- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
లిక్విడేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు ఎలక్ట్రానిక్ ఫామ్లు: ఐబీబీఐ
దివాలా పరిష్కార వృత్తి నిపుణులకు నిబంధనల భారం సులభతరం చేసేందుకు, లిక్విడేషన్ ప్రక్రియను ప్రభావవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా దివాలా స్మృతి (ఐబీసీ) కింద ఎలక్ట్రానిక్ ఫామ్లను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) తీసుకొచ్చింది.
దిల్లీ: దివాలా పరిష్కార వృత్తి నిపుణులకు నిబంధనల భారం సులభతరం చేసేందుకు, లిక్విడేషన్ ప్రక్రియను ప్రభావవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా దివాలా స్మృతి (ఐబీసీ) కింద ఎలక్ట్రానిక్ ఫామ్లను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) తీసుకొచ్చింది. లిక్విడేషన్ ప్రక్రియలో ఈ ఫామ్లు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయని, రికార్డులను పద్ధతిగా, పారదర్శకంగా నిర్వహించేందుకు, ఆటంకాలు లేని రిపోర్టింగ్కు ఇవి దోహదం చేస్తాయని ఐబీబీఐ వెల్లడించింది. జూన్ 28న తీసుకొచ్చిన కొత్త సర్క్యులర్లో ఎల్ఐక్యూ 1 నుంచి ఎల్ఐక్యూ 4 వరకు ఫామ్లను పరిచయం చేస్తున్నట్లు ఐబీబీఐ తెలిపింది. లిక్విడేషన్ ప్రక్రియలో వివిధ దశల్లో ఆయా ఎలక్ట్రానిక్ ఫామ్లను వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దివాలా పరిష్కార వృత్తి నిపుణులు (ఐపీలు) లిక్విడేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఇ-మెయిళ్ల ద్వారా బోర్డుకు తెలియజేస్తున్నారు. దీంతో సమయం వృథా అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫార్మా షేర్లు కోలుకుంటున్నాయ్
ఫార్మా కంపెనీలపై స్టాక్మార్కెట్ మదుపరుల్లో మళ్లీ ఆసక్తి కనిపిస్తోంది. కొవిడ్-19 ముంచుకొచ్చినప్పుడు, మందులకు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో ఫార్మా కంపెనీలు అధిక అమ్మకాలు, లాభాలు నమోదు చేశాయి. -
మదుపర్ల సంపద రూ.443 లక్షల కోట్లు
బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీల లాభాల జోరు కొనసాగింది. సెన్సెక్స్ కొత్త గరిష్ఠ స్థాయి వద్ద ముగియగా, నిఫ్టీ 24,100 పాయింట్ల ఎగువకు చేరింది. సానుకూల ఆసియా, ఐరోపా సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. -
పతంజలి ఫుడ్స్ చేతికి మరిన్ని వ్యాపారాలు
పతంజలి ఆయుర్వేద్కు చెందిన గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారాలను రూ.1,100 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు వంటనూనెల దిగ్గజ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. -
జూన్లో కార్ల విక్రయాలు 4% పెరిగాయ్
ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు గత నెలలో 4% పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ అధికంగా ఉండటంతో, విక్రయాలపై ప్రభావం పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. -
రిలయన్స్ మార్కెట్ విలువకు మరో 100 బి. డాలర్లు జత!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ మరో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) మేర పెరగనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది. -
రూ.2,000 నోట్లు 97.87% వెనక్కి వచ్చాయ్: ఆర్బీఐ
రూ.2,000 నోట్లలో 97.87% వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం వెల్లడించింది. రూ.7,581 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. -
ఆర్బీఐకి ఇద్దరు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అర్నబ్ కుమార్ ఛౌధ్రీ, చారులతా ఎస్ కర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు వీరు ఆర్బీఐలో చీఫ్ జనరల్ మేనేజర్లుగా ఉన్నారు. -
ఎయిరిండియా పైలట్ల శిక్షణ సంస్థ
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా, మహారాష్ట్రలోని అమరావతిలో పైలట్ల శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ఏడాదికి 180 మంది వాణిజ్య పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది ప్రతిపాదన. -
సంక్షిప్త వార్తలు(6)
ప్రభుత్వ రంగ సంస్థ పవర్గ్రిడ్ కార్పొరేషన్ దక్షిణ ప్రాంత చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా అఖిలేష్ పాఠక్ బాధ్యతలు చేపట్టారు. పవర్గ్రిడ్ దక్షిణ ప్రాంత ట్రాన్స్మిషన్ సిస్టమ్-1 పరిధిలో తెలంగాణ, -
ఐపీఓలకు కంపెనీలు సై
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ శివాలిక్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ: మంత్రి శ్రీధర్బాబు
-
ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
-
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు