- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
77400- 78000 పాయింట్ల శ్రేణి కీలకం!
దేశీయ గణాంకాలు, అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం మార్కెట్లు జీవనకాల తాజా గరిష్ఠాలను అధిరోహించాయి. ఎఫ్ఐఐ, డీఐఐ కొనుగోళ్లు ఇందుకు అండగా నిలిచాయి.
సమీక్ష: దేశీయ గణాంకాలు, అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం మార్కెట్లు జీవనకాల తాజా గరిష్ఠాలను అధిరోహించాయి. ఎఫ్ఐఐ, డీఐఐ కొనుగోళ్లు ఇందుకు అండగా నిలిచాయి. దేశీయంగా చూస్తే.. జూన్లో హెచ్ఎస్బీసీ కాంపోజిట్ పీఎంఐ 60.9కు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం జనవరి- మార్చి త్రైమాసికంలో భారత్ 5.7 బిలియన్ డాలర్ల కరెంటు ఖాతా మిగులును సాధించింది. గత 10 త్రైమాసికాల్లో మిగులు సాధించడం ఇదే మొదటిసారి. జేపీ మోర్గాన్ గవర్నమెంట్ బాండ్ ఇండెక్స్లో భారత ప్రభుత్వ బాండ్లను చేర్చారు. దీంతో దేశీయ ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. కార్పొరేట్ వార్తలు, ప్రభుత్వ ప్రకటనలతో షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. బ్యారెల్ ముడిచమురు ధర 1.4% లాభంతో 86.4 డాలర్లకు చేరింది. భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడం ఇందుకు నేపథ్యం. డాలర్తో పోలిస్తే రూపాయి 83.57 నుంచి 83.34కు బలపడింది. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా మొదటి త్రైమాసిక జీడీపీని 1.4 శాతానికి సవరించారు. అమెరికా నిరుద్యోగ క్లెయిమ్లు 2021 ప్రారంభ స్థాయికి చేరాయి. అమెరికా కోర్ పీసీఈ 2.6 శాతానికి నెమ్మదించింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 2.4% లాభంతో 79,033 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 2.2% పెరిగి 24,011 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో ఐటీ, చమురు-గ్యాస్, విద్యుత్ లాభపడగా.. స్థిరాస్తి, లోహ, మన్నికైన వినిమయ వస్తువుల షేర్లు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.4,622 కోట్ల విలువైన షేర్లను, డీఐఐలు రూ.7,186 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. జూన్లో విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు) నికరంగా రూ.26,565 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 6:5గా నమోదు కావడం..
ఎంపిక చేసిన షేర్లలో కదలికలను సూచిస్తోంది.
ఈ వారంపై అంచనా: గత వారం 79,891 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసిన సెన్సెక్స్, లాభాల్లో ముగిసింది.. స్వల్పకాలంలో సూచీ మరింత పెరిగే అవకాశం ఉంది. సూచీలు పరుగులు తీసినప్పటికీ.. కొన్ని చిన్న, మధ్య స్థాయి షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. స్వల్పకాలంలో ఇదే ధోరణి కొనసాగొచ్చు. 77,400- 78,000 పాయింట్ల శ్రేణి ఎగువన సెన్సెక్స్ ట్రేడైనంత వరకు సానుకూలతలు కొనసాగే అవకాశం ఉంది. ఈ స్థాయి దిగువన ముగిస్తే స్థిరీకరణకు అవకాశం ఉంటుంది.
ప్రభావిత అంశాలు: దేశీయ సూచీలకు అంతర్జాతీయ సంకేతాలు దిశానిర్దేశం చేయొచ్చు. జూన్ నెల వాహన విక్రయ గణాంకాలు, తయారీ- సేవల పీఎంఐ, మౌలిక రంగ వృద్ధి, జీఎస్టీ వసూళ్ల గణాంకాలు కీలకం కానున్నాయి. సాధారణ బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో షేరు/రంగం ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. షేర్ల ధరలు అధిక విలువలకు చేరడంతో, కొంత ఒడుదొడుకులకు అవకాశం ఉంది. వచ్చే కొన్ని వారాల్లో రుతుపవనాల పురోగతి కీలకం కానుంది. జులైలో మెరుగైన వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అంతర్జాతీయంగా చూస్తే.. పలు దేశాల తయారీ పీఎంఐ, జపాన్ వినియోగదారు విశ్వాసం, సేవల పీఎంఐ గణాంకాలపై దృష్టిపెట్టొచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ పావెల్ ప్రసంగం, బ్రిటన్ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపొచ్చు. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్ఐఐ పెట్టుబడులు, చమురు ధరల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధరలు పెరిగి, మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినొచ్చు.
తక్షణ మద్దతు స్థాయులు: 78,467, 77,800, 76,745
తక్షణ నిరోధ స్థాయులు: 78,905, 80,100, 80,600
సెన్సెక్స్ 77,400- 78,000 ఎగువన ట్రేడైతే లాభాలు కొనసాగొచ్చు.
సతీశ్ కంతేటి, జెన్ మనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హిండెన్బర్గ్కు సెబీ షోకాజ్
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విషయంలో ‘సహేతుకం కాని ట్రేడింగ్’ జరిపిందంటూ అమెరికా షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్పై భారత మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఆరోపణలు చేసింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
మదుపర్ల లాభాల స్వీకరణతో జీవనకాల గరిష్ఠ స్థాయుల నుంచి వెనక్కి వచ్చిన సెన్సెక్స్, నిఫ్టీ.. అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. -
కాంకర్లో 5-7% వాటా అమ్మకం!
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. -
మదుపర్లకు మెయిల్ ద్వారానే ఖాతా స్టేట్మెంట్లు
మదుపర్లకు ఏకీకృత ఖాతా వివరాలను (కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్- క్యాస్) నమోదిత ఇ-మెయిల్ ద్వారానే డిపాజిటరీస్, మ్యూచువల్ ఫండ్- రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ (ఎంఎఫ్- ఆర్టీఏ) పంపించాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. -
హిమాచల్లో హోటళ్లపై 20-40% రాయితీలు
వర్షాకాలంలో తమ రాష్ట్రంలో ప్రయాణించే వారికి 41 హోటళ్లలో గది అద్దెలపై 20-40% రాయితీ ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్పీటీడీసీ) ప్రకటించింది. జులై 15 నుంచి సెప్టెంబరు 13 మధ్య ఈ రాయితీలను పొందొచ్చు. -
బీఎండబ్ల్యూ రికార్డు స్థాయి విక్రయాలు
దేశంలో గతంలో ఎన్నడూ నమోదు కాని స్థాయిలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో (జనవరి-జూన్) వాహనాలను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా వెల్లడించింది. -
భారత్లో 4,000 ఉద్యోగాలు: హెగ్జావేర్
ఐటీ సేవల సంస్థ హెగ్జావేర్ టెక్నాలజీస్, అంతర్జాతీయంగా ఈ ఏడాది 6,000-8,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. -
మాస్చిప్, సోషియోనెక్ట్స్తో సీ-డ్యాక్ ఒప్పందం
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మాస్చిప్ టెక్నాలజీస్, జపాన్కు చెందిన సోషియోనెక్ట్స్ ఇంక్.తో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీ-డ్యాక్ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. -
అదనపు బ్యాగేజీ రవాణాకు సహకారం: అవాన్
విమానాల్లో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లాలంటే, అధిక ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇంత భరించలేక కొన్ని వస్తువులను విమానాశ్రయాల్లో ప్రయాణికులు వదిలేస్తుంటారు. -
20-21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే విక్రయాలు
ఈ నెల 20-21 తేదీల్లో 8వ విడత ప్రైమ్ డే విక్రయాలు ఉంటాయని అమెజాన్ ఇండియా మంగళవారం ప్రకటించింది. -
విద్యార్థుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఫారెక్స్ కార్డ్
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఒక ప్రీ పెయిడ్ ‘సఫైరో ఫారెక్స్ కార్డ్’ను ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం ఆవిష్కరించింది. -
సంక్షిప్తవార్తలు(9)
జర్మనీ వాహన దిగ్గజ సంస్థ ఫోక్స్వ్యాగన్, భారత్లోని తన సంస్థలో వాటాను స్థానిక కంపెనీకి విక్రయించాలని భావిస్తోంది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
‘మిస్టర్ మస్క్.. బగ్ను ఫిక్స్ చేయగలరా?’ స్పందించిన టెస్లా అధినేత
టెస్లా కార్ స్క్రీన్లోని సమస్యను ఎదుర్కొన్న ఓ చిన్నారి దాన్ని పరిష్కరించగలరా? అంటూ ఎలాన్మస్క్కు ట్యాగ్ చేసింది. దీనిపై మస్క్ సమాధానం ఇచ్చారు. -
కాంటాక్టుల్లో పాస్వర్డులు.. ఇతరులతో షేరింగ్లు.. ఇదీ మన గోప్యత తీరు!
Password: పాస్వర్డుల వాడకంలో ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన ఉండడం లేదు. తాజాగా వెల్లడైన సర్వేనే ఇందుకు నిదర్శనం.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!