- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సత్వ గ్రూప్ రూ.12,000-14,000 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్లో 2.5 కోట్ల చదరపు అడుగుల వాణిజ్య నిర్మాణాల్ని పూర్తి చేసిన స్థిరాస్తి సంస్థ సత్వ గ్రూప్ వచ్చే మూడేళ్లలో రూ.12,000-14,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు తెలిపింది.
రీట్ను ప్రారంభించేందుకు బ్లాక్స్టోన్తో చర్చలు
బెంగళూరు: హైదరాబాద్లో 2.5 కోట్ల చదరపు అడుగుల వాణిజ్య నిర్మాణాల్ని పూర్తి చేసిన స్థిరాస్తి సంస్థ సత్వ గ్రూప్ వచ్చే మూడేళ్లలో రూ.12,000-14,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు తెలిపింది. హైటెక్ సిటీలో మరో 30 లక్షల చదరపు అడుగుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. హౌసింగ్, కార్యాలయాలు, హోటల్ ప్రాజెక్టుల్లో తాజా పెట్టుబడులను వినియోగించనుంది. అలాగే వాణిజ్య ఆస్తుల నగదీకరణ కోసం రీట్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్)ను ప్రారంభించేందుకు దిగ్గజ పీఈ (ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్) సంస్థ బ్లాక్స్టోన్తో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సత్వ గ్రూప్ ఇప్పటికే 140 ప్రాజెక్టులు పూర్తి చేసింది. గత 30 ఏళ్లలో 8 కోట్ల చ.అ. నిర్మాణాలు చేపట్టింది. 2.3 కోట్ల చ.అ. స్థలంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. మరో 6.5 కోట్ల చ.అ. మేర ప్రాజెక్టులు భవిష్యత్లో రాబోతున్నాయి. వచ్చే 2-3 ఏళ్లలో తమ కోవర్కింగ్, కోలివింగ్ వ్యాపారాలను పబ్లిక్ ఇష్యూకు తీసుకొచ్చి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయబోతున్నామని సత్వ గ్రూప్ ఎండీ బిజయ్ అగర్వాల్ వెల్లడించారు. సింప్లీవర్క్, కోలివ్ రెండింటిలో సత్వ గ్రూప్నకు 50 శాతానికి పైగా వాటా ఉంది. రీట్ ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్న బ్లాక్స్టోన్తో కలిపి 3.2 కోట్ల చ.అ. సంయుక్త పోర్ట్ఫోలియోను సత్వ గ్రూప్ నిర్వహిస్తోంది. ఇందులో ఇప్పటికే 1.8 కోట్ల చ.అ. ప్రాజెక్టుల్ని పూర్తి చేసింది.
రూ.650 కోట్లు సమీకరించిన మైండ్స్పేస్ రీట్: సస్టెయినబిలిటీ లింక్డ్ బాండ్లను ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్కు జారీ చేసి మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ రూ.650 కోట్ల నిధుల్ని సమీకరించింది. ప్రస్తుత రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ప్రధానంగా ఈ నిధులను వినియోగించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు మైండ్స్పేస్ రీట్ సమాచారమిచ్చింది. ఈ బాండ్లు ఏడేళ్ల కాల వ్యవధితో జారీ చేసింది. కె.రహేజా గ్రూప్ స్పాన్సర్ చేసిన సంస్థే మైండ్స్పేస్ రీట్. ఇది 3.32 కోట్ల చదరపు అడుగుల పోర్ట్ఫోలియో కలిగి ఉండగా, ఇందులో 2.63 కోట్ల చ.అ. నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్న కంపెనీలూ డిజిటైజేషన్ బాటలో
వచ్చే ఏడాది కల్లా దాదాపు 60 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్ఎమ్ఈ)లు తమ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయనున్నాయని వొడాఫోన్ ఐడియా బిజినెస్ తన నివేదికలో పేర్కొంది. -
ఎయిర్టెల్ ఛార్జీలూ పెరిగాయ్
ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ టారిఫ్లను 10-21 శాతం పెంచుతున్నట్లు శుకవ్రారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధం
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగించే పెర్టుజుమ్యాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ లైఫ్సైన్సెస్ ఉమ్మడిగా విక్రయించనున్నాయి. -
రికార్డుల పరుగుకు విరామం
మూడు రోజుల రికార్డుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్ షేర్లలో మదుపర్ల లాభాల స్వీకరణతో గరిష్ఠ స్థాయుల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ వెనక్కి వచ్చాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 83.34 వద్ద ముగిసింది. -
ప్రాథమిక డీమ్యాట్ ఖాతా పరిమితి రూ.10 లక్షలకు పెంపు
సెక్యూరిటీల మార్కెట్లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యం పెంచేందుకు, ప్రాథమిక సేవల డీమ్యాట్ ఖాతా (బీఎస్డీఏ) పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు సెబీ తెలిపింది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ నుంచి సరికొత్త కాంప్లెక్స్ ఎరువు
‘పరమ్ఫోస్ ప్లస్’ అనే పేరుతో మెగ్నీషియంతో కూడిన కాంప్లెక్స్ ఎరువును కోరమాండల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. -
మేలో కీలక రంగాల వృద్ధి 6.3%
మేలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తిలో 6.3 శాతం మేర వృద్ధి నమోదైంది. విద్యుత్, బొగ్గు, సహజవాయువు రంగాలు రాణించడం ఇందుకు ఉపకరించింది. -
చిన్ని మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా రెండో త్రైమాసికమూ ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. -
ఎంఎస్ఎంఈ సంస్థలకు యాక్సిస్ బ్యాంకు ప్రత్యేక సదుపాయాలు
అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు పలు ఆఫర్లు ప్రకటించింది. -
భారత్ ఎలక్ట్రానిక్స్కు రూ.3,172 కోట్ల ఆర్డర్లు
నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) రూ.3,172 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. -
సంక్షిప్త వార్తలు(7)
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. జులై 3 నుంచి మొబైల్ సేవల టారిఫ్లను 12-27 శాతం పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించడమే ఇందుకు నేపథ్యం. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..