- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సంక్షిప్త వార్తలు(7)
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. జులై 3 నుంచి మొబైల్ సేవల టారిఫ్లను 12-27 శాతం పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం.
రిలయన్స్ @ రూ.21 లక్షల కోట్లు
దిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. జులై 3 నుంచి మొబైల్ సేవల టారిఫ్లను 12-27 శాతం పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం. బీఎస్ఈలో ఇంట్రాడేలో 3.27% పెరిగిన షేరు రూ.3,161.45 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.31 శాతం లాభంతో రూ.3,131.85 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 30 షేర్లలో ఎక్కువగా లాభపడిన షేరు ఇదే. ట్రేడింగ్ ముగిసేసరికి కంపెనీ మార్కెట్ విలువ రూ.47,777.47 కోట్లు పెరిగి రూ.21.18 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 21.16 శాతం దూసుకెళ్లింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న రూ.20 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా రిలయన్స్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ తర్వాత ఎక్కువ మార్కెట్ విలువ ఉన్న కంపెనీల్లో టీసీఎస్ (రూ.14.12 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ.12.80 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.8.44 లక్షల కోట్లు), భారతీ ఎయిర్టెల్ (రూ.8.22 లక్షల కోట్లు) ఉన్నాయి.
కిమ్స్ హాస్పిటల్స్ షేర్ల విభజన
ఈనాడు, హైదరాబాద్: కిమ్స్ హాస్పిటల్స్ (కృష్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఈక్విటీ షేర్లను విభజించాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో షేరు ముఖ విలువ రూ.10 కాగా, దీన్ని రూ.2 ముఖ విలువ గల 5 షేర్లుగా విభజిస్తారు. వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో వాటాదార్ల అనుమతి తీసుకొని ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. షేరు విభజించటం వల్ల లిక్విడిటీ పెరుగుతుంది. ఎక్కువ మంది మదుపరులు క్రయవిక్రయాలు సాగించేందుకు వీలు కలుగుతుంది.
కేంద్రం అప్పులు రూ.171.78 లక్షల కోట్లు
ఆర్థిక శాఖ వెల్లడి
దిల్లీ: మార్చి 2024 చివరికల్లా కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.171.78 లక్షల కోట్లకు పెరిగాయని ప్రభుత్వ అప్పుల నిర్వహణ త్రైమాసిక నివేదిక(జనవరి-మార్చి 2024) పేర్కొంది. డిసెంబరు చివర్లోని రూ.166.14 కోట్లతో పోలిస్తే ఇవి 3.4 శాతం అధికమని ఆర్థిక శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో వాణిజ్య బ్యాంకుల వాటా 37.7%గా ఉన్నాయి. ఇక బీమా కంపెనీల వాటా 26%, ఎఫ్పీఐల వాటా 2.3 శాతంగా నమోదైంది. ఆర్బీఐ వాటా 12.3 శాతానికి పరిమితమైంది.
ఎల్ఎఫ్ఎస్ బ్రోకింగ్ రిజిస్ట్రేషన్ రద్దు
ఎండీపై 5 ఏళ్ల నిషేధం
దిల్లీ: ఎల్ఎఫ్ఎస్ బ్రోకింగ్ రిజిస్ట్రేషన్ను మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ రద్దు చేసింది. ఆ కంపెనీ ఎండీ సయ్యద్ జియాజుర్ రెహమాన్ను ఏ నమోదిత ఇంటర్మీడియటరీలో చేరకుండా లేదా సంబంధాలు ఉండకుండా 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఎల్ఎఫ్ఎస్ బ్రోకింగ్కు ఉన్న స్టాక్బ్రోకర్, పోర్ట్ఫోలియో మేనేజర్, డిపాజిటరీ పార్టిసిపెంట్, రీసెర్చ్ అనలిస్ట్.. రిజిస్ట్రేషన్లన్నింటినీ సెబీ రద్దు చేసింది. ‘రెహమాన్ నిజాయతీ, నైతికత, విలువలతో కానీ, న్యాయంగా కానీ వ్యవహరించలేదు. మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించార’ని 56 పేజీల ఆదేశాల్లో సెబీ పేర్కొంది. నిధులను అక్రమ పద్ధతుల్లో మళ్లించి మదుపర్లను మోసం చేశారనీ తెలిపింది. ఇక ఎల్ఎఫ్ఎస్ బ్రోకింగ్ తన రిజిస్ట్రేషన్ను దుర్వినియోగం చేసి ఎల్ఎఫ్ఎస్-పీఎమ్ఎస్, మరో రిజిస్టర్కాని సంస్థ ఎమ్ఓఎల్ కమొడిటీస్ను ప్రమోట్ చేసిందని సెబీ దర్యాప్తులో వెల్లడైంది.
సిగ్నిటీలో మెజార్టీ వాటా కొనుగోలుకు కోఫోర్జ్కు సీసీఐ అనుమతి
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ టెస్టింగ్ సేవల సంస్థ అయిన సిగ్నిటీ టెక్నాలజీస్లో మెజార్టీ వాటా కొనుగోలు చేయటానికి కోఫోర్జ్ లిమిటెడ్కు మార్గం సుగమం అయింది. ఈ ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతి ఇచ్చింది. సిగ్నిటీలో ప్రమోటర్లు, కొందరు ఇతర వాటాదార్ల నుంచి 54 శాతం వాటా కొనుగోలు చేయటానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోఫోర్జ్ మే 2న ప్రకటించిన విషయం విదితమే. తదనంతరం సెబీ నిబంధనల ప్రకారం సిగ్నిటీలోని సాధారణ వాటాదార్ల నుంచి మరో 25 శాతం వాటాను రూ.1,415 షేరు ధరకు కొనుగోలు చేయటానికి ‘ఓపెన్ ఆఫర్’ కూడా ప్రకటించింది. అదే సమయంలో దీనికి కాంపిటీషన్ చట్టం ప్రకారం సీసీఐ నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసింది. సీసీఐ నుంచి ఈ నెల 25న అనుమతి వచ్చినట్లు తాజాగా కోఫోర్జ్ లిమిటెడ్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది.
యూకే కంపెనీని కొనుగోలు చేసిన అరబిందో ఫార్మా
ఈనాడు, హైదరాబాద్: యూకేలోని ఏస్ లేబొరేటరీస్ అనే సంస్థను అరబిందో ఫార్మా సొంతం చేసుకుంది. నెదర్లాండ్స్లోని తన స్టెప్-డౌన్ సబ్సిడరీ కంపెనీ అయిన ఎజైల్ ఫార్మా బీవీ ద్వారా ఏస్ లేబొరేటరీస్ 100 శాతం ఈక్విటీని రూ.17.91 కోట్లకు కొనుగోలు చేసినట్లు అరబిందో ఫార్మా శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. ఏస్ లేబొరేటరీస్ కెమికల్, బయోలాజికల్ మందులకు క్వాలిటీ కంట్రోల్, టెస్టింగ్- అనలైటికల్ డెవలప్మెంట్ సేవలు అందిస్తోంది. ఈ సంస్థ జూన్ 30, 2023తో ముగిసిన 12 నెలల కాలానికి రూ.8.95 కోట్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించింది. మరోపక్క, అరబిందో ఫార్మాకు చెందిన యూగియా ఎస్ఈజడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టెప్-డౌన్ సబ్సిడరీకి హైదరాబాద్ సమీపంలోని జడ్చర్ల వద్ద ఉన్న ఇంజక్టబుల్ ఔషధాల యూనిట్ను యూఎస్ఎఫ్డీఏ బృందం నాలుగు నెలల క్రితం తనిఖీ చేసింది. ఈ యూనిట్కు తాజాగా యూఎస్ఎఫ్డీఏ వీఏఐ(వలంటరీ యాక్షన్ ఇండికేటెడ్)గా వర్గీకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త గరిష్ఠాల వద్ద ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 443, నిఫ్టీ 131 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. -
ఐపీఓకు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్.. రూ.3వేల కోట్ల సమీకరణ
Niva Bupa IPO: ప్రముఖ ఆరోగ్య బీమా కంపెనీ నివా బుపా ఐపీఓకు రాబోతోంది. సెబీ ఆమోదం కోరుతూ ప్రాథమిక పత్రాలు సమర్పించింది. -
సమాచారం కావాలంటే.. ఇక వాట్సప్లో సెర్చ్ చేయొచ్చు!
Meta AI: వాట్సప్లో ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏ సమాచారం అయిన క్షణాల్లో తెలుసుకోవడానికి వీలుపడుతుంది. -
ఐటీ రిటర్నులు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసా?
ITR filing 2023-24: ఐటీఆర్ దాఖలు చేసే సమయం దగ్గర పడటంతో అందరూ రిటర్నులు ఫైల్ చేయడం మొదలు పెట్టేశారు. అసలు రిటర్నులు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాల గురించి తెలుసా? -
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర..
LPG commercial cylinder Price: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించాయి. ఒక్కో సిలిండర్పై రూ.32 తగ్గడం గమనార్హం. -
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 79,113 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు ఎగబాకి 24,023 దగ్గర కొనసాగుతోంది. -
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
భారతీయ వివాహ వైభోగమే!
భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణం సుమారు రూ.10 లక్షల కోట్లు (130 బిలియన్ డాలర్లు)గా ఉందని బ్రోకరేజీ జెఫ్రీస్ నివేదిక పేర్కొంది. -
పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్
స్టాక్ మార్కెట్లు ఈ వారం చాలా తక్కువ శ్రేణిలోనే కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎటువంటి ప్రధాన వార్తలూ లేకపోవడానికి తోడు, కొద్ది రోజుల ర్యాలీతో షేర్ల ధరలు అధిక స్థాయిలకు చేరడం ఇందుకు కారణంగా నిలవవచ్చని చెబుతున్నారు. -
3 ఐపీఓలు.. రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యం
నిధుల సమీకరణ కోసం ఈ వారం రెండు మెయిన్ బోర్డ్ ఐపీఓలు, ఒక ఎస్ఎంఈ ఐపీఓ రాబోతున్నాయి. మొత్తం రూ.2,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇవి వస్తున్నాయి. -
పత్తి సానుకూలమే!
పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,044 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. -
77400- 78000 పాయింట్ల శ్రేణి కీలకం!
దేశీయ గణాంకాలు, అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం మార్కెట్లు జీవనకాల తాజా గరిష్ఠాలను అధిరోహించాయి. ఎఫ్ఐఐ, డీఐఐ కొనుగోళ్లు ఇందుకు అండగా నిలిచాయి. -
లిక్విడేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు ఎలక్ట్రానిక్ ఫామ్లు: ఐబీబీఐ
దివాలా పరిష్కార వృత్తి నిపుణులకు నిబంధనల భారం సులభతరం చేసేందుకు, లిక్విడేషన్ ప్రక్రియను ప్రభావవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా దివాలా స్మృతి (ఐబీసీ) కింద ఎలక్ట్రానిక్ ఫామ్లను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) తీసుకొచ్చింది. -
సంక్షిప్త వార్తలు
భారత సైన్యం చేతికి తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్ చేరింది. బెంగళూరు సంస్థ సిగ్నల్ట్రాన్ ఈ 4జీ బేస్ స్టేషన్ను భారత సైన్యానికి అందించింది. -
భారత్లో చదువు కంటే వివాహాలపైనే ఖర్చెక్కువ: జెఫరీస్
Indian Weddings: భారత్లో వివాహాల సమయంలో జరిగే ఆడంబరాల గురించి జెఫరీస్ నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. చేసే ఖర్చు, వివిధ రంగాలకు లభించే గిరాకీ గురించి ప్రస్తావించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్త గరిష్ఠాల వద్ద ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
-
మన అమ్మాయిలూ గెలిచేశారు!
-
మోదీ అంతరిక్షంలోకి వెళ్లగలరా? - ఇస్రో చీఫ్ ఏమన్నారంటే!
-
జులై 4న దిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు
-
ఆ ఎమ్మెల్యేలిద్దరినీ విప్లుగా ప్రకటించండి: సీఎం చంద్రబాబుకు పవన్ లేఖ
-
ఐపీఓకు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్.. రూ.3వేల కోట్ల సమీకరణ