- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సంక్షిప్త వార్తలు
అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణ ప్రణాళికలో భాగంగా టైటన్ కంపెనీ బంగ్లాదేశ్లో తన ఆభరణాల బ్రాండ్ తనిష్క్ను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది.
బంగ్లాదేశ్లో తనిష్క్ సేవలు
దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణ ప్రణాళికలో భాగంగా టైటన్ కంపెనీ బంగ్లాదేశ్లో తన ఆభరణాల బ్రాండ్ తనిష్క్ను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఆ మేరకు రిథమ్ గ్రూప్తో ఒక సంయుక్త సంస్థ(జేవీ) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బంగ్లాదేశ్లోని నారాయణగంజ్లో తయారీ ప్లాంటు ప్రారంభంతో ఈ సంయుక్త సంస్థ ప్రారంభమవుతుందని ఒక సంయుక్త ప్రకటనలో ఆ కంపెనీలు తెలిపాయి.
సీబీడీటీ ఛైర్మన్గా రవి అగర్వాల్
దిల్లీ: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)కు కొత్త ఛైర్మన్గా రవి అగర్వాల్ నియమితులయ్యారు. ఈయన 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. 2025 జూన్ వరకు రవి అగర్వాల్ సీబీడీటీ ఛైర్మన్గా కొనసాగుతారని నియామకాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ కమిటీ జారీ చేసిన ఆదేశాల ఆధారంగా తెలుస్తోంది. వాస్తవానికి అగర్వాల్ సెప్టెంబరులో పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే వచ్చే ఏడాది జూన్ వరకు ‘కాంట్రాక్టు పద్ధతిలో పునర్నియామకం’ ప్రకారం ఆయన ఈ హోదాలో కొనసాగుతారని ఆ ఆదేశాల్లో ఉంది. ప్రస్తుతం సీబీడీటీ ఛైర్మన్గా ఉన్న నితిన్ గుప్తా స్థానంలో అగర్వాల్ బాధ్యతలు చేపట్టనున్నారు. నితిన్ గుప్తా 2022 జూన్లో సీబీడీటీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. గతేడాది సెప్టెంబరులో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. తొమ్మిది నెలలు అంటే ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగింపు ఇచ్చారు.
డిజిటల్ రుణాలు 49% పెరిగాయ్
2023-24పై పరిశ్రమ సమాఖ్య ‘ఫేస్’
ముంబయి: డిజిటల్ రుణాలపై ఒకవైపు ఆందోళనలు కొనసాగుతున్నా, 2023-24లో ఇవి 49 శాతం మేర పెరిగి రూ.1.46 లక్షల కోట్లకు చేరాయని 37 సభ్య సంస్థలు కలిగి ఉన్న పరిశ్రమ సమాఖ్య ఫిన్టెక్ అసోసియేషన్ ఫర్ కన్జూమర్ ఎంపవర్మెంట్(ఫేస్) వెల్లడించింది. సంఖ్యా పరంగా పంపిణీ చేసిన రుణాలు కూడా 35 శాతం మేర పెరిగి 10 కోట్లకు పైగా చేరాయని తెలిపింది. మార్చి త్రైమాసికంలో కంపెనీలు రూ.40,322 కోట్ల (సంఖ్యా పరంగా 2.69 కోట్లు) రుణాలను పంపిణీ చేశాయి. సగటు రుణ పరిమాణం రూ.13,418గా ఉంది. మొత్తం ఆర్థిక సంవత్సరం (2023-24)లో సగటు రుణ పరిమాణం రూ.12,648గా నమోదైంది. 2022-23లో ఈ పరిమాణం రూ.11,094గా ఉంది. మొత్తం పంపిణీ చేసిన రుణాల్లో 70 శాతం 28 కంపెనీలవేనని, ఇవన్నీ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు)గా నమోదయ్యాయని లేదా ఇన్-హౌస్ ఎన్బీఎఫ్సీని కలిగి ఉన్నాయని ఫేస్ తెలిపింది. వీటి వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫార్మా షేర్లు కోలుకుంటున్నాయ్
ఫార్మా కంపెనీలపై స్టాక్మార్కెట్ మదుపరుల్లో మళ్లీ ఆసక్తి కనిపిస్తోంది. కొవిడ్-19 ముంచుకొచ్చినప్పుడు, మందులకు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో ఫార్మా కంపెనీలు అధిక అమ్మకాలు, లాభాలు నమోదు చేశాయి. -
మదుపర్ల సంపద రూ.443 లక్షల కోట్లు
బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీల లాభాల జోరు కొనసాగింది. సెన్సెక్స్ కొత్త గరిష్ఠ స్థాయి వద్ద ముగియగా, నిఫ్టీ 24,100 పాయింట్ల ఎగువకు చేరింది. సానుకూల ఆసియా, ఐరోపా సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. -
పతంజలి ఫుడ్స్ చేతికి మరిన్ని వ్యాపారాలు
పతంజలి ఆయుర్వేద్కు చెందిన గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారాలను రూ.1,100 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు వంటనూనెల దిగ్గజ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. -
జూన్లో కార్ల విక్రయాలు 4% పెరిగాయ్
ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు గత నెలలో 4% పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ అధికంగా ఉండటంతో, విక్రయాలపై ప్రభావం పడినట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. -
రిలయన్స్ మార్కెట్ విలువకు మరో 100 బి. డాలర్లు జత!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ మరో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) మేర పెరగనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది. -
రూ.2,000 నోట్లు 97.87% వెనక్కి వచ్చాయ్: ఆర్బీఐ
రూ.2,000 నోట్లలో 97.87% వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం వెల్లడించింది. రూ.7,581 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. -
ఆర్బీఐకి ఇద్దరు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అర్నబ్ కుమార్ ఛౌధ్రీ, చారులతా ఎస్ కర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు వీరు ఆర్బీఐలో చీఫ్ జనరల్ మేనేజర్లుగా ఉన్నారు. -
ఎయిరిండియా పైలట్ల శిక్షణ సంస్థ
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా, మహారాష్ట్రలోని అమరావతిలో పైలట్ల శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ఏడాదికి 180 మంది వాణిజ్య పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది ప్రతిపాదన. -
సంక్షిప్త వార్తలు(6)
ప్రభుత్వ రంగ సంస్థ పవర్గ్రిడ్ కార్పొరేషన్ దక్షిణ ప్రాంత చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా అఖిలేష్ పాఠక్ బాధ్యతలు చేపట్టారు. పవర్గ్రిడ్ దక్షిణ ప్రాంత ట్రాన్స్మిషన్ సిస్టమ్-1 పరిధిలో తెలంగాణ, -
ఐపీఓలకు కంపెనీలు సై
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ శివాలిక్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు