- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
భారత్, చైనాల్లోని ఫార్మా యూనిట్ల తనిఖీల తీరుపై ఎన్నో అనుమానాలు
చైనా, భారత్లోని ఫార్మా కంపెనీల యూనిట్ల తనిఖీల తీరుతెన్నులపై యూఎస్ఎఫ్డీఏ (అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ)ను అమెరికా చట్ట సభలోని ముగ్గురు సభ్యులు నిలదీశారు.
యూఎస్ఎఫ్డీఏ కమిషనర్కు లేఖ రాసిన అమెరికా చట్టసభ సభ్యులు
వాషింగ్టన్: చైనా, భారత్లోని ఫార్మా కంపెనీల యూనిట్ల తనిఖీల తీరుతెన్నులపై యూఎస్ఎఫ్డీఏ (అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ)ను అమెరికా చట్ట సభలోని ముగ్గురు సభ్యులు నిలదీశారు. 2014 జనవరి నుంచి 2024 ఏప్రిల్ మధ్య కాలంలో ఈ రెండు దేశాల్లోని ఫార్మా యూనిట్లను యూఎస్ఎఫ్డీఏ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేసి రూపొందించిన నివేదికలు ఆశ్చర్యాన్ని, అనుమానాలను కలిగించే విధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. హౌస్ ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీ ఛైర్ కాథే మెక్మోరిస్ రోడ్జెర్స్, హెల్త్ సబ్కమిటీ ఛైర్ బ్రెట్ గుథ్రీ, ఓవర్సైట్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఛైర్ మోర్గాన్ గ్రిఫిత్ ఈ మేరకు యూఎస్ఎఫ్డీఏ కమిషనర్ రాబర్ట్ కాలిఫ్కు ఈ నెల 21న ఒక లేఖ రాశారు. ఎఫ్డీఏ ప్రమాణాల్లోని లోపాలను, సంస్థాగత బలహీనతలను ఈ తనిఖీలు ప్రతిబింబిస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.
‘ఈ తనిఖీల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. కొంతమంది ఎఫ్డీఏ ఇన్స్పెక్టర్లు తాము నిర్వహించిన ప్రతి తనిఖీలో ఏదో ఒక లోపాన్ని కనుగొన్నారు. మరికొందరు ఇన్స్పెక్టర్లు అంతా బాగానే ఉన్నట్లు నివేదికలు ఇచ్చారు. ఏదైనా సమస్యను గుర్తించడం ఎంతో అరుదుగానే జరిగింద’ని పేర్కొన్నారు. ఒక ఇన్స్పెక్టర్ భారతదేశంలో నిర్వహించిన 24 తనిఖీల్లో ఒక్కదాంట్లో కూడా సమస్యలను గుర్తించలేదని తెలిపారు. మరొక ఇన్స్పెక్టర్ చైనాలో నిర్వహించిన 23 తనిఖీల్లో 20 తనిఖీల్లో ఎటువంటి సమస్యలు లేవని నివేదికలు ఇచ్చినట్లు, అదే సమయంలో స్వదేశంలో (యూఎస్లో) నిర్వహించిన తనిఖీల్లో సగానికి సగం వ్యతిరేక నివేదికలు ఇచ్చినట్లు వివరించారు. ‘చైనా, భారతదేశాల్లో అనుసరిస్తున్న నాణ్యతా ప్రమాణాలు, జీఎంపీ (గుడ్ మానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్) ప్రమాణాల విషయంలో సందేహాలు ఉన్న తరుణంలో ఎఫ్డీఏ ఇన్స్పెక్టర్ల తనిఖీల్లో ఇటువంటి వైవిధ్యం ఉండటం ఆశ్చర్యకరం’ అని పేర్కొన్నారు. మరోపక్క 16 మంది ఇన్స్పెక్టర్లు భారతదేశంలో చేపట్టిన 325 తనిఖీల్లో.., ప్రతి తనిఖీలోనూ లోపాలు గుర్తించినట్లు తెలిపారు. అదే సమయంలో మరో ముగ్గురు ఇన్స్పెక్టర్లు చైనాలో తనిఖీలు నిర్వహించి ఎటువంటి లోపాలు లేవని నివేదికలు ఇచ్చినట్లు వివరించారు.
ఈ తనిఖీల ఫలితాలు యూఎస్ఎఫ్డీఏ తనిఖీల వ్యవస్థ సక్రమంగా లేదనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లోని ఫార్మా యూనిట్ల తనిఖీల తీరుతెన్నులపై తగిన పరిశీలన జరపాలని యూఎస్ఎఫ్డీఏ కమిషనర్ను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్న కంపెనీలూ డిజిటైజేషన్ బాటలో
వచ్చే ఏడాది కల్లా దాదాపు 60 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్ఎమ్ఈ)లు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయనున్నాయని వొడాఫోన్ ఐడియా బిజినెస్ తన నివేదికలో పేర్కొంది. -
ఎయిర్టెల్ ఛార్జీలూ పెరిగాయ్
ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ టారిఫ్లను 10-21 శాతం పెంచుతున్నట్లు శుకవ్రారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధం
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగించే పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ లైఫ్సైన్సెస్ ఉమ్మడిగా విక్రయించనున్నాయి. -
రికార్డుల పరుగుకు విరామం
మూడు రోజుల రికార్డుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్ షేర్లలో మదుపర్ల లాభాల స్వీకరణతో గరిష్ఠ స్థాయుల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ వెనక్కి వచ్చాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 83.34 వద్ద ముగిసింది. -
ప్రాథమిక డీమ్యాట్ ఖాతా పరిమితి రూ.10 లక్షలకు పెంపు
సెక్యూరిటీల మార్కెట్లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యం పెంచేందుకు, ప్రాథమిక సేవల డీమ్యాట్ ఖాతా (బీఎస్డీఏ) పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సెబీ తెలిపింది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ నుంచి సరికొత్త కాంప్లెక్స్ ఎరువు
‘పరమ్ఫోస్ ప్లస్’ అనే పేరుతో మెగ్నీషియంతో కూడిన కాంప్లెక్స్ ఎరువును కోరమాండల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. -
మేలో కీలక రంగాల వృద్ధి 6.3%
మేలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తిలో 6.3 శాతం మేర వృద్ధి నమోదైంది. విద్యుత్, బొగ్గు, సహజవాయువు రంగాలు రాణించడం ఇందుకు ఉపకరించింది. -
చిన్ని మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా రెండో త్రైమాసికమూ ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. -
ఎంఎస్ఎంఈ సంస్థలకు యాక్సిస్ బ్యాంకు ప్రత్యేక సదుపాయాలు
అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు పలు ఆఫర్లు ప్రకటించింది. -
భారత్ ఎలక్ట్రానిక్స్కు రూ.3,172 కోట్ల ఆర్డర్లు
నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) రూ.3,172 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. -
సంక్షిప్త వార్తలు(7)
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. జులై 3 నుంచి మొబైల్ సేవల టారిఫ్లను 12-27 శాతం పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..