- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
2024-25లో దేశీయ వస్తు, సేవల ఎగుమతులు రూ.66 లక్షల కోట్లు
అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2024-25) దేశీయ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను (సుమారు రూ.66 లక్షల కోట్లు) అధిగమించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం
ముంబయి: అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2024-25) దేశీయ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను (సుమారు రూ.66 లక్షల కోట్లు) అధిగమించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2023-24లో దేశీయ ఎగుమతులు 778.2 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.64.50 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ఇందులో వస్తువుల ఎగుమతులు 437.10 బిలియన్ డాలర్లు (సుమారు రూ.36 లక్షల కోట్లు) కాగా.. సేవల ఎగుమతులు 341 బిలియన్ డాలర్లు (సుమారు రూ.28.50 లక్షల కోట్లు)గా ఉన్నాయి. అయితే ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్- హమాస్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, ఎర్ర సముద్రం సంక్షోభం రూపంలో అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని మంత్రి అన్నారు. అలాగే ఐరోపా లాంటి కొన్ని దిగ్గజ దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఎగుమతులు పెరుగుతుండటం (మేలో 9 శాతం వృద్ధి) ఒక సానుకూల సంకేతమన్నారు. భారత్తో వాణిజ్యాన్ని పెంచుకోవాలని ప్రపంచం కోరుకుంటున్న విషయాన్ని ఇది తెలియజేస్తోందని ఇక్కడ జరిగిన రత్నాలు, ఆభరణాల ఎగుమతిదార్ల కార్యక్రమంలో మాట్లాడుతూ గోయల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు 800 బిలియన్ డాలర్లకు పైగా నమోదుకావచ్చని భావిస్తున్నామని, ఇదే జరిగితే ఓ చరిత్రాత్మక రికార్డు అవుతుందని వివరించారు. గత సంవత్సరం కరెంటు ఖాతా లోటు కూడా తగ్గిందని తెలిపారు. ఎగుమతులు పెరిగితే తయారీ రంగానికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. మార్చి త్రైమాసికంలో భారత్ 5.7 బిలియన్ డాలర్లు లేదా జీడీపీలో 0.6 శాతం కరెంటు ఖాతా మిగులును నమోదు చేసింది. కరెంటు ఖాతా మిగులు నమోదు కావడం గత పది త్రైమాసికాల్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. విద్యుత్ వాహనాల వాడకం పెరిగితే చమురు దిగుమతులపై ఆధారపడటమూ తగ్గుతుందని మంత్రి తెలిపారు.
బ్రిటన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎఫ్టీఏ చర్చల్లో పురోగతి: బ్రిటన్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత్, బ్రిటన్ల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) ప్రతిపాదనపై చర్చల్లో పురోగతి ఉండొచ్చని భావిస్తున్నట్లు మంత్రి గోయల్ తెలిపారు. బ్రిటన్లో ఎన్నికలు జులై 4న జరగనున్నాయి. ‘ఎన్నికల్లో ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ చర్చల్లో పురోగతి ఉంటుందని అనుకుంటున్నామ’ని విలేకర్లతో మాట్లాడుతూ ఆయన అన్నారు. బ్రిటన్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎఫ్టీఏను కుదుర్చుకోవడానికి ఇప్పటికే ఆసక్తితో ఉందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫార్మా షేర్లు కోలుకుంటున్నాయ్
ఫార్మా కంపెనీలపై స్టాక్మార్కెట్ మదుపరుల్లో మళ్లీ ఆసక్తి కనిపిస్తోంది. కొవిడ్-19 ముంచుకొచ్చినప్పుడు, మందులకు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో ఫార్మా కంపెనీలు అధిక అమ్మకాలు, లాభాలు నమోదు చేశాయి. -
మదుపర్ల సంపద రూ.443 లక్షల కోట్లు
బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీల లాభాల జోరు కొనసాగింది. సెన్సెక్స్ కొత్త గరిష్ఠ స్థాయి వద్ద ముగియగా, నిఫ్టీ 24,100 పాయింట్ల ఎగువకు చేరింది. సానుకూల ఆసియా, ఐరోపా సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. -
పతంజలి ఫుడ్స్ చేతికి మరిన్ని వ్యాపారాలు
పతంజలి ఆయుర్వేద్కు చెందిన గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారాలను రూ.1,100 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు వంటనూనెల దిగ్గజ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. -
జూన్లో కార్ల విక్రయాలు 4% పెరిగాయ్
ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు గత నెలలో 4% పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ అధికంగా ఉండటంతో, విక్రయాలపై ప్రభావం పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. -
రిలయన్స్ మార్కెట్ విలువకు మరో 100 బి. డాలర్లు జత!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ మరో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) మేర పెరగనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది. -
రూ.2,000 నోట్లు 97.87% వెనక్కి వచ్చాయ్: ఆర్బీఐ
రూ.2,000 నోట్లలో 97.87% వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం వెల్లడించింది. రూ.7,581 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. -
ఆర్బీఐకి ఇద్దరు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అర్నబ్ కుమార్ ఛౌధ్రీ, చారులతా ఎస్ కర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు వీరు ఆర్బీఐలో చీఫ్ జనరల్ మేనేజర్లుగా ఉన్నారు. -
ఎయిరిండియా పైలట్ల శిక్షణ సంస్థ
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా, మహారాష్ట్రలోని అమరావతిలో పైలట్ల శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ఏడాదికి 180 మంది వాణిజ్య పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది ప్రతిపాదన. -
సంక్షిప్త వార్తలు(6)
ప్రభుత్వ రంగ సంస్థ పవర్గ్రిడ్ కార్పొరేషన్ దక్షిణ ప్రాంత చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా అఖిలేష్ పాఠక్ బాధ్యతలు చేపట్టారు. పవర్గ్రిడ్ దక్షిణ ప్రాంత ట్రాన్స్మిషన్ సిస్టమ్-1 పరిధిలో తెలంగాణ, -
ఐపీఓలకు కంపెనీలు సై
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ శివాలిక్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఒక్క రోజులో యుద్ధం ఆపేస్తానన్న ట్రంప్.. సాధ్యం కాదన్న రష్యా!
-
రెప్పపాటులో మృత్యు కాటు.. సర్పంచి దుర్మరణం
-
పిన్నెల్లితో మాజీ మంత్రుల ములాఖత్
-
తిరుమల శ్రీవారి ప్రసాదం ఇచ్చి వెళ్తూ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
-
ఏపీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చండి: లోక్సభలో తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు