- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
అదానీ రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూపు తన వ్యాపార కంపెనీల్లో రూ.1.3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని ప్రణాళికగా పెట్టుకుంది.
2024-25లో గ్రూపు కంపెనీలపై వెచ్చించాలని ప్రణాళిక: సీఎఫ్ఓ
అహ్మదాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూపు తన వ్యాపార కంపెనీల్లో రూ.1.3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని ప్రణాళికగా పెట్టుకుంది. ఓడరేవుల దగ్గర నుంచి ఇంధనం, విమానాశ్రయాలు, కమొడిటీలు, సిమెంటు, మీడియా.. ఇలా పలు వ్యాపారాలను అదానీ గ్రూపు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాపారాల వృద్ధి నిమిత్తం రాబోయే 7-10 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,30,000 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టాలని ఇప్పటికే అదానీ గ్రూపు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఈ నిధులను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 70 శాతం నిధులను అంతర్గతంగా సమీకరించనుండగా.. మిగిలిన మొత్తం రుణ రూపేణా ఉంటుందని అదానీ గ్రూపు ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్ఓ) జుగేషిందర్ రాబీ సింగ్ తెలిపారు. ఈ ఏడాదిలో గడువు తీరిపోనున్న 3-4 బిలియన్ డాలర్ల రుణాన్ని కూడా రీఫైనాన్స్ చేసేందుకు గ్రూపు యోచన చేస్తోందని పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్ట్ ఫైనాన్స్ కింద 1 బిలియన్ డాలర్ల రుణాన్ని తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది పలు ప్రాజెక్టుల్లో చాలా వరకు పూర్తవుతాయని సింగ్ తెలిపారు. పునరుత్పాదక విద్యుత్ సంస్థ అదానీ గ్రీన్ 6-7 గిగావాట్ల ప్రాజెక్టును పూర్తి చేయనుండగా.. సోలార్ వేఫర్ తయారీ యూనిట్ కార్యకలాపాలూ మొదలయ్యాయి. ముంబయిలో కొత్త విమానాశ్రయం కూడా పూర్తవుతుందని ఆయన తెలిపారు.
పునరుత్పాదక విద్యుత్పై రూ.2 లక్షల కోట్లు: 2030 నాటికి అదనంగా 40 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించేందుకు రూ.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూపు భావిస్తోంది. ప్రస్తుతం సౌర, పనవ విద్యుత్ లాంటి పునరుత్పాదక మార్గాల ద్వారా 10 గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. ఏటా 6-7 గిగావాట్ల మేర పెంచుతూ 2030 కల్లా తన మొత్తం పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని 50 గిగావాట్లకు చేర్చనుంది. ఒక్కో మెగావాట్కు రూ.5 కోట్లు చొప్పున ఖర్చవుతుందని భావించి 40 గిగావాట్లకు రూ.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నట్లు అదానీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ తెలిపారు. 2030 కల్లా తొలివిడతలో కనీసం 5000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు (పీఎస్పీ) సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగ్ తెలిపారు. తొలి 500 మెగావాట్ల పీఎస్పీ నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం అయ్యిందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోర్టింగ్కు కొత్త రూల్.. సిమ్ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!
New MNP rules: మొబైల్ నంబర్ పోర్టింగ్కు కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. -
చిన్న కంపెనీలూ డిజిటైజేషన్ బాటలో
వచ్చే ఏడాది కల్లా దాదాపు 60 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్ఎమ్ఈ)లు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయనున్నాయని వొడాఫోన్ ఐడియా బిజినెస్ తన నివేదికలో పేర్కొంది. -
ఎయిర్టెల్ ఛార్జీలూ పెరిగాయ్
ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ టారిఫ్లను 10-21 శాతం పెంచుతున్నట్లు శుకవ్రారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధం
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగించే పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ లైఫ్సైన్సెస్ ఉమ్మడిగా విక్రయించనున్నాయి. -
రికార్డుల పరుగుకు విరామం
మూడు రోజుల రికార్డుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్ షేర్లలో మదుపర్ల లాభాల స్వీకరణతో గరిష్ఠ స్థాయుల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ వెనక్కి వచ్చాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 83.34 వద్ద ముగిసింది. -
ప్రాథమిక డీమ్యాట్ ఖాతా పరిమితి రూ.10 లక్షలకు పెంపు
సెక్యూరిటీల మార్కెట్లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యం పెంచేందుకు, ప్రాథమిక సేవల డీమ్యాట్ ఖాతా (బీఎస్డీఏ) పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సెబీ తెలిపింది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ నుంచి సరికొత్త కాంప్లెక్స్ ఎరువు
‘పరమ్ఫోస్ ప్లస్’ అనే పేరుతో మెగ్నీషియంతో కూడిన కాంప్లెక్స్ ఎరువును కోరమాండల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. -
మేలో కీలక రంగాల వృద్ధి 6.3%
మేలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తిలో 6.3 శాతం మేర వృద్ధి నమోదైంది. విద్యుత్, బొగ్గు, సహజవాయువు రంగాలు రాణించడం ఇందుకు ఉపకరించింది. -
చిన్ని మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా రెండో త్రైమాసికమూ ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. -
ఎంఎస్ఎంఈ సంస్థలకు యాక్సిస్ బ్యాంకు ప్రత్యేక సదుపాయాలు
అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు పలు ఆఫర్లు ప్రకటించింది. -
భారత్ ఎలక్ట్రానిక్స్కు రూ.3,172 కోట్ల ఆర్డర్లు
నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) రూ.3,172 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. -
సంక్షిప్త వార్తలు(7)
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. జులై 3 నుంచి మొబైల్ సేవల టారిఫ్లను 12-27 శాతం పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పోర్టింగ్కు కొత్త రూల్.. సిమ్ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!
-
ఆ క్యాంపెయిన్ సరైంది కాదు.. జట్టు వాతావరణం దెబ్బతినే అవకాశం: అశ్విన్
-
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్..
-
చంద్రబాబు కార్యసాధకుడు.. అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారు: సుమన్