటో/బైక్ బుక్ చేసుకుంటే.. గమ్యస్థానాన్ని చేరే మార్గం, సమయం తదితరాలు మ్యాప్ రూపంలో మనకు కనిపిస్తుంటాయి. -
బంధన్ బ్యాంక్ తాత్కాలిక ఎండీ, సీఈఓగా రతన్ కుమార్ కేశ్
బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రతన్ కుమార్ కేశ్ తాత్కాలిక ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
ప్యాకేజ్డ్ ఆహార వస్తువులపై సమాచారం పెద్ద అక్షరాల్లో..
ప్యాకేజ్డ్ ఆహార వస్తువులపై ముద్రించే పోషక సమాచారంలో మార్పులు చేయడానికి ఆహార నియంత్రణాధికార సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) శనివారం ఆమోదం తెలిపింది. -
సంక్షిప్తవార్తలు(5)
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ చర్యల నుంచి పాఠం నేర్చుకున్నట్లు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
-
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు