- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
రిలయన్స్ మార్కెట్ విలువకు మరో 100 బి. డాలర్లు జత!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ మరో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) మేర పెరగనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది.
మోర్గాన్ స్టాన్లీ అంచనా
దిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ మరో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) మేర పెరగనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది. గత మూడు దశాబ్దాల్లో రిలయన్స్ తన నగదీకరణ దశల్లో 2-3 రెట్ల విలువను వాటాదార్లకు అందించింది. ప్రతి దశాబ్దంలో 60 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను జత చేసింది. ‘ప్రస్తుతం రిలయన్స్ ఉన్న నాలుగో నగదీకరణ దశ భిన్నమైనది. కొత్త వ్యాపారాల్లోకి అడుపెట్టడం, దేశీయ గిరాకీ, తక్కువ పోటీ వంటివి దీనికి మద్దతుగా నిలవనున్నాయి. నాలుగో నగదీకరణ దశలో 100 బిలియన్ డాలర్ల వరకు మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉంద’ని పేర్కొంది. తన వ్యాపార ప్రణాళికలను ప్రకటించినపుడల్లా, పెట్టుబడిదార్ల అంచనాలకు మించి వాటిని సాధించడంతో రిలయన్స్ మార్కెట్ విలువ భారీగా పెరుగుతోందని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషించింది. 1990ల తర్వాత రిలయన్స్ ‘అతి తక్కువ పెట్టుబడి సమయం’ ఏదైనా ఉందంటే 2021-23 నాటి 60 బిలియన్ డాలర్ల పెట్టుబడులేనని ఆ బ్రోకరేజీ గుర్తు చేసింది. ‘కొత్త ఇంధనం, రిటైల్ విస్తరణ వల్ల సంస్థాగతేతర రంగం నుంచి మార్కెట్ వాటాను రిలయన్స్ తీసుకోగలిగింది. ప్రస్తుత ఇంధన వ్యాపారాల రూపు మారుస్తుండడంతో, మూడేళ్ల తర్వాత కూడా స్థిరంగా ఆదాయాలను రిలయన్స్ అందిస్తుంది. ఆ సమయంలో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్(ఆర్ఓసీఈ) 10% పైన ఉండొచ్చు. ఈ నేపథ్యంలో 2023-24 నుంచి 2025-26 వరకు కంపెనీ ఏటా 12% సమ్మిళిత వృద్ధి రేటు(సీఏజీఆర్)ను నమోదు చేయగలద’ని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తోంది. సోమవారం నాటి షేరు ధర ప్రకారం.. రిలయన్స్ మార్కెట్ విలువ రూ.20.63 లక్షల కోట్లుగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెన్సెక్స్ రికార్డు పరుగు
బీఎస్ఈ సెన్సెక్స్ చరిత్రలో బుధవారం మరో చిరస్మరణీయ రోజు. సూచీ తొలిసారిగా 80,000 పాయింట్ల శిఖరాన్ని సునాయాసంగా అధిరోహించింది. 70000 పాయింట్ల నుంచి 80,000 పాయింట్లకు 7 నెలల్లోపే (138 ట్రేడింగ్ రోజులు) దూసుకెళ్లడం విశేషం. -
హైదరాబాద్లో 40% పెరిగిన కార్యాలయాల అద్దె లావాదేవీలు
అంతర్జాతీయ సంస్థలతో పాటు, దేశీయ కంపెనీలూ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడంతో, హైదరాబాద్లో కార్యాలయాల స్థలానికి గిరాకీ పెరిగింది. -
అధునాతన సాంకేతికతపై రూ.230 కోట్ల పెట్టుబడులు
అధిక నాణ్యత ఉన్న గాజు ప్యాకేజింగ్ ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని, అందుకు తగ్గట్లుగా సిద్ధం అయ్యేందుకు రూ.230 కోట్ల వ్యూహాత్మక పెట్టుబడులు పెడుతున్నట్లు ఏజీఐ గ్రీన్ప్యాక్ వెల్లడించింది. -
ప్రాయోజిత గ్రూపు సంస్థల షేర్లలో 25% మించి పెట్టుబడులు పెట్టొచ్చు
ప్రాయోజిత సంస్థ (స్పాన్సర్స్)కు చెందిన గ్రూపు కంపెనీల షేర్లలో 25 శాతానికి మించి పెట్టుబడులు పెట్టేందుకు ప్యాసివ్ ఫండ్స్కు సెబీ అనుమతినిచ్చింది. ఈ మేరకు మ్యూచువల్ ఫండ్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. -
‘కూ’త ఆగింది
దేశీయ సామాజిక మాధ్యమం ‘కూ’ మూతపడింది. ట్విటర్ (ప్రస్తుత ఎక్స్)కు పోటీగా, ప్రత్యామ్నాయంగా వచ్చామని తొలినాళ్లలో చెప్పుకున్న కూ ఇక పనిచేయదు. -
పటిష్ఠంగా నష్ట నియంత్రణ వ్యవస్థలు
పాలనా ప్రమాణాలను మెరుగుపర్చుకోవడంతో పాటు నష్ట నియంత్రణ వ్యవస్థలు, విధానాలను పటిష్ఠం చేసుకోవాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నరు శక్తికాంత దాస్ సూచించారు. -
రూ.10 లక్షల కోట్లకు ఆహార సేవల విపణి
దేశీయంగా ఆహార సేవల విపణి 2030 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని బెయిన్ అండ్ కంపెనీ, స్విగ్గీ సంయుక్త నివేదిక వెల్లడించింది. వినియోగదార్ల సంఖ్య అప్పటికి 45 కోట్ల వరకు చేరొచ్చని అంచనా వేసింది. -
గేమ్ డెవలప్మెంట్లో కృత్రిమ మేధ
సొంతంగా మొబైల్, ఆన్లైన్ గేములు ఆవిష్కరించే సంస్థ అయిన 7సీస్ ఎంటర్టైన్మెంట్, ఇకపై గేమ్ డెవలప్మెంట్లో ఏఐ (కృత్రిమ మేధ) ని విస్తృతంగా వినియోగించనుంది. -
ఇంటి వద్దా ఆరోగ్య సేవలు: స్టార్ హెల్త్
ఇంటి వద్దకే ఆరోగ్య సంరక్షణ సేవలను, తమ పాలసీదార్లకు అందించడాన్ని బీమా కంపెనీ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ బుధవారం ప్రారంభించింది. -
దేశంలో పేదరికం తగ్గింది!
దేశంలో పేదరికం తగ్గిందని ఆర్థిక మేధో సంస్థ ఎన్సీఏఈఆర్ విడుదల చేసిన అధ్యయన పత్రంలో వెల్లడించింది. 2011-12లో దేశంలో 21.2% పేదరికం ఉండగా, 2022-24 మధ్య 8.5 శాతానికి పరిమితమైందని పేర్కొంది. -
ద్రవ్యలోటు 4 శాతమైతే రెండేళ్లలో రేటింగ్ పెంపు!
అప్పుల నిర్వహణ సరిగ్గా ఉండి, ద్రవ్యలోటును జీడీపీలో 4 శాతానికి తీసుకొస్తే, వచ్చే 24 నెలల్లో భారత రేటింగ్ పెంపునకు అవకాశాలు ఉంటాయని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టరు ఈఫార్న్ ఫ్యూహా వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు(5)
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆఫీసు స్థలానికి అనూహ్య గిరాకీ లభిస్తోందని స్థిరాస్తి కన్సల్టింగ్ సేవల సంస్థ జేఎల్ఎల్ ఇండియా తాజా నివేదికలో పేర్కొంది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..