- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
రూ.10 లక్షల కోట్లకు ఆహార సేవల విపణి
దేశీయంగా ఆహార సేవల విపణి 2030 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని బెయిన్ అండ్ కంపెనీ, స్విగ్గీ సంయుక్త నివేదిక వెల్లడించింది. వినియోగదార్ల సంఖ్య అప్పటికి 45 కోట్ల వరకు చేరొచ్చని అంచనా వేసింది.
2030 నాటికి చేరే అవకాశం
బెయిన్ అండ్ కంపెనీ - స్విగ్గీ నివేదిక
దిల్లీ: దేశీయంగా ఆహార సేవల విపణి 2030 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని బెయిన్ అండ్ కంపెనీ, స్విగ్గీ సంయుక్త నివేదిక వెల్లడించింది. వినియోగదార్ల సంఖ్య అప్పటికి 45 కోట్ల వరకు చేరొచ్చని అంచనా వేసింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ విభాగం 18% వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్) సాధించొచ్చని తెలిపింది. 2023లో ఈ విభాగం వాటా 12% ఉండగా, 2030 నాటికి 20 శాతానికి చేరొచ్చని పేర్కొంది. ‘హౌ ఇండియా ఈట్స్’ పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం..
- భారత్లో ఆహార సేవల విపణి ప్రస్తుతం రూ.5.5 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. వచ్చే ఏడేళ్లు వార్షికంగా 10-12% వృద్ధితో సాగి, 2030 నాటికి రూ.9-10 లక్షల కోట్లకు చేరొచ్చు.
- ఈ వృద్ధికి బలమైన మూలాలతో పాటు వినియోగదార్ల సంఖ్య పెరగడం, వినియోగం పెరిగే సందర్భాలు, సరఫరాలో వృద్ధి వంటివి దోహదం చేస్తాయి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ విభాగం మరింత వేగంగా సుమారు 18% వార్షిక వృద్ధితో సాగనుంది. 2030 నాటికి మొత్తం ఆహార సేవల విపణిలో దీని వాటా 20 శాతానికి చేరుతుంది.
- భారతీయ ఆహార సేవల విపణిలో ప్రస్తుతం 32-34 కోట్ల మంది వినియోగదార్లు ఉండగా, 2030 నాటికి ఈ సంఖ్య మరో 11 కోట్లు పెరిగి 43-45 కోట్లకు చేరే అవకాశం ఉంది.
- ఆహార సేవల వినియోగంలో 70% వాటా అగ్రగామి -50 నగరాల నుంచే వస్తోంది.. ఎగువ మధ్య తరగతి, అధికాదాయ ప్రజల నుంచి మధ్య కాలానికి ఈ సేవలకు అధిక గిరాకీ లభించొచ్చు. ద్వితీయ శ్రేణి నగరాల నుంచీ వృద్ధి నమోదు కావొచ్చు.
- 2019 నుంచి 2023 వరకు చూస్తే, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ విభాగ వాటా 8 నుంచి 12 శాతానికి పెరిగింది. మొత్తం ఆహార సేవల్లో ఈ విభాగం వాటా 2.8 రెట్లు పెరిగింది.
- భారతీయ ఆహార సేవల విపణిలో ముఖ్యంగా ఆహార పదార్థాల సరఫరాలో కొన్నేళ్లుగా గణనీయ వృద్ధి చూస్తున్నామని స్విగ్గీ ఫుడ్ మార్కెట్ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ వెల్లడించారు. అధిక ఆదాయాలు, డిజిటలీకరణ, మెరుగైన ఖాతాదారు అనుభవం, కొత్త రుచుల్ని ప్రయత్నించాలనే కోరిక వంటివి ఈ వృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో.. రూ.55,000 కోట్ల ఐపీఓ?
రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్ జియోను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఉక్కు నిర్మాణాలను ప్రోత్సహించాలి
మౌలిక వసతుల పరంగా తెలుగు రాష్ట్రాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నందున, ఇక్కడ ఉక్కు ఆధారిత నిర్మాణాలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా సూచించారు. -
కార్ల రిటైల్ అమ్మకాలకు వడదెబ్బ
భారత్లో ప్రయాణికుల వాహనాల (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) రిటైల్ విక్రయాలు జూన్లో నెమ్మదించాయి. -
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక వెనక చైనా హస్తం?
అదానీ గ్రూప్ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణలు చేసిన ఉదంతం కొత్త మలుపులు తీసుకుంటోంది. -
సెన్సెక్స్కు స్వల్ప నష్టాలు
గరిష్ఠ స్థాయుల్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్, స్వల్ప నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ మాత్రం తాజా రికార్డు గరిష్ఠానికి చేరింది. -
త్వరలో భారత్లో షియోమీ విద్యుత్ కారు ఎస్యూ7 ప్రదర్శన!
భారత విద్యుత్ వాహన (ఈవీ) విపణిలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై చైనా మొబైల్, విద్యుత్తు వాహన సంస్థ షియోమీ దృష్టి సారిస్తోంది. -
వంట పాత్రలకూ ఐఎస్ఐ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
వంటకు ఉపయోగించే అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకూ ఇక నుంచి ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) ముద్రను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్
సీఎన్జీ ఇంధనంగా వినియోగించే మోటార్సైకిల్ను ప్రపంచంలోనే తొలిసారిగా బజాజ్ ఆటో ఆవిష్కరించింది. -
డీమ్యాట్ ఖాతాలు 16.2 కోట్లు
ఈ ఏడాది జూన్ చివరకు డీమ్యాట్ ఖాతాల సంఖ్య 16.2 కోట్లకు చేరినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ తెలిపాయి. -
శాకాహార భోజన ఖర్చు 10% అధికం
శాకాహార భోజనం (వెజ్ థాలి) సగటు ధర జూన్లో 10% పెరిగిందని క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. -
ఎమ్ఎస్ఎమ్ఈ రుణాల్లో 7 శాతమే మహిళలకు
సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎమ్ఎస్ఎమ్ఈ)లకు ఇచ్చిన మొత్తం రుణాల్లో కేవలం 7 శాతమే మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు వెళ్లాయని రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) నీరజ్ నిగమ్ పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (2)
వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వచ్చిన వార్తలను టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ శుక్రవారం కొట్టిపారేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
Jio OTT plans: జియో సంస్థ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను తగ్గించేసింది. 21 నుంచి ఏడుకు కుదించింది.