- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
డాక్టర్ రెడ్డీస్ నుంచి పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధం
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగించే పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ లైఫ్సైన్సెస్ ఉమ్మడిగా విక్రయించనున్నాయి.
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగం
జైడస్ లైఫ్సైన్సెస్తో లైసెన్సింగ్ ఒప్పందం
ఈనాడు, హైదరాబాద్: రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగించే పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ లైఫ్సైన్సెస్ ఉమ్మడిగా విక్రయించనున్నాయి. దీనిపై రెండు కంపెనీల మధ్య లైసెన్సింగ్ ఒప్పందం కుదిరింది. ఈ బయోసిమిలర్ ఔషధాన్ని జైడస్ రీసెర్చ్ సెంటర్ (జడ్ఆర్సీ)లోని శాస్త్రవేత్తల బృందం సొంతంగా అభివృద్ధి చేసింది. రెండు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం డాక్టర్ రెడ్డీస్కు ఈ మందుపై జైడస్ నుంచి ‘సెమీ-ఎక్స్క్లూజివ్’ హక్కులు లభిస్తాయి. దీని కోసం జైడస్కు లైసెన్సింగ్ ఫీజును డాక్టర్ రెడ్డీస్ చెల్లిస్తుంది. పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ ‘వుమ్యాబ్’ అనే బ్రాండుతో విక్రయిస్తుంది. అదే సమయంలో జైడస్ దీన్ని ‘సిగ్రిమా’ అనే పేరుతో విడుదల చేస్తుంది. రొమ్ము క్యాన్సర్ (హెర్2 పాజిటివ్) వచ్చిన వారికి కీమోథెరపీ, ట్రస్టుజుమ్యాబ్, పెర్టుజుమ్యాబ్ మందులు వినియోగిస్తారు. డాక్టర్ రెడ్డీస్ ఇప్పటికే హెర్విక్టా అనే బ్రాండు పేరుతో ట్రస్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని విక్రయిస్తోంది. పెర్టుజుమ్యాబ్ మందును కూడా ఇప్పుడు అందుబాటులోకి తీసుకువస్తున్నందున రొమ్ము క్యాన్సర్ బాధితులకు పూర్తి చికిత్సను తాము అందించినట్లు అవుతుందని డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది. సరైన చికిత్స తీసుకోని పక్షంలో హెర్2 పాజిటివ్ రొమ్ము క్యాన్సర్ వేగంగా విస్తరిస్తుంది. ఏటా 2 లక్షలకు పైగా రొమ్ము క్యాన్సర్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 25 శాతం కేసులు హెర్2 పాజిటివ్ కేసులు ఉంటున్నాయి. జైడస్తో ఒప్పందం వల్ల మనదేశంలో ఎక్కువ మందికి పెర్టుజుమ్యాబ్ మందును అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఏర్పడినట్లు డాక్టర్ రెడ్డీస్ వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారతీయ వివాహ వైభోగమే!
భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణం సుమారు రూ.10 లక్షల కోట్లు (130 బిలియన్ డాలర్లు)గా ఉందని బ్రోకరేజీ జెఫ్రీస్ నివేదిక పేర్కొంది. -
పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్
స్టాక్ మార్కెట్లు ఈ వారం చాలా తక్కువ శ్రేణిలోనే కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎటువంటి ప్రధాన వార్తలూ లేకపోవడానికి తోడు, కొద్ది రోజుల ర్యాలీతో షేర్ల ధరలు అధిక స్థాయిలకు చేరడం ఇందుకు కారణంగా నిలవవచ్చని చెబుతున్నారు. -
3 ఐపీఓలు.. రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యం
నిధుల సమీకరణ కోసం ఈ వారం రెండు మెయిన్ బోర్డ్ ఐపీఓలు, ఒక ఎస్ఎంఈ ఐపీఓ రాబోతున్నాయి. మొత్తం రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇవి వస్తున్నాయి. -
పత్తి సానుకూలమే!
పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,044 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. -
77400- 78000 పాయింట్ల శ్రేణి కీలకం!
దేశీయ గణాంకాలు, అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం మార్కెట్లు జీవనకాల తాజా గరిష్ఠాలను అధిరోహించాయి. ఎఫ్ఐఐ, డీఐఐ కొనుగోళ్లు ఇందుకు అండగా నిలిచాయి. -
లిక్విడేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు ఎలక్ట్రానిక్ ఫామ్లు: ఐబీబీఐ
దివాలా పరిష్కార వృత్తి నిపుణులకు నిబంధనల భారం సులభతరం చేసేందుకు, లిక్విడేషన్ ప్రక్రియను ప్రభావవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా దివాలా స్మృతి (ఐబీసీ) కింద ఎలక్ట్రానిక్ ఫామ్లను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) తీసుకొచ్చింది. -
సంక్షిప్త వార్తలు
భారత సైన్యం చేతికి తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్ చేరింది. బెంగళూరు సంస్థ సిగ్నల్ట్రాన్ ఈ 4జీ బేస్ స్టేషన్ను భారత సైన్యానికి అందించింది. -
భారత్లో చదువు కంటే వివాహాలపైనే ఖర్చెక్కువ: జెఫరీస్
Indian Weddings: భారత్లో వివాహాల సమయంలో జరిగే ఆడంబరాల గురించి జెఫరీస్ నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. చేసే ఖర్చు, వివిధ రంగాలకు లభించే గిరాకీ గురించి ప్రస్తావించింది.