- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
రాణించిన చిన్న షేర్లు
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా (తొలి ఆరు నెలల్లో) చిన్న, మధ్య స్థాయి షేర్లు రాణించాయి. రిటైల్ మదుపర్ల నుంచి వచ్చిన అసాధారణ, బలమైన గిరాకీ ఇందుకు కలిసివచ్చింది.
2024 తొలి ఆరు నెలల్లో జోరు
ద్వితీయార్ధంలోనూ హవా కొనసాగుతుందా?
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా (తొలి ఆరు నెలల్లో) చిన్న, మధ్య స్థాయి షేర్లు రాణించాయి. రిటైల్ మదుపర్ల నుంచి వచ్చిన అసాధారణ, బలమైన గిరాకీ ఇందుకు కలిసివచ్చింది. మరి రానున్న ఆరు నెలల్లో ఎలా ముందుకెళ్లవచ్చు. వాటికున్న అధిక విలువలతోనూ పరుగులు తీయగలవా? లేదంటే ఆ విలువలే భారం కానున్నాయా?
2024 తొలి ఆరు నెలల్లో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు రెండూ 21 శాతం చొప్పున పెరిగాయి. అదే సమయంలో కీలక సూచీ అయిన నిఫ్టీ మాత్రం 10.5 శాతమే పెరిగింది. అంటే చిన్న, మధ్య స్థాయి షేర్లు నిఫ్టీ కంటే రెట్టింపు లాభాలను అందించాయన్నమాట. ముఖ్యంగా నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ అయితే ఈ ఏడాదిలో ఆరు నెలల్లో నాలుగు నెలల్లో నిఫ్టీని మించిన లాభాలను ఇచ్చింది. గత ఏడాది కాలంలో చూస్తే నిఫ్టీ మిడ్క్యాప్ 51%, స్మాల్క్యాప్ సూచీ 60 శాతం మేర పరుగులు తీశాయి. అదే సమయంలో నిఫ్టీ 26.5 శాతం మేర పెరిగింది.
సానుకూలతలు ఇవీ..
ఆర్థిక మూలాలు బలంగా ఉండడం చిన్న, మధ్య స్థాయి షేర్లకు కలిసివచ్చింది. రిటైల్ మదుపర్లు భారీగా ఆసక్తి చూపడం, కార్పొరేట్ ఫలితాలూ బాగుండడం ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. డీమ్యాట్ ఖాతాల సంఖ్య కూడా పెరిగింది. ఇది కాస్తా మ్యూచువల్ ఫండ్లు, సిప్ల నుంచి ఈ షేర్లలోకి పెట్టుబడులు కొనసాగేలా చేశాయి. వీటికి తోడు చిన్న, మధ్య స్థాయి కంపెనీలుండే స్థిరాస్తి, రక్షణ వంటి రంగాలు బలమైన ఫలితాలను నమోదు చేయడమూ కలిసివచ్చిన అంశంగా చెప్పవచ్చు.
ద్వితీయార్ధంలో జోరు కొనసాగుతుందా?
ఇప్పటికే చిన్న, మధ్య స్థాయి విభాగాల్లో విలువలు భారీగా పెరిగాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందువల్ల ద్వితీయార్ధంలో మోస్తరు పనితీరుకే ఇవి పరిమితం కావొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ఈ అధిక విలువల వల్ల ఊగిసలాటలకు ఆస్కారం ఉంటుందని, జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని మదుపర్లకు సూచిస్తున్నారు. అయితే మధ్య, చిన్న స్థాయి షేర్లలో నాణ్యమైన వాటికి ఇంకా 5-6 శాతం మేర లాభాలు అందించే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి అధిక నష్టభయం భరించగలిగే శక్తి ఉన్న వారు అధిక ప్రతిఫలాల కోసం ప్రయత్నించొచ్చని చెబుతున్నారు.
బడ్జెట్, ఫలితాలు కీలకం
మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల జోరు కొనసాగుతుందా లేదా అన్నది రెండు అంశాలపై ఆధారపడి ఉంది. జులైలో జరగబోయే కేంద్ర బడ్జెట్ అందులో ఒకటి కాగా.. 2024-25 తొలి త్రైమాసిక ఫలితాలు రెండోదని అంటున్నారు. బడ్జెట్లో ఆసక్తికర ప్రకటనలు ఉండడంతో పాటు క్యూ1 ఫలితాలు రాణిస్తే గనుక మదుపర్లు ఈ షేర్ల వైపు మరింత మొగ్గు చూపేందుకు అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న, మధ్య స్థాయి షేర్ల విషయంలో దుందుడుకు కొనుగోళ్లు మంచిది కాదని.. కొంత లాభాల స్వీకరణ చేయడం ఉత్తమమని అంటున్నారు. దీర్ఘకాలానికి మాత్రం ఇవి బలంగా కనిపిస్తున్నందున.. ఆ దృష్టితో కొనుగోళ్లు మంచిదేనని చెబుతున్నారు. కాబట్టి సహేతుక విలువల వద్ద ఉండి, పెద్దగా లాభాలు చూపని షేర్ల వైపు దృష్టి సారించొచ్చని సూచిస్తున్నారు.
ఈనాడు వాణిజ్య విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫార్మా షేర్లు కోలుకుంటున్నాయ్
ఫార్మా కంపెనీలపై స్టాక్మార్కెట్ మదుపరుల్లో మళ్లీ ఆసక్తి కనిపిస్తోంది. కొవిడ్-19 ముంచుకొచ్చినప్పుడు, మందులకు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో ఫార్మా కంపెనీలు అధిక అమ్మకాలు, లాభాలు నమోదు చేశాయి. -
మదుపర్ల సంపద రూ.443 లక్షల కోట్లు
బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీల లాభాల జోరు కొనసాగింది. సెన్సెక్స్ కొత్త గరిష్ఠ స్థాయి వద్ద ముగియగా, నిఫ్టీ 24,100 పాయింట్ల ఎగువకు చేరింది. సానుకూల ఆసియా, ఐరోపా సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. -
పతంజలి ఫుడ్స్ చేతికి మరిన్ని వ్యాపారాలు
పతంజలి ఆయుర్వేద్కు చెందిన గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారాలను రూ.1,100 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు వంటనూనెల దిగ్గజ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. -
జూన్లో కార్ల విక్రయాలు 4% పెరిగాయ్
ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు గత నెలలో 4% పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ అధికంగా ఉండటంతో, విక్రయాలపై ప్రభావం పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. -
రిలయన్స్ మార్కెట్ విలువకు మరో 100 బి. డాలర్లు జత!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ మరో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) మేర పెరగనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది. -
రూ.2,000 నోట్లు 97.87% వెనక్కి వచ్చాయ్: ఆర్బీఐ
రూ.2,000 నోట్లలో 97.87% వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం వెల్లడించింది. రూ.7,581 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. -
ఆర్బీఐకి ఇద్దరు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అర్నబ్ కుమార్ ఛౌధ్రీ, చారులతా ఎస్ కర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు వీరు ఆర్బీఐలో చీఫ్ జనరల్ మేనేజర్లుగా ఉన్నారు. -
ఎయిరిండియా పైలట్ల శిక్షణ సంస్థ
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా, మహారాష్ట్రలోని అమరావతిలో పైలట్ల శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ఏడాదికి 180 మంది వాణిజ్య పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది ప్రతిపాదన. -
సంక్షిప్త వార్తలు(6)
ప్రభుత్వ రంగ సంస్థ పవర్గ్రిడ్ కార్పొరేషన్ దక్షిణ ప్రాంత చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా అఖిలేష్ పాఠక్ బాధ్యతలు చేపట్టారు. పవర్గ్రిడ్ దక్షిణ ప్రాంత ట్రాన్స్మిషన్ సిస్టమ్-1 పరిధిలో తెలంగాణ, -
ఐపీఓలకు కంపెనీలు సై
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ శివాలిక్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
-
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం