ట్రేడింగ్‌లో 46 లక్షలు పోగొట్టుకున్న బీటెక్‌ విద్యార్థి

పూర్తి అవగాహన ఉంటేనే ఎఫ్‌ అండ్‌ ఓలో ట్రేడ్‌ చేయాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా.. ఓ బీటెక్‌ విద్యార్థి మాత్రం పెడచెవిన పెట్టి భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు.

Published : 26 Jun 2024 02:12 IST

దిల్లీ: పూర్తి అవగాహన ఉంటేనే ఎఫ్‌ అండ్‌ ఓలో ట్రేడ్‌ చేయాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా.. ఓ బీటెక్‌ విద్యార్థి మాత్రం పెడచెవిన పెట్టి భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. తన వద్దకు వచ్చిన రిటర్నుల్లో ఓ క్లయింట్‌ ఫైల్‌ని చూసి చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఒకరు ఈ విషయాన్ని బయటపెట్టారు. ‘బీటెక్‌ చదువుతున్న ఆ స్టూడెంట్‌కు ఎటువంటి ఆదాయం లేదు. పేరెంట్స్‌ విడిపోయారు. తల్లి హోటల్‌ నడుపుతోంది. యాప్‌ల ద్వారా వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. స్నేహితుల దగ్గర అప్పు చేశాడు. తల్లిదండ్రులకు తెలియకుండానే వాళ్ల అకౌంట్‌ నుంచి కొంత డబ్బు విత్‌డ్రా చేశాడు. ఇలా డబ్బుతో ట్రేడింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. ట్రేడింగ్‌లో రూ.26 లక్షలు నష్టపోయాడు. అంతకుముందు ఏడాది లోనూ రూ.20 లక్షలు పోగొట్టుకొన్నాడు. ఎఫ్‌అండ్‌ఓ ద్వారానే మొత్తం రూ.46 లక్షలు కోల్పోయాడు’’ అని ఆ సీఏ పేర్కొన్నారు. ‘తన స్నేహితుడు ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌ ద్వారా రూ.కోటి సంపాదించాడని విని.. ఎలాగైనా డబ్బు సంపాదించాలని ట్రేడింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు మానలేకపోతున్నావని ప్రశ్నిస్తే.. ట్రేడింగ్‌కు బానిసైపోయా అని సమాధానమిచ్చాడు’’ అని అగర్వాల్‌ చెప్పుకొచ్చారు. ఈసారి మాత్రం ఇకపై ట్రేడింగ్‌ చేయనని మాటిచ్చాడంటూ ఆనందం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని