- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
దేశంలో పేదరికం తగ్గింది!
దేశంలో పేదరికం తగ్గిందని ఆర్థిక మేధో సంస్థ ఎన్సీఏఈఆర్ విడుదల చేసిన అధ్యయన పత్రంలో వెల్లడించింది. 2011-12లో దేశంలో 21.2% పేదరికం ఉండగా, 2022-24 మధ్య 8.5 శాతానికి పరిమితమైందని పేర్కొంది.
2011-12లో 21.2% కాగా 2022-24లో 8.5 శాతమే
ఆర్థిక మేధో సంస్థ ఎన్సీఏఈఆర్
దిల్లీ: దేశంలో పేదరికం తగ్గిందని ఆర్థిక మేధో సంస్థ ఎన్సీఏఈఆర్ విడుదల చేసిన అధ్యయన పత్రంలో వెల్లడించింది. 2011-12లో దేశంలో 21.2% పేదరికం ఉండగా, 2022-24 మధ్య 8.5 శాతానికి పరిమితమైందని పేర్కొంది. కొవిడ్ వంటి ఊహించని పరిణామాలు ఎదురైనా, ఆ సవాళ్లను తట్టుకుని దేశం ప్రగతి పథంలో ముందుకెళుతోందని తెలిపింది. ‘రీ థింకింగ్ సోషల్ సేఫ్టీ నెట్స్ ఇన్ ఎ ఛేంజింగ్ సొసైటీ’ పేరుతో ఎన్సీఏఈఆర్ ఈ పత్రాన్ని విడుదల చేసింది. సోనాల్డే దేశాయ్ ఈ పత్రాన్ని రూపొందించారు. ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే (ఐహెచ్డీఎస్) ఇటీవల పూర్తి చేసిన వేవ్ 3తో పాటు గతంలోని వేవ్ 1, 2 డేటాను ఈ పత్రం రూపొందించేందుకు వినియోగించుకున్నారు.
- ఐహెచ్డీఎస్ గుర్తించిన దాని ప్రకారం, 2004-05లో దేశంలో పేదరికం 38.6 శాతంగా ఉండగా, 2011-12 నాటికి 21.2 శాతానికి తగ్గింది. ఒకవైపు కొవిడ్ సవాళ్లు ఎదురైనా 2011-12 నుంచి 2022-24 నాటికి 8.5 శాతానికి పరిమితమైంది.
- ఈ ఏడాది ప్రారంభంలో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యమ్ కూడా వినియోగదారు వ్యయ సర్వే ప్రకారం, దేశంలో పేదరికం 5 శాతం వరకు తగ్గి ఉంటుందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు సుభిక్షంగా మారుతున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే.
- నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) ప్రకారం, కుటుంబ వినియోగ వ్యయం 2011-12తో పోలిస్తే 2022-23లో రెట్టింపునకు పైగా పెరిగింది.
- తెందూల్కర్ కమిటీ నివేదిక ప్రకారం, దారిద్య్ర రేఖ అనేది గ్రామీణ ప్రాంతాల్లో రూ.447గా, పట్టణ ప్రాంతాల్లో రూ.579గా నిర్ణయించారు. 2004-05 మధ్య దీన్ని రాష్ట్రాల వారీగా మార్చారు. 2011-12 నాటికి ప్రణాళికా సంఘం వీటిని రూ.860, రూ.1,000కి సర్దుబాటు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో.. రూ.55,000 కోట్ల ఐపీఓ?
రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్ జియోను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఉక్కు నిర్మాణాలను ప్రోత్సహించాలి
మౌలిక వసతుల పరంగా తెలుగు రాష్ట్రాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నందున, ఇక్కడ ఉక్కు ఆధారిత నిర్మాణాలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా సూచించారు. -
కార్ల రిటైల్ అమ్మకాలకు వడదెబ్బ
భారత్లో ప్రయాణికుల వాహనాల (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) రిటైల్ విక్రయాలు జూన్లో నెమ్మదించాయి. -
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక వెనక చైనా హస్తం?
అదానీ గ్రూప్ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణలు చేసిన ఉదంతం కొత్త మలుపులు తీసుకుంటోంది. -
సెన్సెక్స్కు స్వల్ప నష్టాలు
గరిష్ఠ స్థాయుల్లో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్, స్వల్ప నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ మాత్రం తాజా రికార్డు గరిష్ఠానికి చేరింది. -
త్వరలో భారత్లో షియోమీ విద్యుత్ కారు ఎస్యూ7 ప్రదర్శన!
భారత విద్యుత్ వాహన (ఈవీ) విపణిలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై చైనా మొబైల్, విద్యుత్తు వాహన సంస్థ షియోమీ దృష్టి సారిస్తోంది. -
వంట పాత్రలకూ ఐఎస్ఐ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
వంటకు ఉపయోగించే అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకూ ఇక నుంచి ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) ముద్రను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్
సీఎన్జీ ఇంధనంగా వినియోగించే మోటార్సైకిల్ను ప్రపంచంలోనే తొలిసారిగా బజాజ్ ఆటో ఆవిష్కరించింది. -
డీమ్యాట్ ఖాతాలు 16.2 కోట్లు
ఈ ఏడాది జూన్ చివరకు డీమ్యాట్ ఖాతాల సంఖ్య 16.2 కోట్లకు చేరినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ తెలిపాయి. -
శాకాహార భోజన ఖర్చు 10% అధికం
శాకాహార భోజనం (వెజ్ థాలి) సగటు ధర జూన్లో 10% పెరిగిందని క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. -
ఎమ్ఎస్ఎమ్ఈ రుణాల్లో 7 శాతమే మహిళలకు
సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎమ్ఎస్ఎమ్ఈ)లకు ఇచ్చిన మొత్తం రుణాల్లో కేవలం 7 శాతమే మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు వెళ్లాయని రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) నీరజ్ నిగమ్ పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (2)
వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వచ్చిన వార్తలను టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ శుక్రవారం కొట్టిపారేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
Jio OTT plans: జియో సంస్థ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను తగ్గించేసింది. 21 నుంచి ఏడుకు కుదించింది.