- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సంక్షిప్త వార్తలు
భారత సైన్యం చేతికి తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్ చేరింది. బెంగళూరు సంస్థ సిగ్నల్ట్రాన్ ఈ 4జీ బేస్ స్టేషన్ను భారత సైన్యానికి అందించింది.
భారత సైన్యం చేతికి చిప్ ఆధారిత 4జీ బేస్ స్టేషన్
దిల్లీ: భారత సైన్యం చేతికి తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్ చేరింది. బెంగళూరు సంస్థ సిగ్నల్ట్రాన్ ఈ 4జీ బేస్ స్టేషన్ను భారత సైన్యానికి అందించింది. గతేడాది 4జీ ఎల్టీఈ ఎన్ఐబీ (నెట్వర్క్ ఇన్ ఏ బాక్స్) సొల్యూషన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వానికి చెందిన ఇ-మార్కెట్ప్లేస్ పోర్టల్లో భారత సైన్యం బిడ్ దాఖలు చేసింది. ఈ బిడ్ను సిగ్నల్ట్రాన్ దక్కించుకుంది. సహ్యాద్రి ఎల్టీఈ బేస్ స్టేషన్ల్లో ఈ చిప్లను, సెమీకండక్టర్ సంస్థ సిగ్నల్చిప్ అభివృద్ధి చేసిందని సిగ్నల్ట్రాన్ వ్యవస్థాపకుడు హిమాన్షు ఖాస్నిస్ తెలిపారు. 2010లో 4జీ, 5జీ నెట్వర్క్లకు చిప్లు తయారుచేసేందుకు ఫ్యాబ్లెస్ సెమీకండక్టర్ కంపెనీ సిగ్నల్చిప్ను ఖాస్నిస్, ఆయన బృందం స్థాపించింది. ఇప్పటివరకు సైన్యానికి 20 యూనిట్లు అందించామని ఖాస్నిస్ తెలిపారు. 2029కు భారత బేస్ స్టేషన్ విపణి విలువ 24 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.9 లక్షల కోట్ల)కు చేరుతుందని ఆయన అంచనా వేశారు.
కోక-కోలా బాట్లింగ్ సంస్థ బిగ్ మూసివేత
దిల్లీ: బాట్లింగ్ అనుబంధ సంస్థ బాట్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రూప్ (బిగ్)ను శీతలపానీయాల దిగ్గజం కోక-కోలా మూసివేసింది. భారత్లో హిందుస్థాన్ కోక-కోలా బెవరేజెస్ (హెచ్సీసీబీ)తో పాటు అంతర్జాతీయ బాట్లింగ్ కార్యకలాపాలు బిగ్ చేతిలోనే ఉన్నాయి. జూన్ 30న బిగ్ కార్పొరేట్ కార్యాలయాన్ని సంస్థ మూసివేసింది. దీంతో కోక కోలా అంతర్గత బోర్డు నియంత్రణలోకి భారత్, నేపాల్, శ్రీలంక కార్యకలాపాలు రానున్నాయి. బాట్లింగ్లో వాటాలను తగ్గించుకుని, బ్రాండ్, ఉత్పత్తులపై కోక కోలా దృష్టిపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 1997లో ప్రారంభమైన హిందుస్థాన్ కోక-కోలా బెవరేజెస్కు మన దేశంలో 16 ప్లాంట్లు ఉన్నాయి. 3500 మంది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా 25 లక్షల మంది రిటైలర్లకు శీతల పానీయాలను సంస్థ సరఫరా చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో రాజస్థాన్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్లాంట్లలో వాటాలను స్వతంత్ర సంస్థలకు విక్రయించడం ద్వారా రూ.2,420 కోట్లను సంస్థ సమీకరించింది. గతేడాది నవంబరులో మహారాష్ట్ర ప్లాంట్ కోసం రూ.1387 కోట్లు, గుజరాత్లో రూ.3000 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది.తెలంగాణలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ ఏడాది మేలో వెల్లడించింది.
జీడీపీ గణనకు ఆధార సంవత్సరం మార్పు?
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక ధోరణులకు, కీలక ఆర్థిక సూచీలను అనుసంధానం చేసే లక్ష్యంతో గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ (ఎఓఎస్పీఐ) విశ్వనాథ్ గోల్డర్ నేతృత్వంలో 26 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. జీడీపీ సహా జాతీయ గణాంకాల లెక్కింపులో ఆధార సంవత్సరాన్ని 2011-12 నుంచి 2020-21కు మార్పు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు తగ్గట్లుగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ), ఉత్పత్తిదారు ధరల సూచీ (పీపీఐ), వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) వంటి వాటికి ప్రస్తుత ఆధార సంవత్సరాన్ని 2020-21కు మార్చేందుకు ఈ కమిటీ సమీక్షించి సూచనలు అందజేయనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హిండెన్బర్గ్కు సెబీ షోకాజ్
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విషయంలో ‘సహేతుకం కాని ట్రేడింగ్’ జరిపిందంటూ అమెరికా షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్పై భారత మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఆరోపణలు చేసింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
మదుపర్ల లాభాల స్వీకరణతో జీవనకాల గరిష్ఠ స్థాయుల నుంచి వెనక్కి వచ్చిన సెన్సెక్స్, నిఫ్టీ.. అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. -
కాంకర్లో 5-7% వాటా అమ్మకం!
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. -
మదుపర్లకు మెయిల్ ద్వారానే ఖాతా స్టేట్మెంట్లు
మదుపర్లకు ఏకీకృత ఖాతా వివరాలను (కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్- క్యాస్) నమోదిత ఇ-మెయిల్ ద్వారానే డిపాజిటరీస్, మ్యూచువల్ ఫండ్- రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ (ఎంఎఫ్- ఆర్టీఏ) పంపించాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. -
హిమాచల్లో హోటళ్లపై 20-40% రాయితీలు
వర్షాకాలంలో తమ రాష్ట్రంలో ప్రయాణించే వారికి 41 హోటళ్లలో గది అద్దెలపై 20-40% రాయితీ ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్పీటీడీసీ) ప్రకటించింది. జులై 15 నుంచి సెప్టెంబరు 13 మధ్య ఈ రాయితీలను పొందొచ్చు. -
బీఎండబ్ల్యూ రికార్డు స్థాయి విక్రయాలు
దేశంలో గతంలో ఎన్నడూ నమోదు కాని స్థాయిలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో (జనవరి-జూన్) వాహనాలను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా వెల్లడించింది. -
భారత్లో 4,000 ఉద్యోగాలు: హెగ్జావేర్
ఐటీ సేవల సంస్థ హెగ్జావేర్ టెక్నాలజీస్, అంతర్జాతీయంగా ఈ ఏడాది 6,000-8,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. -
మాస్చిప్, సోషియోనెక్ట్స్తో సీ-డ్యాక్ ఒప్పందం
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మాస్చిప్ టెక్నాలజీస్, జపాన్కు చెందిన సోషియోనెక్ట్స్ ఇంక్.తో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీ-డ్యాక్ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. -
అదనపు బ్యాగేజీ రవాణాకు సహకారం: అవాన్
విమానాల్లో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లాలంటే, అధిక ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇంత భరించలేక కొన్ని వస్తువులను విమానాశ్రయాల్లో ప్రయాణికులు వదిలేస్తుంటారు. -
20-21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే విక్రయాలు
ఈ నెల 20-21 తేదీల్లో 8వ విడత ప్రైమ్ డే విక్రయాలు ఉంటాయని అమెజాన్ ఇండియా మంగళవారం ప్రకటించింది. -
విద్యార్థుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఫారెక్స్ కార్డ్
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఒక ప్రీ పెయిడ్ ‘సఫైరో ఫారెక్స్ కార్డ్’ను ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం ఆవిష్కరించింది. -
సంక్షిప్తవార్తలు(9)
జర్మనీ వాహన దిగ్గజ సంస్థ ఫోక్స్వ్యాగన్, భారత్లోని తన సంస్థలో వాటాను స్థానిక కంపెనీకి విక్రయించాలని భావిస్తోంది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
‘మిస్టర్ మస్క్.. బగ్ను ఫిక్స్ చేయగలరా?’ స్పందించిన టెస్లా అధినేత
టెస్లా కార్ స్క్రీన్లోని సమస్యను ఎదుర్కొన్న ఓ చిన్నారి దాన్ని పరిష్కరించగలరా? అంటూ ఎలాన్మస్క్కు ట్యాగ్ చేసింది. దీనిపై మస్క్ సమాధానం ఇచ్చారు. -
కాంటాక్టుల్లో పాస్వర్డులు.. ఇతరులతో షేరింగ్లు.. ఇదీ మన గోప్యత తీరు!
Password: పాస్వర్డుల వాడకంలో ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన ఉండడం లేదు. తాజాగా వెల్లడైన సర్వేనే ఇందుకు నిదర్శనం.